ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా..!

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా.. జాగ్రత్త.. దురదృష్టం వెంటాడుతుంది..

 

చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈ రంగు చెప్పుల్ని వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు.

కాబట్టి, ఏ రంగు చెప్పులు అస్సలు వేసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

మనం చెప్పులు కొనేటప్పుడు ఎక్కువగా స్టైల్, బ్రాండ్, ధర వంటి విషయాలకే ప్రాముఖ్యత ఇస్తాం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పుల రంగు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని రంగుల చెప్పులు మనకు ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వృత్తి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈ రంగు చెప్పుల్ని వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు. కాబట్టి, ఏ రంగు చెప్పులు వేసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు రంగు చెప్పులు

పసుపు రంగు అనేది సాధారణంగా పవిత్రతకు, మంచి శక్తికి సంకేతంగా భావిస్తారు. కానీ, పసుపు రంగులో ఉన్న చెప్పులు కొన్ని నమ్మకాల ప్రకారం అంత శుభప్రదం కాదు. జ్యోతిష్యంలో బృహస్పతి గ్రహంకు పసుపు రంగు ప్రతీక. బృహస్పతి అనేది జ్ఞానం, సంపద, గురుత్వానికి సూచిక. పసుపు రంగు చెప్పులను ధరించడం ద్వారా బృహస్పతి ప్రభావం బలహీనపడుతుందని కొంతమంది నమ్మకం. దీని వల్ల ఆర్థిక సమస్యలు, వివాహ బంధంలో కలహాలు, పిల్లల పెళ్లిళ్లు ఆలస్యం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏం చేయాలి?

చెప్పులు కొనేటప్పుడు ముఖ్యంగా చదువుకునే వాళ్లు, ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి ఆశిస్తున్నవాళ్లు పసుపు రంగు చెప్పులను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నలుపు, లేత గోధుమరంగు, బూడిద రంగులు ఎంచుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. అలాగే, శనివారం రోజు బ్లాక్ కలర్ చెప్పులు శని దోష నివారణకు సహాయపడతాయని కొందరు విశ్వసిస్తారు.

హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష.!

పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మీద జరిగిన దాడిని ముత్తారం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఖండించారు వారు మాట్లాడుతూ ఇటీవలె జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కాన్ సెంటర్స్ ను పర్మిషన్ తీసుకోవాల్సిందని ఆదేశించిన సందర్భంలో జిల్లా వైద్యాధికారినీ అగౌరపరుస్తూ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుడు మరియు అబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ మండల వైద్యాధికారి అమరేందర్ రావు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది అని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version