ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్
గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.అలాగే సైబర్ నేరాల గురించి వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని అన్నారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ గుమాస మల్లేష్, షీ టీం సభ్యులు జ్యోతి,శ్రీలత, భరోసా సెంటర్ సబ్ ఆర్డినేటర్ పుష్పాలత,గ్రామస్థులు పాల్గొన్నారు.