వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి

జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబీ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుక అందించేందుకు వనపర్తి జిల్లాలో ఇసుక రీచులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వనపర్తి జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ ఇసుక రీచ్ లు గుర్తించారు వాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది అధికారులతో చర్చించారు
తుంపల్లి గ్రామం వీరరాఘవపూర్ ఇసుక రీచ్ లో 3990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఇరిగేషన్ భూగర్భ జలాలుమైన్స్ అండ్ జియాలజి ద్వారా పరిశీలన చేసిన రిపోర్టును కలెక్టర్ ముందు ఉంచారు వీర రాఘవపూర్ రీచ్ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక తీసుకునేందుకు కమిటీ తీర్మానం చేసింది .మదనపూర్ మండలములోని కొత్తపల్లి దుప్పల్లి రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇసుక లభ్యత లేదని మైన్స్ అధికారి తెలుపగా ఆన్లైన్ మ్యాప్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ కమిటీ సభ్యులు మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దమందడి మండలం చిలకటోనీ పల్లి కర్వేన గ్రామాల్లోనీ రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధన ప్రకారం ఉండాల్సిన ఇసుక లభ్యత లేదని అందువల్ల రీచ్ గా పరిగణించి ఇసుక తీసుకోలేమని కమిటీ నిర్ధారించింది అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఎ డిమైన్స్ గోవిందరాజులు భూగర్భ జలాల ఎ డి దివ్యజ్యోతి డి ఎల్పీఒ రఘునాథ్ ఇరిగేషన్ శాఖ అధికారి పాల్గొన్నారు

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి :-

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సాక్షాత్తు దేశ ప్రధాని జైలుకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పెడితే ఇంటెలీజిన్స్ డిపార్ట్మెంట్ ఎంచేస్తుందని ప్రశ్నించారు.

 

పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి

జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version