ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.
◆యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
◆డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
◆ మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో మొగడం పల్లీ మండల మాజీ కోప్షన్ మెంబర్ హర్షద్ పటేల్ ఏర్పాటు చేసిన ఇప్తార్ వేడుకల్లో యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్ హాజరయ్యారు. ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మైనార్టీ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.