వనపర్తి లో ఉపాధ్యాయుల.!

వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు.
కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version