కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్ల పూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు.. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొంతంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్ఎస్ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

నిజాంపేట నేటి ధాత్రి:

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version