గణపురం మండల కేంద్రానికి చెందిన పోతర్ల రమాదేవి రవీందర్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ వెడ్స్ భవాని రిసెప్షన్ వేడుకలకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు నారగాని దేవేందర్ గౌడ్ కట్ల శంకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్, ఎండి వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి విరాట్ చారి రమాదేవి ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలు అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి :
జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు. కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు
వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి :
జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు. కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు
నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో వారం సంత ( ఒక రోజు అంగడి ) ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి కార్యక్ర మంలో డైలీ వజెస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, మహిళలు, యువతీ యువకులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంత ను ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సంతలో దాదాపు 33 మంది వ్యాపారస్థులు తమ స్థాళ్ళను ఓపెన్ చేసి ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇట్టి సంతలో గట్లకానిపర్తి ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న సూరంపేట్, పులుకుర్తి, నర్సింహులపల్లి మరియు పోచారం గ్రామాల ప్రజలు తమకు కావాల్సిన సరుకులు తీసుకోవడం జరిగింది. పలు గ్రామాలనుండి వ్యాపారస్థులు వచ్చి సంతలో స్టాళ్ళు ఏర్పా టు చేయడం జరిగింది.గ్రామం లో ఏర్పాటు చేసిన వారం సంత గ్రామ ప్రజలకు మరియు చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగక రంగా ఉందని సంత ఏర్పా టుకు కృషి చేసిన గ్రామ అభివృద్ధి కమిటీని ప్రజలు అభినందించడం జరిగింది.
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం
వనపర్తి నేటిధాత్రి:
చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు. భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ.
Bharatiya Janata Party.
వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం
వనపర్తి నేటిధాత్రి:
చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు.
BJP State Council Member
భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ. వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు
.తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును. ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాకు అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎప్పుడు వచ్చిన ముందస్తు అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా. తెలియజేస్తూఎప్పుడు. ఎ నాడు భయపడలేదని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జైలు జీవితాలు గడిపామని ఎన్నో అరెస్టులు అయ్యామని ఈ సందర్భంగా తెలియజేశారు అరెస్టు అయిన పరామర్శించిన తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న బిఆర్ఎస్ మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగల రాజు. ఎగుమామిడి వెంకటరమణారెడ్డి .మాజీ. రవి. తంగళ్ళపల్లి మండల. జాగృతి అధ్యక్షులు. కందుకూరి రామ గౌడ్. జగత్.గుండు ప్రేమ్ కుమార్.. నాయకులు మాట్లాడుతూఇకముందు అయినా అధికార పార్టీ నాయకులు గాని మంత్రులుగాని జిల్లా పర్యటన సందర్భంలో ఇలాంటి అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అధికారం ఉందని అది అందరిసొత్తు కాదని. దృష్టిలో ఉంచుకొని అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ రైస్ మిల్ పక్కన రైతు టేకుమల్లె యాదయ్య పోలంలో వేలాడుతున్న 11 కెవి కరెంటు వైర్లు నెత్తి పైన మీటర్ దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అని ఎన్నిసార్లు సంబంధిత లైన్మెన్ కు విద్యుత్ అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని ప్రస్తుతం ఆ స్థలంలో వరి పంటలు కోసి ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సందర్శించి ఆ యొక్క వేలాడుతున్న వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా కాపాడుతారని రైతు యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని రైతు యాదయ్య తెలిపారు.
ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధి హామీ కార్మికుల వద్ద వినూత్న రీతిలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారముగా ప్రతి శుక్రవారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశము ఏర్పాటు చేయవలసి ఉన్నది.ఈరోజు శుక్రవారం అయినందున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ రెండు రోజుల ముందుగానే తల్లిదండ్రులకు సమావేశం యొక్క వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియచేసినప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడం వలన వారు ఎక్కడున్నారో తెలుసుకుని ఉపాధి హామీ పని చేస్తున్న దగ్గరకు వెళ్లి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత యూనిఫామ్స్,రాగి జావా, మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ బుక్స్ గురించి తెలియజేశారు.అదే విధంగా మధ్యలో చదువు మానేసినటువంటి వారికి ఓపెన్ ఇంటర్లో గాని, ఓపెన్ టెన్త్ లో కానీ దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చర్లపల్లి లో కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపర్తిలో కానీ జైన్ కావాలని సూచించారు.వయోజనుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి
జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారము మండల వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి మండలంలో డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా సిబ్బంది ప్రజలకు వినిపించేలా దోమతెరలు వాడండి దోమ కాటు నుండి రక్షణ పొందండి చిన్న దోమ ప్రాణాంతకమైనది దోమలు ప్రజారోగ్యానికి ప్రాణాంతకమైనవి నిలువ నీళ్లు దోమలకు ఇల్లు వేపాకు పొగ దోమలకు సెగ ప్రతి శుక్రవారం మరియు మంగళవారము డ్రైడే పాటించాలని చెప్పుతూ స్లొగన్స్ ఇవ్వడంతోపాటు ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తన ఇంటి చుట్టూ నీరు నిల్వలు ఉండకుండా చూసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రం కు వచ్చి డాక్టర్ని సంప్రదించాలని తెలుపుతూ డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది పి ఎచ్ ఎన్ గ్రేసీ మను స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ఎల్ టీ అనిల్ పార్మాసిస్ట్ జగదీశ్ ఎ ఎన్ ఏమ్స్ స్రవంతి రమాదేవి దుర్గ కళావతి సునీత ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఇంచార్జి లు బొల్లం దీప్తి లావణ్య శ్రీను పాల్గొన్నారు
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం శుక్రవారం అక్కన్నపేట ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలను గ్రామంలో తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ ఎస్ హెచ్ఎం సావిత్రి, ఉపాధ్యాయులు రాoచంద్రారెడ్డి, సాయి చందర్, పంచాయతీ కార్యదర్శి సరితా దేవి, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, మరియు శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి డిసిఓ వాల్య నాయక్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఒ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓద్దుల పల్లె మైలారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు వర్ష ప్రభావం సూచనల నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు ఈ సందర్భంగా రైతులతో కొనుగోలు కు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు రైతులు ధాన్యం విక్రసించిన వెంటనే ట్రక్ సీట్ ఇవ్వాలన్నారు అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియలో కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన సూచించారు అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలో పరదాలను సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాల్లో ఇన్చార్జీలు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సి ఓ పుట్ట సురేష్ ఓద్దుల పల్లె ఇన్చార్జి కుక్క ముడి సంపత్ మైలారం ఇంచార్జి కండే కుమార్ రైతులు పాల్గొన్నారు
రామాయంపేట పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వినియోగించుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు దైనందిన జీవితంలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేశారు.
summer CAMP
విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల విషయాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. యోగ, చిత్రలేఖనం మరియు క్రీడల వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పిటిఐ లు మల్లేశం, కవిత, యోగ శిక్షకులు భరత్, డ్రాయింగ్ టీచర్ యాదమ్మలను అభినందించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, నోట్ బుక్స్ మరియు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంఐఎస్ సంతోష్, ఉపాధ్యాయులు రాధిక, జయ పాల్గొన్నారు.
తెలంగాణ ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ రిజిస్టర్ నెంబర్ 89 /2019,జిల్లా కమిటీ లో మార్పులు చేర్పులు గురించి గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తు,మహాసభలు పెడుతూ,అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆర్ఎంపి మరియు పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి వరకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కల్పించడం జరిగినది.అనివార్య కారణాలవల్ల ఈ జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు చేయడం జరిగినది ప్రస్తుతం నిర్ణయించిన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు దొంతుల మొoడయ్య,ఉపాధ్యక్షుడు శైలేంద్ర రాము చారి,ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్,సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, కోశాధికారిగా తంగేళ్లపల్లి రాజేందర్,గౌరవ అధ్యక్షుడు డిఆర్ బెంజిమెన్,ముఖ్య సలహాదారు కుంచాల శంకరయ్య గా నిర్ణయించడం జరిగింది.
ప్రశాంతను వ్యక్తి మూడు నెలల క్రితం తన మొబైల్ ఫోన్ను నిజాంపేటలో పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే నిజాంపేట పోలీస్ స్టేషన్లో సీఈఐఆర్ వెబ్సైట్లో అప్లై చేశారు. సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి శుక్రవారం బాధితుడికి మొబైల్ ఫోన్ అందజేసినట్లు నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా మీసేవ కేంద్రాల్లో, పోలీస్ స్టేషన్లో సిఈఐఆర్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు.
— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన • జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ • అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి
మెదక్ ఆర్డీఓ రమాదేవి
నిజాంపేట: నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు ఏరియాలలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ శాఖ,పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గోశాలలకు తరలించారు.రోడ్లపై సంచరించే పశువులను పశు యజమానులు వాటిని తమ ఇంటికి తీసుకువెళ్లాలని గత ఐదు నెలలుగా పత్రిక ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొందరు యజమానులు పశువులను రోడ్లపై వదలడంతో గోశాలలకు తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆర్ కె పి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానవాళినీ ఇబ్బందులకు గురి చేసే ఏ జీవులైనా సరే కుక్క, గోవు, పశువు ఏదైనా తరలించే హక్కులు మునిసిపాలిటీ అధికారులకు ఉంటాయని కమీషనర్ గద్దె రాజు తెలిపారు .
Cowshed
పశువులను సంరక్షించేందుకే వాటిని గోశాలలకు తరలిస్తున్నామని వారు అన్నారు. పశువులు రోడ్లపై సంచరిస్తూ పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పశువులను గోశాలలకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు.
Cowshed
పశువులను ఇలాగే రోడ్లపైకి వదిలేస్తే వాహనదారులు ప్రమాదానికి గురైనట్లయితే పశు యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు. సరైన ఆధారాలతో ఎవరైనా పశువుల యజమానులు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పశువులను వాటి యజమానులకు అప్పగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి వెటర్నరీ డాక్టర్ తిరుపతి, మూగజీవుల సేవా సంఘం సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.