సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట పరిధిలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణ ముప్పై రెండు వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన కోత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్.
ఈసందర్భంగా తిరుపతినాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఈపథకం ఉపయోగపడుతుందని, వీరికి రావడానికి కృషిచేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని .!

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని బహుకరించిన అభిమాని

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమాని తిరుపతి నాయక్ ఇటీవల సూర్యనాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర ముగిం చుకొని వచ్చి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరం గల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కలిసి బాల రాము డి చిత్ర పటాన్ని బహుకరిం చారు.ఈ సందర్భంగా తనతో పాటు తిరుపతి పాదయాత్ర చేయడమే కాక, సూర్య నాయక్ తండా నుండి అయో ధ్య సైకిల్ యాత్ర చేసి విజయ వంతంగా పూర్తిచేసుకున్న తిరుపతి దంపతులను శాలువాతో సత్కరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version