11KVవైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు.

11 కెవి వైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ రైస్ మిల్ పక్కన రైతు టేకుమల్లె యాదయ్య పోలంలో వేలాడుతున్న 11 కెవి కరెంటు వైర్లు నెత్తి పైన మీటర్ దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అని ఎన్నిసార్లు సంబంధిత లైన్మెన్ కు విద్యుత్ అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని ప్రస్తుతం ఆ స్థలంలో వరి పంటలు కోసి ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సందర్శించి ఆ యొక్క వేలాడుతున్న వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా కాపాడుతారని రైతు యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని రైతు యాదయ్య తెలిపారు.

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామడుగు, నేటిధాత్రి:

 

తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని
ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో గాలించగా తాటివనంలో కావలి భూమయ్య ఒంటరితనం తట్టుకోలేక తాగుడుకు బానిసై నమిలినారా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోని కనిపించాడని మృతుడు భూమయ్య సోదరుడి కొడుకు కావాలి రాజు తండ్రి పోశాలు ఫిర్యాదు చేయగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామడుగు ఎస్సై రాజు తెలిపారు.

ఉరేసుకొని.. పదవ తరగతి విద్యార్థి మృతి.

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం.

బాలిక కుటుంబానికి అండగా ఉంటాం.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.

ఉరేసుకొని బాలిక మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో.. విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతున్న సందర్భంలో.. విద్యార్థి పాఠశాలలో ఎవరూ లేని సమయంలో ఏడవ తరగతిలో పదవ తరగతి బాలిక ఆరాధ్య (15) ఉరేసుకోగా.. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థిని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం షాద్ నగర్ తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. బాలిక స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, రజిత కూతురు. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో.. పోలీసులు పాఠశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలకు సందర్శించి విద్యార్థి మృతికి గల కారణాలు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోధిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఇవ్వాలని కోరగా.. పరిశీలిస్తామని, విద్యార్థి మృతికి కారణమైన వ్యక్తులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా.. రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి, జనరల్ గురుకుల పాఠశాల, కళాశాల డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్సై రవి నాయక్, బాలానగర్ ఎస్సై లెనిన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version