డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి

డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
* జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి. గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రస్తుతం క్రాప్ కటింగ్ పరిశోధనలు జరుపుతున్నారని, వీరితో సమయం చేసుకుంటూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలో ముగుస్తున్నందున పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎం.పి.డి.ఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు.జిల్లాలో ఉన్న బార్లు, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు. బార్ నిర్వాహకులతో వాట్స్ అప్ గ్రూప్ తయారు చేయాలని ప్రతి రోజూ ఎప్పుడు మూసి వేస్తున్నారో సమాచారం అందించాలని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అవగాహన కార్యక్రమాల్లో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు. డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని వైద్యారోగశాఖ అధికారికి సూచించారు. కళాశాలలో సడన్గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇటుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనిఅన్నారు.
ఎస్పీ మహేష్ బి.గీతే మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని, డ్రగ్స్ చిన్న సంఖ్య లో ఉన్నా కూడా తప్పనిసరిగా సీజ్ చేయాలని, జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ బంద్ చేయాలని అన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో వైన్ షాప్ ఉండకుండా చూడాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, మా దగ్గర అవసరమైన మేర డ్రగ్స్ నిర్దారణ కిట్లు, నార్కోటిక్స్ గుర్తించే డాగ్స్ అందుబాటులో ఉన్నాయని వెంటనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్స్, హ్యాండ్ బుక్ లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి , అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష,విద్యా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడిని ఖండించిన పోత్కపల్లి ముస్లింలు.

ఉగ్రదాడిని ఖండించిన పోత్కపల్లి ముస్లింలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

 

జమ్ముకాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓదెల మండలంలోని పోత్కపల్లి ముస్లింలు తెలిపారు.నమాజ్ అనంతరం చనిపోయిన పహిల్గాం టూరిస్టుల కోసం మౌనం పాటించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రధాన మంత్రి వెంటనే ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు

ఎంసీపిఐ( యు )రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి.

ఎర్ర వనంగా మారిన మాదన్నపేట అమరవీరుల సంస్మరణ సభ

ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కవి గాయకుడు యోచన కళాబృందం ఆటపాటలు

నర్సంపేట,నేటిధాత్రి:


అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయసిద్ధికై దోపిడి వర్గ నిర్మూలన కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఎంసీపిఐ( యు ) అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను గ్రామ పార్టీ కార్యదర్శి అనుమల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా అమరవీరుల స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఆనాడు కామ్రేడ్ ఓంకార్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించబడ్డాయని,ప్రజా పోరాటాలను చూసి ఓర్వలేని దోపిడివర్గ పాలకులు ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి ఆణిముత్యాలాంటి నాయకులను హత్యచేశారని ఆరోపించారు.వారు భౌతికంగా దూరమైనా వారి ఆశయాలు త్యాగాలు వృధా కాకుండా

Public struggles

చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయని ఎన్నో ఆశలు,ఆకాంక్షలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు .అమరవీరులు చూపిన బాటలో ప్రజా సమస్యలపై సమర శీల పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.సభలో ప్రముఖ కవి,గాయకులు యోచన కళాబృందం,ఐక్య ప్రజానాట్యమండలి కళాబృందం నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాగా మాదన్నపేట గ్రామం మొత్తం జెండాలతో ఎర్రవంగా మారింది.ఈ సభలో పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ , ప్రముఖ కవి గాయకులు ,యో చన , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి ,ఎన్ రెడ్డి హంస రెడ్డి ,మంద రవి ,కన్న వెంకన్న ,మాస్ సావిత్రి , గడ్డం నాగార్జున , ఎండి రాజా సాహెబ్ , కొత్తకొండ రాజమౌళి ,కనకం సంధ్య ,కేశెట్టి సదానందం ,ఎండి మా షూక్ ,ఎల్లబోయిన రాజు ,కల కోట్ల యాదగిరి ,మార్త నాగరాజు ,సుధా , కర్నె సాంబయ్య ,గుర్రం రవి , ఆకుల రాజేందర్ ,వక్కల రాజమౌళి ,కొప్పుల సమ్మక్క ,వైనాల పద్మ ,కేశెట్టి శ్రీను , అల్లం నరసయ్య ,అమరవీరుల కుటుంబ సభ్యులు ,ప్రముఖ కళాకారులు తాళ్ల సునీల్ , గాదెపాక బాబు ,బరిగల రవీందర్ ,రావుల శంకర్ ,అనిల్ కర్ణ ,నరసింహ ,సింగన బోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను.

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను
ఘనంఘ సన్మానించిన
జాతీయ క్రీడాకారులు రఘు
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

జమ్మికుంట ప్రెస్ క్లబ్
(డబ్ల్యూ జే ఐ) అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన అంబాల ప్రభాకర్ (ప్రభు) ను శుక్రవారం జమ్మికుంట అభి శ్రీ ఫౌండేషన్ కార్యాలయంలో జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుగుల రఘు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆర్టిస్ట్ గా, అంతర్జాతీయ క్రీడాకారులుగా, సామాజిక కార్యకర్తగా, అనేక రంగాలలోని కాకుండా రెండున్నర దశాబ్దాలుగా జర్నలిస్టు గా వివిధ పత్రికలలో, వివిధ టి.వి ఛానళ్ల లో పని చేయడమే కాకుండా జర్నలిస్టు సంఘంలో విశేష సేవలు అందించి ఎంతో మంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడి సాధించిన ఘనత అని అన్నారు.
భవిష్యత్తు లో జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి వాళ్లకు అండగా ఉంటూ గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కలాల ముత్యం రెడ్డి, శనిగరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

బైక్ మెకానిక్ వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మిత్ర బైక్ మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పని చేసే సాగర్ కి ఆదివారం యాక్సిడెంట్ అయ్యి త్రీవ గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గాయపడిన సాగర్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రవేట్ హాస్పిటల్ చేర్పించారు.హాస్పటల్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో,ఆర్థిక స్తోమత లేని కుటుంబం కావడంతో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సాగర్ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆత్మీయ చారిటబుల్ ట్రస్టును సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, అధ్యక్షుడు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, సభ్యులు బి.సంపత్,జె.సతీష్, కే.మోహన్,బి.లక్ష్మణరావు,ఈ. వెంకటేష్,జై.నాగరాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…

నూతన ఆర్ఓఆర్ చట్టం – 2025″, గొప్ప వేదిక

సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

రెవెన్యూ సదస్సు వేదికగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి

చారిత్రాత్మకమైన గొప్ప చట్టం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం

నారాయణపురం, బెరువాడ గ్రామాల భూ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తాం

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శుక్రవారం మహబూబాబాద్ , కేసముద్రం మండలల రైతు వేదికలలో , జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) కె.వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అంశాలపై అవహన కల్పించారు,

ఈ సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని, సామాన్య ప్రజలకు క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం, నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా
పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని,
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.

 

Collector

భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్  చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు.
అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.  ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో సర్వే చేసి, హద్దులు, నక్ష సిద్ధం జరుగుతుందన్నారు,
నారాయణపురం, పెరువాడ గ్రామాల భూ సమస్యల పరిష్కారం కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, అవసరమైతే ముఖ్యమంత్రి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు,
గత ధరణి వ్యవస్థ నిర్లక్ష్యం వలన అనేక మంది రైతులు ఇబ్బందుల పాలు అయ్యారని, ప్రస్తుత చట్టం ద్వారా క్షేత్రస్థాయిలోనే భూ సమస్యను పరిశీలించి పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని మే జూన్ నెలలో పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమలులోకి రానుందని తెలిపారు,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని గుర్తుకు చేశారు, తన వద్దకు వచ్చే సమస్యలు 80% భూ సమస్యలు మాత్రమే ఉండేవని తెలిపారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న గొప్ప చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని అన్ని సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని అన్నారు,

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మాట్లాడుతూ
భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయమైన సేవలు, అందుతాయని,
ఈ చట్టం ముఖ్యంగా విప్లవంతత్వం మైంది.
గత ధరణిలో రెవిన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు,
ప్రస్తుతం చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన విస్తృత స్థాయిలో సహాయం అందుతుందన్నారు,
క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం వెసులుబాటుకల్పించింది.
గ్రామ, మండల, డివిజనల్ స్థాయి, జిల్లాస్థాయి లలో దరఖాస్తులను పరిశీలించి ఎవరి పరిధిలో ఉంటే వారే పరిష్కరించడానికి కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారి, సర్వేయర్లను నియమించుకోవడం జరుగుతుందని అన్నారు,
ఎవరికి కేటాయించిన సమయాలలో వారు పక్కాగా సమస్య పరిష్కరించాలన్నారు,
విప్లవాత్మకమైన ఈ పథకం ద్వారా సామాన్య రైతు ప్రతి ఒక్కరు న్యాయమైన ఉచిత సేవలను త్వరితగతిన పొందుతారని సూచించారు,
రానున్న రోజుల్లో ప్రభుత్వ సూచనల మేరకు గ్రామసభలు నిర్వహించి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు,

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మాట్లాడుతూ నూతన చట్టంపై రైతులకు సవివరంగా తెలియజేశారు,

మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, రైతులు వెంకన్న, యాకూబ్ రెడ్డి, తదితరులు భూ సమస్యల పరిష్కారం కోసం అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ సమాధానం ఇచ్చారు,

ఈ రెవెన్యూ సదస్సులో
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, ఏడి సర్వే ల్యాండ్ ఏ.నరసింహమూర్తి, స్థానిక తహసిల్దార్ రాగం ఎర్రయ్య, ఎంపిడిఓ క్రాంతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాస్, ఏ ఓ వెంకన్న, పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి, ధనసరి పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం తహసిల్దార్ వనజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.40,000 లను సేకరించిన నగదును మృతుని పిల్లల పేరు మీదుగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి  జమ చేసిన ధ్రువపత్రాలను శుక్రవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని, భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు రాజు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల  రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక.!

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

 

01ఎప్రిల్2024 నుండి 31మార్చో2025 వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలములోని ఎంజిఎన్ఆర్ఈజిఎస్ లో జరిగిన పనులపై 14ఎప్రిల్2025 నుండి 24ఎప్రిల్2025 వరకు మండలములోని అన్ని గ్రామాలలో తనికి నిర్వహించి గ్రామ సభలు పూర్తి చేసుకొని గ్రామ సభలలో గుర్తించిన అంశాలపై శుక్రవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమము నిర్వహించి గుర్తించిన అంశాలను చదివి వినిపించడం జరిగింది. ఈకార్యక్రమములో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వేణు మాధవ్, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్ కిరణ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. క్రిష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యస్. రాజేశ్వరి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ విసిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సహాయక ఇంజనీర్ (పి.ఆర్) సుమన్, ఏపివో రాధ, యస్టియం సాయి, యస్.ఆర్.పి.రమేష్, ముత్తయ్య, పంచాయితి కార్యదర్శిలు, ఈ.సిలు, డి.ఆర్.పిలు, టి.ఎలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, మండలంలోని గ్రామాలకు సంబందించిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్
గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.అలాగే సైబర్ నేరాల గురించి వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని అన్నారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ గుమాస మల్లేష్, షీ టీం సభ్యులు జ్యోతి,శ్రీలత, భరోసా సెంటర్ సబ్ ఆర్డినేటర్ పుష్పాలత,గ్రామస్థులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం.

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 


గుండాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సుదీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేసి గుండాల కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దోమల నివారణకు సహకరించి దోమల భారిన పడకుండా ఉండి వాటి ద్వారా వచ్చే వ్యాదులభారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. దీనికి గాను ఫ్రైడే ఫ్రైడే నిర్వహిస్తూ ఇంటిలోగాని ఇంటి ఆరుబయట నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించి వివిధ శాఖల సమన్వయంతో పునరంకీతులై ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నిర్మూలించాలని ఆశించారు. భారతదేశంలో 2030 సంవత్సరం కల్లా మలేరియాను పూర్తిగా నిర్మూలించాలనె లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి భూలక్ష్మి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ఎల్ టీ రమేష్, ఎఎన్ఎంలు భువనేశ్వరి,అరుణ, మంగవేణి,కమల, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏమ్ ఎల్ హేచ్ పీ సంగీత, ఆశాకర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి.

జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను

ప్రతికూలి కి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని సూచన

పరకాల నేటిధాత్రి

 

ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల,నడికుడ,కమలాపూర్ మండలాల ఎంపీడీఓల,ఏపిఓ,ఈసీ, పంచాయతీ కార్యదర్శిలకు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయినందున జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనికి వచ్చే విధంగా చూడాలని వారికి ప్రతి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని అధికారులను ఆదేశించారు.పని ప్రదేశంలో మస్టర్ ప్రకారం ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తన్నారా లేదా అని వారంలో ఒకరోజు తప్పనిసరిగా పరిశీలించాలని,

Job card

 

పని ప్రారంభం రోజు వెళ్లి కొలతలు చూపించి చివరి రోజు జరిగిన మొత్తం పనికి సంబంధించిన కొలతలు తీసుకుని అదే రోజు రికార్డు చేసి మండల్ కంప్యూటర్ సెంటర్ లో అప్పగించాలని,ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కొలతలు చేసిన పనకి తగ్గట్టుగా చేశారా లేదా స్క్రూటినీ చేయాలని ఏపీఓ కూడా ప్రతి రోజూ ఏదో ఒక పని ప్రదేశాన్ని తనఖీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్ రావు,ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,కమలాపూర్ నడికూడ ఎంపీడీఓలు గుండె బాబు,గజ్జెల విమల,ఏపీఓలు ఇందిర,విద్యాపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

మన కథలాపూర్ పద్మశాలి ముద్దుబిడ్డ జోగ మహాలక్ష్మి ద్వితీయ సంవత్సరం CEC విభాగం లో 984/1000 మార్కులు వచ్చినందుకు మాస్ట్రో కాలేజీ ప్రిన్సిపల్ ఆకుల రాజేష్  అభినందించారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం.!

ప్రపంచ మలేరియా దినోత్సవం…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 


ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కోహిర్ మండల్ బిలాల్ పూర్ గ్రామ ప్రాథమిక వైద్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి నరేందర్ మాట్లాడుతూ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ఒక ప్రయత్నం.ప్రతి సంవత్సరం 25 న ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య సవాలును పరిష్కరించడంలో, నిర్మూలించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా అనేది నివారించదగిన వ్యాధి.ఇది చికిత్సతో నిర్ములించుకోవచ్చు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, జీవితాలను ప్రభావితంప్రకారం  చేసే సమస్య. కనుక దీనిని నివారించడానికి సరైన దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.ఇటి కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సోనీ, ల్యాబ్ టెక్నీషియన్ జె వాసంత్రావు యమ్ పి హెచ్ ఏ నిరంజన్, సూపర్ వైసర్ శోభారాణి ఆశ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగే రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సారంపల్లి గ్రామానికి చెందిన కోల అనిత లక్ష్మణ్ కి 14,500 రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచుకొని ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి చెక్కులు.రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు కోల అనిత లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ సుంచుల కిషన్ గడ్డమీద శ్రీనివాస్ సిరిసిల్ల దేవదాస్ కున వేణి వినోద్ కోల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి

* అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

 

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు.!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మామిడిగి గ్రామానికి చెందిన బక్క రెడ్డి పెంట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి నాయకత్వములో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో చంద్రన్న,తుక్క రెడ్డి,మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు ……
చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం..
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సందర్శన… క్యాంపు పట్ల హర్షం…

రామయంపేట ఏప్రిల్ 25 నేటి ధాత్రి (మెదక్)

 

 

గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం నాడు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరoలో పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.. చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.
అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు deme యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా చిన్న శంకరంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మేడ్చల్ మెడిసిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ప్రవళిక, సంజన, నీరజ, దీక్షిత, సుప్రియ, సౌజన్య, హర్ష, తేజస్విని, hamsika
శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా పి హెచ్ సి కి చెందిన డాక్టర్లు B.Hruday, మెడికల్ staff కుమారి,నందిని,బుజ్జి,Mala , మాధవి,లలిత,రేణుకా పాల్గొన్నారు.

 

Medical camp

అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 100 మందికి పైగా రోగులు వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి టి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, రేషన్ డీలర్ తోట శ్రీనివాస్ గుప్తా, మద్దెల సత్యనారాయణ, జీడి తిరుపతి, N. మాధవరెడ్డితొ పాటు గ్రామస్తులు పాల్గొన్నారు
……………
రెడ్ క్రాస్ సేవల పట్ల ఎమ్మెల్యే హర్షం..
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. రెడ్ క్రాస్ సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.. చిన్న శంకరంపేట lo వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తుlo చేపట్ట బోయే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభను గ్రామ గ్రామన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్టణాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డుసృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి ఈ నేల 27 న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సుమారు 1300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయిని బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్ తెలిపారు. నడికూడ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version