చివరి శ్రావణ సోమవారం అన్నదానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్లోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించారు. శివాలయం సేవకులు మలేష్ యాదవ్, కృష్ణా రెడ్డి, రమేష్, నాగేష్తో పాటు వారి బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.