15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక కార్యక్రమం
రామడుగు, నేటిధాత్రి:
01ఎప్రిల్2024 నుండి 31మార్చో2025 వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలములోని ఎంజిఎన్ఆర్ఈజిఎస్ లో జరిగిన పనులపై 14ఎప్రిల్2025 నుండి 24ఎప్రిల్2025 వరకు మండలములోని అన్ని గ్రామాలలో తనికి నిర్వహించి గ్రామ సభలు పూర్తి చేసుకొని గ్రామ సభలలో గుర్తించిన అంశాలపై శుక్రవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమము నిర్వహించి గుర్తించిన అంశాలను చదివి వినిపించడం జరిగింది. ఈకార్యక్రమములో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వేణు మాధవ్, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్ కిరణ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. క్రిష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యస్. రాజేశ్వరి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ విసిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సహాయక ఇంజనీర్ (పి.ఆర్) సుమన్, ఏపివో రాధ, యస్టియం సాయి, యస్.ఆర్.పి.రమేష్, ముత్తయ్య, పంచాయితి కార్యదర్శిలు, ఈ.సిలు, డి.ఆర్.పిలు, టి.ఎలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, మండలంలోని గ్రామాలకు సంబందించిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.