బిఆర్ఎస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న.!

బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ..

Congress

ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ సందర్బంగా
ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ నిజానిజాలపై మండల కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధమే
ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం వెనకడుగు వేయం బి.ఆర్.యస్ పార్టీ అహంకారంతో నిరంకుశ వైఖరితో పాలనను కొనసాగించి దోపిడి దౌర్జన్యం ఇంటిపేరుగా మార్చుకున్న బిఆర్ఎస్ నాయకులు
నీతులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని అన్నారు అంతే కాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గత పది సంవత్సరాల పాలనలో ఇసుక దొంగలు ఎవరో తెలుసు,భూ దొంగలు ఎవరో తెలుసు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కమిషన్లు తీసుకున్నవారు తెలుసు.
రైతులను వేధించింది ఎవరో తెలుసు సామాన్యులను దోచుకుందువరో తెలుసు,దళితులను,గిరిజనులను,బీసీ,మైనారిటీలను అవమానించిన వారు ఎవరో తెలుసు.
అన్ని నీచ పనులు చేసి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు అని తెలిపారు.

బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న.!

సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో
భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో

Bandi Sanjay

సిరిసిల్ల జిల్లా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అనంతరం నూతనంగా సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిగ నియమింపబడ్డ రెడ్డబోయిన గోపికి సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ… రాబోయేవి ఎన్నికలే,స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మనదని,బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటదో మీకు తెలుసునని, సెస్, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేసినమో మీకు తెలుసు,సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే,భయపెట్టి బెదిరించి బీఆర్ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన దుర్మార్గమైన చరిత్ర బీఆర్ఎస్ దే అని,ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని,ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే అని బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన అధ్యక్షులు బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు యువకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా.

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా….

– ఆర్కేపీ లో గుట్టుగా గుడుంబా తయారీ
– పులిమడుగు లో జోరుగా గుడుంబా విక్రయాలు
– రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు
– గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ శాఖ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

RKP

రామకృష్ణాపూర్, పులిమడుగు, తిమ్మాపూర్ ఏరియాలలో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా మామూళ్ల మత్తులో అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు రాత్రి వేళల్లో గుడుంబా విక్రయాల ప్రదేశాలను కనిపెట్టి గుడుంబా విక్రయాలను అరికట్టేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా,కాకతీయ కాలనీ, ఆర్కే ఫోర్ గడ్డ,రామాలయం, ఆర్కే వన్, పులిమడుగు ఏరియాలలో జోరుగా దందాను సాగిస్తున్నారు.మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారని తెలుస్తుంది.దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి ద్విచక్ర వాహనాల,ఆటోల్లో ఇతర ఏరియాలకు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు వినికిడి. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బెల్లం తయారీని నిషేధించింది. దీంతో సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి గుడుంబా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలంటే 100 నుండి 150 పైగానే ఖర్చవుతుందనే ఆలోచనతో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. గుడుంబాపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా

RKP

తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉందని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల.!

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.2011-12 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒక్కచోట సమ్మేళనమయ్యారు.గత 12 ఏళ్ల క్రితం అందరూ ఒకే చోట చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉద్వేగ భరితంగా ఉత్సాహంతో కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వారి కుటుంబ పరిస్థితులు,స్థిరపడిన రంగాలు,జీవితంలో సాధించిన విజయాలు తదితరులను ఒకరికొకరు చెప్పుకొని ఆనందం వ్యక్తం చేసుకున్నారు.అదేవిధంగా చదువుకున్న పాఠశాలను కలియ తిరుగుతూ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.ఈ సమ్మేళనంలో పాల్గొన్న గురువులకు నమస్కరిస్తూ గురుతర బాధ్యతగా వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. అలనాటి మధురస్మతులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా,ఉత్సాహంగా పూర్వ విద్యార్థులు తమ గురువులతో గడిపారు.ఈ సమ్మేళన కార్యక్రమంలో అలనాటి గురువులు,శిశు మందిర్ ఆచార్యులు కిషన్ రావ్ (ప్రస్తుత ప్రముఖ జ్యోతిష్య పండితులు),శ్రీశైలం,గోవర్ధన్,
శివరామ్,రాములు,నర్సింహ్మరెడ్డి,మల్లయ్య,స్వరూప,పద్మ,అప్పటి విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ.

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ

“నేటిధాత్రి”న్యూఢిల్లీ, మార్చి, 17:

ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి సోమవారం పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఈ మేరకు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల ఎంపీ రవిచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. మరింత కాలం ప్రజా సేవకు అంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిని కలిసి పరామర్శించిన వారిలో తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు.

తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.

“నేటిధాత్రి” ఎఫెక్ట్

తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.

హైదారాబాద్ ,నేటిధాత్రి

నేటిధాత్రి దినపత్రిక కథనంతో సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్, ఆర్ఐ లు అరెస్టు అయ్యారు.ఈ నేపథ్యంలో వారిని నల్గొండ జైలుకు తరలించారు. జిల్లా రెవిన్యూ శాఖలో సంచలనం రేపిన పైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.మోతే మండల రెవిన్యూ ఆఫీస్ లో పహాణిలను టాంపరింగ్ చేసిన కేసులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సిరియస్ గా ఫోకస్ చేయడంతో.. గత కొంత కాలంగా లోతైన విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన తహశీల్దార్,ఇద్దరు ఆర్ఐ లు, కంప్యూటర్ ఆపరేటర్, మీ సేవా నిర్వాహకులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీరికి జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో సస్పెండ్ అయిన తహసిల్దార్, సంఘమిత్ర ,మహిళా ఆర్ఐ నిర్మలాదేవిని నల్గొండ సబ్ జైలు తరలించారు. మీసేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో వీరితోపాటు మరో 21 మందిని గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు గా సమాచారం.

ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగతనం.!

ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగతనం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఎత్తుకెళ్లారు. దొంగ చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్ , కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెలాఖరులోగా 100 శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం కొంతమంది మున్సిపల్ బిల్ కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మేనేజర్లకు సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, జహీరాబాద్ మున్సిపాలిటీ లో కమిషనర్ ఉమామహేశ్వరరావు, మేనేజర్ ఉమేశ్వర్ లాల్, బిల్ కలెక్టర్లు 8 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.సంగారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఎస్సీ వీకే ఛావన్ , మేనేజర్ సూర్య ప్రకాష్ ,బిల్ కలెక్టర్లు 27 మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. సదాశివపేట మున్సిపాలిటీలో కమిషనర్ శ్రీమతి జే ఉమా, మేనేజర్ ఉమర్ సింగ్, 14 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నులు, కుళాయి బిల్లును, ప్రాపర్టీ టాక్స్ 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

తంగళ్ళపల్లి,నేటిధాత్రి:

మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో
మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.

ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు.

దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం కేశవరావు యజ్ఞ పూర్ణహౌతులో పాల్గొని పూర్ణాహుతి చేశారు. ఆలయ పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర స్వామీజీలు ఆయనను సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్తమేర మహారాజ్ ఆశ్రమ అధ్యక్షులు అల్లాడి వీరేశం గుప్తా విశ్వ మానవ ధర్మ ప్రచార అధ్యక్షులు శేరి నర్సింగ్ రావు రాజు పటేల్ జిల్లా శివశక్తి అధ్యక్షుడు శ్యామ్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు.!

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

Ra Channa Patel

ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
◆డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
◆ మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో మొగడం పల్లీ మండల మాజీ కోప్షన్ మెంబర్ హర్షద్ పటేల్ ఏర్పాటు చేసిన ఇప్తార్ వేడుకల్లో యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్ హాజరయ్యారు. ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మైనార్టీ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.

పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గ్రామాలభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది

ప్రగతిసింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కండువా కప్పి ఆహ్వానిం చిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో వివిధ గ్రామాలలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు పర్యటిం చారు. ఆయా గ్రామాలల్లో సుమారు రూ.7.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముం దుగా కొత్తగట్టుసింగారం గ్రామంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాందా రిపేట లో సీసీరోడ్లు, శాయం పేట మహాత్మాగాంధీ జ్యోతిభా పూలే పాఠశాలలో సీసీ రోడ్డు, శాయంపేట నాగసముద్రం నుండి పత్తిపాక వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పత్తిపాక, నేరేడుపల్లి, కాట్రపల్లి, గంగిరేణిగూడెం, వసంతా పూర్, కొప్పుల, జోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. అదేవిధంగా, వసంతాపూర్ నుండి కొత్త పల్లిగోరి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు రెన్యువల్, పెద్దకోడెపాక డంపింగ్ యార్డు నుండి మూడువాగుల కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతీ అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నా మని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తా నని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతి నిధి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలి పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూ త్న కార్యక్రమాలు చేప‌డుతోం దన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్ర‌జా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత‌ బస్సు ప్ర‌యాణాన్ని క‌ల్పించిందని తెలిపారు. ఉచిత ప్ర‌యాణ‌మే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన విజ‌య మని అన్నారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్ర‌తి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచా లనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సదరు గుత్తేదా రులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు.

Foundation stone

రూ.5,96,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే..

శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ లబ్దిదారులకు రూ.5,96, 000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రగతి సింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మండలంలోని ప్రగతిసింగారం గ్రామం నుండి 20 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు గ్రామ కూడలిలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు వీరే పిట్టల రఘుపతి, బళ్ల సంతోష్, చిలుకల తిరుపతి, చిలుకల సతీష్, చిలుకల రవి, దైనంపల్లి ప్రకాష్ లతో పాటు మరో ఇరవై మంది ఉన్నారు.

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (జాతర) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విమాన రథోత్సవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు. అనంతరం రరమలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి. వేదమంత్రాల మధ్య స్వామివారి రథాన్ని లాగారు.

ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామలింగేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాంతం అంతా పచ్చని పంటలతో, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకొండానని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి రమ్య, రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వాణ అధికారి నాగిరెడ్డి, కోడి శ్రీనివాసులు, దోటి టి వెంకటేశ్ యాదవ్, నల్లగంటి మల్లేష్ ఆలయ సభ్యులు, వంశపార్యపర్య అర్చకులు, స్థానిక నాయకులు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో.!

హద్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణం బండార్ నగర్ లో హధ్య కోచింగ్ సెంటర్ వార్షికోత్సవ ఉత్సవాలలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పాల్గొన్నారని కోచింగ్ సెంటర్ .నిర్వహికులు హేమెందర్ ఒకప్రకటనలో తెలిపారు ఈసందర్భంగా రూరల్ ఎస్సై జలందర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు అంటే భయపడకుండా చదువు అంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎదగాలని సూచించారు విద్యార్థులకు దిశ నిర్దేశిస్తూ, ప్రత్యక్షంగా తను అనుసరించిన విధి విధానాలను వారి పూర్తి అనుభవాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరిస్తూ ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని కోరారు ప్రత్యేకంగా వనపర్తి చుట్టుపక్కల చిన్నచిన్న గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను బోధన కల్పిస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హేమెందర్ ను రూరల్ ఎస్సై అభినందించారు. అనంతరం ఎస్సై ని యాజమాన్యం శాలువ తో ఘనంగా సన్మానించారు..

Anniversary

వార్షికోత్సవాలకు హాజరై మరియు వారి విలువైన సూచనలను అందించినందుకు విద్యార్థులు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు.

ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

ముదురు పాకాన పడిన తమిళ భాషా వివాదం

రాష్ట్ర బడ్జెట్‌ లోగోలో హిందీ ‘రు’ గుర్తును తొలగించిన డి.ఎం.కె. ప్రభుత్వం

తమిళ ‘రూబాయి’లోని తొలి అక్షరాన్ని లోగో కింద వుంచిన వైనం

ఎన్‌ఈపీా2020పై వ్యతిరేకతను భాషా వివాదంగా మలచిన డి.ఎం.కె

డీలిమిటేషన్‌ సమస్యను కూడా ముందుకు తెస్తున్న పార్టీ

హద్దులు లేకుండా మాట్లాడటం, కేంద్రాన్ని నిందించడం

ఇదీ ద్రవిడ పార్టీ వైఖరి

ఓట్లకోసమే భావోద్వేగాలను రెచ్చగొడుతున్న డి.ఎం.కె.

అనుసంధాన భాషపై అనవసర వివాదం

కేవలం తమిళం మాత్రమే నేర్చుకుంటే నష్టపోయేది ప్రజలే

రాజకీయ లబ్దికోసం భాషా అస్త్రాన్ని వాడుతున్న డీఎంకే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడులో భాషా వివాదం ముదిరి పాకానపడిరది. జాతీయ విద్యావిధానం`2020లో పేర్కొన్న త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న డి.ఎం.కె. ప్రభుత్వం దీన్ని పెద్ద వివాదంగా మలచి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశంతో ముందుకెళుతోందని, అది తీసుకుంటున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో భాజపా ‘సనాతన ధర్మం’ అస్త్రం తో తనను ఎదుర్కొంటుండటంతో ద్రవిడవాద డి.ఎం.కె. దిగ్గజం ఇందుకు ప్రతిగా తన సత్తా ఏంటో చూపాలన్న దృష్టితో భాషావివాదాన్ని రెచ్చగొడుతోంది. ఈ ‘భాషా దురభిమానం పిచ్చి’ ఎంతగా ముదిరిపోయిందంటే, ఏకంగా రూపాయి నోటుపై హిందీ అక్షరం ‘ఆర్‌’ను తొలగించి దాని స్థానంలో తమిళ ‘ఆర్‌’ అక్షరం పెట్టేవరకు వెళ్లింది. దీంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడె క్కాయి. రాష్ట్ర ఆర్థికమంత్రి తంగం తిన్నెరసు 2025`26 బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వుంది. ఈ బడ్జెట్‌కు సంబంధించిన లోగోలో మొట్టమొదటి అక్షరంగా తమిళ భాషకు చెందిన ‘రూబాయి’లోని మొదటి అక్షరం ‘రు’ను వుంచడం ఇప్పుడు దుమారం రేపింది. ఈ లోగోపై ‘అందరికీ అన్నీ’ అనే శీర్షికను వుంచారు. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లే డి.ఎం.కె విధానాన్ని ఇది తెలియజేస్తుంది.
దీంతో రాష్ట్ర బీజేపీ ఒక్కసారిగా డి.ఎం.కె. చర్యపై మండిపడిరది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నా మలై తీవ్రంగా స్పందిస్తూ ‘‘ ఒక తమిళుడు రూపొందించిన హిందీ అక్షరం ‘రు’ డిజైన్‌ను తొల గించడం దారుణం. దేశం మొత్తం ఆమోదించి అనువర్తింపజేసుకున్న డిజైన్‌ ఇది. అంతేకాదు మన కరెన్సీకి గుర్తుగా ఈ డిజైన్‌ను ఉపయోగిస్తున్న సంగతిని తెలుసుకోవాలి’’ అంటూ ఎక్స్‌ కాతాలో పోస్ట్‌ చేశారు. ‘తిరు ఉదయ్‌కుమార్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈయన మాజీ డి. ఎం.కె. ఎమ్మెల్యే కుమారుడు. ఇటువంటి చిహ్నాని తొలగించి మూర్ఖంగా వ్యవహరించారు తిరు స్టాలిన్‌’ అంటూ ఆయన తన పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో 2024`25 తమిళనా డు బడ్జెట్‌ లోగోగా హిందీ ‘రు’ డిజైన్‌ను ఉపయోగించిన ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు.
దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఇంకా స్పందించలేదు కానీ భాజపా మాత్రం స్టాలిన్‌ ప్రభుత్వ చ ర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు తమిళపార్టీ దేశం కంటే తాను భిన్నమన్న రీతిలో వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
జాతీయ విద్యావిధానం`2020 కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి తమిళనాడు ప్ర భుత్వం ముందుకు రాకపోవడంతో, ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కింద రాష్ట్రానికి కేటాయించిన రూ.573కోట్ల ను తొక్కిపట్టింది. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం రాజుకుంది. ఈ విద్యా విధానం కింద రాష్ట్రాలు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిధులు పొందాలంటే జాతీయ విద్యావిధానంలో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడం తప్పనిసరి. ఎస్‌ఎస్‌ఏ కింద కేం ద్రం తమిళనాడు వంటి రాష్ట్రాలకు 60శాతం నిధులు సమకూరిస్తే మిగిలిన 40శాతం రాష్ట్రం భరించాల్సివుంటుంది. ‘ప్రధానమంత్రి శ్రీ పథకం’ కింద సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వుంటుంది. అప్పుడు మాత్రమే కేంద్రం ఎన్‌ఈపీ`2020 కింద నిధులు విడుదల చేస్తుంది.
ఈ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడమే కాకుండా అందుకు నాయకత్వం వహించారు కూడా. నూతన జాతీయ విద్యా విధానం కేవలం ‘కాషాయ విధానం’ మాత్రమేనని విమర్శించారు. హిందీని రుద్దడంపై వున్న శ్రద్ధ దేశాభివృద్ధిపై లేదన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ‘కత్తి’ దక్షిణాది రా ష్ట్రాల నెత్తిన వేలాడుతున్నదంటూ గుర్తుచేశారు. ‘మేం జాతీయ విద్యావిధానాన్ని పూర్తిగా వ్యతిరే కిస్తున్నాం. ఇది సామాజిక న్యాయం కింద రిజర్వేషన్లను ఆమోదించదు. షెడ్యూల్డు కులాలు/తెగ లు, వెనుకబడిన వర్గాల వారికి విద్యకోసం తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఇది దోహదం చేయదని ఒక బహిరంగ ర్యాలీలో ఆరోపించారు. జాతీయ విద్యావిధానంలోని త్రిభా షా సూత్రం కేవలం హిందీని బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించేందనన్నారు. ఎన్‌ఈపీ వంటి కొన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించబోమని కేంద్రం చెప్పడం కంటే అరాచకం మరో టి వుండదన్నారు. తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేవలం ద్విభాషా సూత్రాన్ని మాత్రమే అమలుచేస్తుందని కుండబద్దలు కొట్టారు.
‘ప్రధానమంత్రి మోదీగారూ! మాదో విన్నపం. హిందీకంటే దేశాభివృద్ధిపై దృష్టిపెట్టండి. ఎవ్వరూ మాట్లాడని సంస్కృత భాషాభివృద్ధికోసం కోట్ల రూపాయలు కుమ్మరించిన ఫలితముండదు. దేశ విదేశాల్లో తమిళ భాషను మాట్లాడుతున్న ప్రజలను మోసం చేయకండి’ అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇటీవల మాట్లాడుతూ ‘డి.ఎం.కె. రాబోయే ఎన్నికల్లో ఏదోవిధంగా అధికారంలోకి రావడానికి మాత్రమే ఎన్‌ఈపీని వివాదం చేస్తోంది. తమిళభాష విషయంలో వారు ప్రదర్శిస్తు న్న అత్యుత్సాహం కేవలం కపటనాటకం మాత్రమే’ అని వ్యాఖ్యానించడం డీఎంకే అధినేత స్టాలిన్‌ ఇంతటి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడానికి కారణం. తమిళ ప్రజలకు ప్రజాస్వామ్య మంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం కేంద్రమంత్రికి లేదని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజనపై కూడా స్టాలిన్‌ మండిపడ్డారు. ఉత్తరాదిలో బలీయంగా వు న్న కాషాయపార్టీ, ఈ పునర్విభజన కారణంగా ఆ ప్రాంతంలో పెరిగే సీట్ల ద్వారా రాజకీయంగా లబ్దిపొందడమే కాదు, కేవలం ఉత్తరభారతదేశ ఓట్లతోనే అధికారంలో కొనసాగాలని భావిస్తోంది. ఇది చాలా ఘోరం. పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ప్రయత్నిస్తే డీఎంకే తప్పకుండా దాన్ని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోని 29 పార్టీలకు లేఖలు రాశానన్నారు. ఈ పార్టీలన్నీ ఈనెల 22న చెన్నైలో పునర్విభజనపై చర్చలు జరుపను న్నాయి. రాష్ట్రంలో విద్యావిధానం పూర్తిగా విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే డి.ఎం.కె. ప్రభుత్వం ఈ భాషా వివాదాన్ని ముందుకు తెచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు. వినాశకర విధానాలను అనుసరిస్తూ, విద్యావిధానాన్ని డి.ఎం.కె. ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు.
జాతీయ విద్యావిధానంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన అంశం కొద్దివారాలుగా కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య సంఘర్షణాత్మకతను పెంచుతోంది తప్ప నివారించడంలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా తన జాతీయవాద నినాదంతో ముందుకెళుతూ, ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ అభివృద్ధికి అవసరమని ప్రచారం చేస్తుండటాన్ని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఆమోదించడంలేదు. ఎందుకంటే ఏదోవిధమైన భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చి ఇవి తమ అధికారాలను కాపాడుకుంటుండటమే అందుకు కారణం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు కావాలనే కోరతాయి. ఇది దేశ ఐక్యతకు చాలా ముఖ్యం. దీనికితోడు త్రిభాషా విధానంపై డి.ఎం.కె. ఎంపీలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ఎంతమాత్రం బాగాలేదు. సభా మర్యాదను కూడా పట్టించుకోని రీతిలో వారు తమ వ్యతిరేకతను వెల్లడిరచారు. విచిత్రమేమంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగార్థులు దేశంలోని ఎక్కడి కైనా వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి! ఈ నేపథ్యంలో హిందీ రావడం తప్పనిసరి! ఇంగ్లీషు భాష ఉత్తర భారతదేశంలో సామాన్యులకు రాదు కదా! నిజంగా దేశాన్ని ఐక్యంగా వుంచాలన్నా, అభివృద్ధిలో ప్రతి రాష్ట్రం భాగస్వామ్యం కావాలన్నా దేశవ్యాప్తంగా ఒక అనుసంధాన భాష తప్పనిసరి! ఇది డి.ఎం.కె.కు తెలియంది కాదు. అదీకాకుండా మనదేశ భాష కాని ఇంగ్లీషును ఒకపక్క ఆమోదిస్తూ, హిందీని వ్యతిరేకించడం…ఇదెక్కడి భాషాభిమానం? దేశీయ భాషను వ్యతిరేకించి, విదేశీ భాషను ఆమోదించడం…ఇదెక్కడి వింత? ఇది అవకాశవాద రాజకీయం తప్ప మరోటికాదు. కానీ భావోద్వేగాలను ఎంతగా రెచ్చగొడితే అంతగా ఓట్లు రాలతాయి. ఇదీ డీఎంకే నేతల ఓవర్‌ యాక్షన్‌ వెనుక వున్న ఆంతర్యం. సమాఖ్య వ్యవస్థను భ్రష్టుపట్టించేది వీరే…కేంద్రాన్ని ఆడిపోసుకునేదీ వీరే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, తమ స్వలాభంకోసం ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కూడా వెనుకాడని ఇటువంటి ప్రాంతీయ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం వింతల్లోకెల్లా వింత. అయినకాడికి ఉచితాల పేరుతో రాష్ట్రాల ఖజానాను ఖాళీచేస్తూ, ప్రజలను బద్ధకస్తులుగా మార్చడమే కాదు, అభివృద్ధికి దోహదం చేయని ఈ పార్టీలు దేశాభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రం! దేశాభివృద్ధి లక్ష్యంతో పనిచేసే పార్టీలు ఇటువంటి సంకుచిత ధోరణులను ప్రదర్శించవు. ఈ సత్యాన్ని విజ్ఞులైన ప్రజలు తప్పక గుర్తిస్తారు.

అబద్దాలకు హద్దు లేదు?..మాటలకు పొంతన లేదు!?

`అసలు జనసేన ఎందుకు పుట్టింది?

`ఎవరి కోసం పుట్టింది!

`ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటోంది!

`అసలు సిద్దాంతం ఏమిటి?

`చేయాల్సిన రాద్దాంతం ఏమిటి?

`ఆవిర్భావ సభ ఎవరికి భరోసా కల్పించింది?

`కొత్త తరం నాయకత్వానికి ఏమి హామీ ఇచ్చింది?

`గంటకు పైగా సాగిన ఉపన్యాసంలో చెప్పిందేమిటి?

`గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన వుందా?

`కనీసం అప్పటి మాటలకు, ఇప్పటి మాటలు కొంచైనా సింక్‌ అవుతున్నాయా?

`దేవుని హారతితో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకునే వారు అని చెప్పిందే పవన్‌!

`మా ఇంట్లో ఎప్పుడూ రామ నామ జపం వినిపిస్తూనే వుండేది అంటున్నది పవనే!

`తొలిప్రేమ సినిమా తర్వాత కంప్యూటర్‌ కోర్స్‌ చెన్నై లో నేర్చుకున్నాన్నది పవనే!

`పరీక్ష రాసి రావడం వల్ల లేటైతే ఇంట్లో కంగారు పడ్డారని చెప్పింది ఆయనే.

`పదకొండేళ్ల ప్రస్థానం గురించి పక్కన పెట్టి తన బాల్య స్మృతులు చెప్పడమేమిటి?

`అసలు జన సేన లక్ష్యాలేమిటి?

`జనసేన అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?

`జనసేన వల్ల ఏపికి ఏం లాభం చేకూరింది?

`పార్టీ కోసం కష్టపడుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?

`అవన్నీ వదిలేసి చెప్పిన మాటలేమిటి?

`జనసేన సభలో పవన్‌ చెప్పాల్సిన మాటలేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నోరు తెరిస్తే అబద్దమే..మాట మాట్లాడితే అబద్దమే..చెప్పిందంతా అబద్దమే..చెబుతున్నదంతా అబద్దమే..చెప్పేదేమున్నా అదీ అబద్దమే…ఈ మాటలు ఎవరి గురించో అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ గురించి ఏపిలోని వివిధ రాజకీయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఆది నుంచి ఆయన చెబుతున్న గతం తాలూకు మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనలేదంటున్నారు. పైగా నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించిన ఘనత జనసేనదే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు కొంత పొగరాజేశారు. పిఠాపురంలో పవన్‌ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వాతావణంలో వేడిని పెంచాయి. తెలుగుదేశం శ్రేణుల నుంచి జనసేన మీద తీవ్ర నిరసనలు వెలువడ్డాయి. ఇదిలా వుంటే ప్రతి సారి పవన్‌ తన వ్యక్తిగత జీవితంలోని అంశాలు ఉటంకించడం పరిపాటిగా మారింది. అయితే ఒకటే విషయాన్ని పదే పదే చెబితే బాగుండదనుకుంటారో..లేక గతంలో చెప్పిన అంశాన్ని మర్చిపోతుంటారో గాని ఎప్పుడూ ఏదో ఒక కొత్త లెక్క చెబుతుంటారు. కాని గతంలోనే చెప్పిన విషయాన్నే మరోలా చెబుతుంటారు. ఇక్కడే అందరూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా తాను చెన్నైలో వివక్షను ఎదుర్కొన్నానంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నెలకొన్నది. చిరంజీవి సినీ స్టార్‌గా ఎదిగింది చెన్నైలోనే. ఆయన తన జీవితంలో ఎక్కువ సినీ కాలం గడిపింది చెన్నైలోనే..అన్నతోనే వుంటూ పవన్‌ కూడా చెన్నైలోనే వున్నారు. కాని ఇప్పుడు చెన్నైలో తాను వివక్షను ఎదుర్కొన్నారని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీ వార్షికోత్సవ సభలో సుమారు 90 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్‌ కళ్యాణ్‌ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. గతంలో ఆయన నెల్లూరుతోపాటు, అనేక పట్టణాల్లో తన చదవు సాగిందంటూ చెప్పేవారు. చెన్నైలోనూ చదువుకున్నాననేవారు. ఏది నమ్మాలో ఇప్పటికీ ఎవరికీ అర్దం కాకుండాపోయింది. పైగా ఓసారి తెలుగు అంటారు. మరో సారి ఇంగ్లీష్‌ అంటారు. బోటనీ అంటారు..ఇలా ఆయనకు అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చదివినట్లు లెక్క అన్న ధోరణిలో చెబుతుంటారు. పదే పదే ఇలాంటి అంశాలలో చెప్పిన ప్రతీసారి కొత్తదనం కోసం కథలు చెప్పినట్లు తన బాల్యం గురించి చెబుతారు. ఇక తాను చెన్నైలో కంప్యూటర్‌ కోర్సు చదవిన సమయంలో అంటూ పిఠాపురంలో కొత్త కథ చెప్పారు. అప్పటికే తాను నాలుగు సినిమాలు చేసిన హీరోనైనా సరే తాను బైటకు వెళ్తే ఇంటికి వచ్చేవరకు భయపడేవారంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చెన్నైలో వుండగా జరిగిందని ఒక సంఘటన చెప్పిన మరుక్షణమే సికింద్రాబాద్‌లోని సంగీత్‌ ధియేటర్‌ సంగతి చెప్పారు. జనం ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో కూడా అర్దం కాకుండా రాసుకొచ్చుకొని మరీ చెబుతుంటారు. పవన్‌ కల్యాన్‌ తన తండ్రి గురించి గతంలో చెబుతూ ఆయన కమ్యూనిస్టు వాది ఆయన నాస్తికుడు అని చెప్పారు. వాళ్ల నానమ్మ దేవుడికి హారతి ఇస్తే దానితో సిగరెట్‌ వెలిగించుకునేవారు అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణే చెప్పారు. ఇప్పుడు మళ్లీ మా కుటుంబంలో నా చిన్న నాటినుంచి ఇంట్లో రామనామం వినిపిస్తూనేవుండేదంటారు. తన తండ్రి రామభక్తుడని పిఠాపురం సాక్షిగా చెప్పుకొచ్చారు. తాను నాస్తికవాదినంటూ పవన్‌ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. పైగా తాను బాప్టిజం తీసుకున్నానని కూడా ఆయనే చెప్పారు. తన పిల్లలకు కూడా బాప్టిజం తీసుకున్నానని గతంలో చెప్పారు. పిఠాపురం సాక్షిగా తాను 14వ ఏటనే పూజలు చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి తాను కృషిని మాత్రమే నమ్ముతానని ఏ దేవుడిని నమ్మనంటూ వ్యాఖ్యానించారు. మరో సోదరుడు నాగబాబు తాను ఏ దేవుడిని నమ్మనంటూ కూడా ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి పవన్‌ మాత్రం మా ఇంట్లో సనాతనధర్మానికి ఎంతో విలువిస్తామంటూ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మమే లేకుంటే మన వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యేదంటూ కొత్త కొత్త భాష్యాలు చెప్పారు. ఇవన్నీ విన్న జనసైనికులకు కూడా అసలు సభ ముఖ్య ఉద్దేశ్యమేమిటి? పవన్‌ కళ్యాన్‌ మాట్లాడుతున్నదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇలా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశ్యమేమిటి? దాని విధానాలేమిటి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పటి వరకు సాధించిందేమిటి? ఇంకా సాధించాల్సిందేమిటి? జనసేన ఎలా ముందుకు సాగాలి? ఎప్పుడు అధికారంలోకి రావాలి? పార్టీ నిర్మాణం ఎలా సాగాలి? ఎంత మంది సభ్యులున్న పార్టీగా చరిత్ర సృష్టించాలి. ప్రాంతీయ పార్టీగా వుండాలా? జాతీయ పార్టీగా ఎదగాలా? అందుకు నాయకులు ఏంచేయాలి? కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీ నిర్మాణంలో ఎవరెవరు? ఎలాంటి పాత్ర పోషించాలి. కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకోసం కేటాయిస్తే వారి భవిష్యతేమిటి? రాజకీయంగా వారికి ఎలాంటి పదవులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? కూటమిలో చేరి ప్రజలకు ఇచ్చిన హమీల సంగతి ఏమిటి? వాటి అమలు తీరేమిటి? ఆరు గ్యారెంటీల ప్రస్తావనేది? వాటి అమలులో అవరోదాలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఎప్పటి వరకు వాటిని పూర్తి చేసే అవకాశం వుంది? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు జనసేను సంబంధం వుందా? లేదా? ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వంలో వుండి ప్రశ్నిస్తారా? లేక అమలు కాకుండా ఎదిరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా? లేదా మరో 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు అని చెప్పిన మాటలకు కట్టుబడి వుంటారా? 2014 ఎన్నికల ముందు కలిసి సాగిన కూటమిలో లుకలుకలు వచ్చినట్లు వస్తాయా? రాకుండా చూసుకుంటానని హమీ ఇస్తారా? ఇలాంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాని నలభై ఏళ్లు తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పి తన వల్లే కూటమి విజయం సాధించిందని పరోక్షంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమి మధ్యలో చిచ్చు రాజేసేందుకు కారణమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా 2019 ఎన్నికల్లో 175 సీట్లకు జన సేనపోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత జనసేనలో లేడు. పవన్‌ కళ్యాన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎవరు గెలవాలో..ఏ పార్టీని ఓడిరచాలో నిర్ణయం చేసేది ప్రజలు. కాని నాయకులు కలలు కంటుంటారు. ఎల్లకాలం మేమే వుంటామన్న భ్రమల్లో బతుకుతుంటారు. కాని ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాక్టికల్‌గా వుంటారు. గెలుపోటములు దైవాదీనాలంటూ చెబుతారు. కాని పవన్‌ కల్యాన్‌ అందుకు భిన్నంగా చెబుతుండడంతో జనం నవ్వుకుంటున్నారు. అసలు జనసేన పోటీ చేసిందే 21. కాకపోతే మొత్తం సీట్లు గెలిచారు. 150 సీట్లలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ విజయం సామాన్యమైంది కాదు. 135 సీట్లు గెల్చుకున్నది. ఆ గెలుపు కింద జనసేన గెలుపు అన్నది చాలా చిన్న విషయం. ఇకపోతే పిఠాపురంలో తన గెలుపుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మతోపాటు ఆయన కుమారుడు వర్మ పాత్ర వుందని కొనియాడారు. వర్మ చేత ఆశీస్సులు తీసుకున్నారు. కాని ఇప్పుడు పరోక్షంగా వర్మ లాంటి వాళ్లు అలా అనుకుంటే తమ ఖర్మ అన్నట్లు నాగబాబు అన్నారు. ఇదిలా వుంటే జాతీయ మీడియా పవన్‌ పై రాసిన ఆర్టికల్స్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో తాను ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైట్‌ నుంచి లెఫ్ట్‌కు, లెఫ్ట్‌ నుంచి సెంటర్‌కు అంటూ ఓ దినపత్రికలోవచ్చిన కధనంపై రకరకాల బాష్యాలు చెప్పారు. అలా మారాల్సిన పరిస్దితులు వచ్చాయని చెప్పుకున్నారు. చెగువేరా ఒక డాక్టర్‌గా మాత్రమే తెలుసని, ఆయన చేసిన సేవలు మాత్రమే తనకు తెలుసంటూ కొత్త లెక్కలు చెప్పడంతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన అనే వ్యాఖ్యలతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ఎంపీ మల్లు రవికి సన్మానం..

ఎంపీ మల్లు రవికి సన్మానం..

కల్వకుర్తి /నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కల్వకుర్తి పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీల సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ పండిత్ రావు ఎంపీ మల్లు రవిని సన్మానించారు. అనంతరం మార్కెట్ ను సందర్శించి మార్కెట్ లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలభిషేకం.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

సిరిసిల్ల టౌన్  ( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని నిన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన కాంగ్రెస్ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు . కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పశువులకు ఇచ్చే వ్యాక్సినేషన్ సకాలంలో ఇప్పించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా చింత వైద్య శిబిరంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version