కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి.

జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను

ప్రతికూలి కి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని సూచన

పరకాల నేటిధాత్రి

 

ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల,నడికుడ,కమలాపూర్ మండలాల ఎంపీడీఓల,ఏపిఓ,ఈసీ, పంచాయతీ కార్యదర్శిలకు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయినందున జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనికి వచ్చే విధంగా చూడాలని వారికి ప్రతి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని అధికారులను ఆదేశించారు.పని ప్రదేశంలో మస్టర్ ప్రకారం ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తన్నారా లేదా అని వారంలో ఒకరోజు తప్పనిసరిగా పరిశీలించాలని,

Job card

 

పని ప్రారంభం రోజు వెళ్లి కొలతలు చూపించి చివరి రోజు జరిగిన మొత్తం పనికి సంబంధించిన కొలతలు తీసుకుని అదే రోజు రికార్డు చేసి మండల్ కంప్యూటర్ సెంటర్ లో అప్పగించాలని,ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కొలతలు చేసిన పనకి తగ్గట్టుగా చేశారా లేదా స్క్రూటినీ చేయాలని ఏపీఓ కూడా ప్రతి రోజూ ఏదో ఒక పని ప్రదేశాన్ని తనఖీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్ రావు,ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,కమలాపూర్ నడికూడ ఎంపీడీఓలు గుండె బాబు,గజ్జెల విమల,ఏపీఓలు ఇందిర,విద్యాపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version