వినూత్న రీతిలో పిటిఎం.

వినూత్న రీతిలో పిటిఎం

నడికూడ నేటిధాత్రి:

 

ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధి హామీ కార్మికుల వద్ద వినూత్న రీతిలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారముగా ప్రతి శుక్రవారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశము ఏర్పాటు చేయవలసి ఉన్నది.ఈరోజు శుక్రవారం అయినందున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ రెండు రోజుల ముందుగానే తల్లిదండ్రులకు సమావేశం యొక్క వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియచేసినప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడం వలన వారు ఎక్కడున్నారో తెలుసుకుని ఉపాధి హామీ పని చేస్తున్న దగ్గరకు వెళ్లి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత యూనిఫామ్స్,రాగి జావా, మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ బుక్స్ గురించి తెలియజేశారు.అదే విధంగా మధ్యలో చదువు మానేసినటువంటి వారికి ఓపెన్ ఇంటర్లో గాని, ఓపెన్ టెన్త్ లో కానీ దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చర్లపల్లి లో కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపర్తిలో కానీ జైన్ కావాలని సూచించారు.వయోజనుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version