బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్ యాక్సిడెంట్ జరిగిందా.!

కార్ యాక్సిడెంట్ జరిగిందా? డోంట్ వర్రీ- వెంటనే ఈ 10 పనులు చేస్తే అంతా సేఫ్​!

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మన దేశంలో ప్రతీ గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతీ నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ప్రపంచ బ్యాంక్ గతంలో విడుదల చేసిన ఓ నివేదికలోని వివరాలు ఇవి. మొత్తం మీద ఇది భారత్‌లోని రోడ్లపై డ్రైవింగ్ అనేది పెద్ద సవాలుతో కూడిన విషయమని స్పష్టం చేసింది. నిత్యం ఎన్నో కార్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఒకవేళ మీ కారు ఇలాంటి ప్రమాదం బారినపడితే వెంటనే చేయాల్సిన 10 విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

కారును ఆపండి :

రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, అక్కడే మీ కారును ఆపేయండి. దీనివల్ల మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరార్ కావద్దు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు.

గాయాలపాలైన వారికి సాయం చేయండి :

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందేలా ఏర్పాట్లు చేయండి. అంతకంటే ముందు మీకు అయిన గాయాలను చెక్ చేసుకోండి. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ స్కీమ్​ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి.

వైద్య సాయం పొందండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మీ కారులోని ప్రథమ చికిత్స పెట్టెను వాడుకోండి. గాయపడిన వారికి అందులోని సామగ్రితో ప్రథమ చికిత్స చేయండి. మీకు గాయాలైతే మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. ఇదే సమయంలో తప్పకుండా అంబులెన్సుకు కబురుపెట్టండి. మీ ప్రాథమిక చికిత్స ప్రక్రియ పూర్తయ్యేలోగా అంబులెన్సు వస్తుంది. దానిలో ఆస్పత్రికి చేరుకోవచ్చు.

బీమా కంపెనీకి సమాచారం ఇవ్వండి :

Car Insurance

 

 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ చికిత్స చేయించిన వెంటనే, బీమా కంపెనీకి ఈ ప్రమాదంపై సమాచారాన్ని అందించండి. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకు అయిన గాయాలు, ఇతరులకు అయిన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వంటి వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.

పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి :

ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదంటే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీని బీమా కంపెనీ అడుగుతుంది.

ఫొటోలు తీయండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం ఫొటోలన్నీ తీయండి. గాయపడిన వారి ఫొటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావడంలో ఈ ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయి.

డాక్యుమెంట్లు సమర్పించండి :

రోడ్డు ప్రమాదం విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేసిన వెంటనే, మీరు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ జాబితాలో డ్రైవింగ్ లైసెన్సు, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, కారు ఆర్‌సీ, కారు బీమా పత్రాలు, రిపేర్ అంచనా నివేదికలు ఉండాలి. ఇవన్నీ ఇచ్చాక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను సెటిల్ చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

కారును రిపేర్ చేయించుకోండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారును రిపేర్ చేయించవద్దు. బీమా కంపెనీ ఒక సర్వేయర్‌ను పంపుతుంది. అతడు వచ్చి కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నమోదు చేసుకుంటాడు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను సర్వేయర్ అంచనా వేస్తాడు. ఆ నివేదికను అతడు బీమా కంపెనీకి అందజేస్తాడు. ఈ ప్రాసెస్ ముగిశాక మనం కారుకు మరమ్మతులు చేయించుకోవచ్చు. కారును మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లే సౌకర్యాన్ని సైతం బీమా కంపెనీ కల్పిస్తుంది. ఆ బీమా కంపెనీ పరిధిలో లేని మెకానిక్ వద్ద కూడా కారును రిపేర్ చేయించుకోవచ్చు. మెకానిక్ నుంచి పొందిన బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించి, రీయింబర్స్‌మెంట్‌ను పొందవచ్చు.

కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ :

బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో కొన్ని కార్ గ్యారేజీలు ఉంటాయి. వాటిలో మీరు కారును రిపేర్ చేయించుకుంటే, నేరుగా ఆ గ్యారేజీకే బీమా కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు నెట్‌వర్క్‌లో లేని గ్యారేజీలో కారును రిపేర్ చేయించుకుంటే, మీకు అంత మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.

సదా అప్రమత్తంగా ఉండండి :

రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అది అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే మనం నిత్యం అలర్ట్‌గా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, తక్కువ వేగంతో కారును డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో వాహనం నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలన్నీ కారులో సిద్ధంగా ఉంచుకోండి.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ & మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కాలువ పూలమాలలతో కేక్ కట్ చేసి
జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు వైద్యనాథ్ అఖిల్ మియా బసవరాజ్ జాలేందర్ మహేష్ సునీల్ సిద్దూ సాయినాథ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.!

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పట్టణ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డ ఆదేశాల మేరకు పార్టీ 2 వ వార్డు అద్యక్షులు పోతరాజు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదన్నపేట చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చి నర్సంపేటను సస్యశ్యామలం చేసిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డిది అని పేర్కొన్నారు.మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ కు నిధులు తీసుకువచ్చి చెరువు అభివృద్ధికి కృషిచేశారని,పట్టణ ప్రజల తాగునీటి కోసం అర్బన్ మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు సౌకర్యం కల్పించారని వివరించారు.వైద్య రంగంలో డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, మెడికల్ కళాశాల, టీ డయాగ్నొస్టిక్ సెంటర్ , నర్సంపేట కి తీసుకు వచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని,ఈనెల 27 న జరిగే బిఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,మాజి కౌన్సిలర్లు బండి ప్రవీణ్, శివరాత్రి స్వామీ, బండి రమేష్, వాసం సాంబయ్య,పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్, 2 వ వార్డు పార్టీ ముఖ్యనాయకులు ముత్తినేని వీరస్వామి, ముత్తినేని వీరన్న, ముత్తినేని శ్రీను, ముత్తినేని సోమేశ్, పోతురాజు అచ్చయ్య, పోతరాజు రాజు, వడిజర్ల శీను, పొన్నల ప్రభాకర్, ముస్కు శీను, జడల శీను, మల్లేష్ గూడెపు, యాకు భాష, గూడెప్ రాకేష్, ఆకుల చందు, ఆకుల వీరన్న, మిటబెల్లి శీను, చందు రాజు, మల్లూరు దేవన్న, హంస రవి, వంశీ, ఆకుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన.

మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్.గ్రామానికి చెందిన పోరాట యోధుడు కామ్రేడ్ దిగవంతి సింగిరెడ్డి భూపతిరెడ్డి కూతురు బద్దం సత్యవ కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించినా మనో ధైర్యం ఇచ్చిన నాయకులు అలాగే జిల్లా రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు కూర అంజిరెడ్డి తండ్రి కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పి రెడ్డి సంఘం తరఫున కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల పాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగల రాజు తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మిట్టపల్లి రామ్ రెడ్డి తదితరులు పరామర్శించారు

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామడుగు, నేటిధాత్రి:

 

తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని
ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో గాలించగా తాటివనంలో కావలి భూమయ్య ఒంటరితనం తట్టుకోలేక తాగుడుకు బానిసై నమిలినారా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోని కనిపించాడని మృతుడు భూమయ్య సోదరుడి కొడుకు కావాలి రాజు తండ్రి పోశాలు ఫిర్యాదు చేయగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామడుగు ఎస్సై రాజు తెలిపారు.

మందమరి మినీ ట్యాంక్ బై సీసీ కెమెరాలు.

మందమరి మినీ ట్యాంక్ బై సీసీ కెమెరాలు

మందమర్రి నేటి ధాత్రి

 

 

ఈ రోజు గురువారం రోజున మందమర్రి మినీ ట్యాంక్ బండ్ పైన సీసీ కెమెరాల ను అమర్చడం తో పాటు గతంలో ట్యాంక్ బండ్ ని సందర్శించి ట్యాంక్ బండ్ పై ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ రాజలింగు గారికి ఆదేశాలు ఇవ్వడం తో వాకార్స్ కు అడ్డంగా ఉన్నా పెద్ద పెద్ద తుమ్మ చెట్లను దాదాపు ఒక వారం రోజుల పాటు జేసీబీ ట్రాక్టర్ల తో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద తుమ్మ చెట్లను తొలగించి శుభ్రం చేయడం జరిగింది..

అక్కడ మహిళకు ఎలాంటి ఇబ్బందులు జరగాకుండా పోలీసు సెక్యూరిటీ నీ ఏర్పాటు చేయడం జరిగింది…

దానితో పాటు ఈ రోజు పెద్దమొత్తంలో ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది..

Police

 

 

 

అడగగానే అతి తక్కువ సమయంలో పెద్ద మనుసుతో పైన తెలిపిన పనులు చేపించిన చెన్నూరు శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు బడుగు బలహీన వర్గాలు ఆశ జ్యోతి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారికి మరియు యువ నాయకులు డైనమిక్ పెద్ద పల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ గారికి వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గారు మరియు కమిటీ సభ్యులందరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి ఎల్లపుడు ఋణపడి ఉంటామని తెలిపారు…,

`తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్‌’’

‘‘కేసిఆర్‌’’ నాయకత్వం వరం..తెలంగాణ అయ్యింది బంగారం: రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’.

బీఆర్‌ఎస్‌’’ రజతోత్సవాలు తెలంగాణ ప్రజల పండుగ.

‘కేసిఆర్‌’’ లాంటి నాయకులు యుగానికొక్కరు మాత్రమే వుంటారంటున్న రాజ్యసభ సభ్యుడు, ‘‘బిఆర్‌ఎస్‌’’ సీనియర్‌ నాయకుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో

‘‘బిఆర్‌ఎస్‌’’ రజతోత్సవ వేడుకలు,

‘‘కేసిఆర్‌’’ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే…

`తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్‌’’

`పట్టు వదలని విక్రమార్కుడు’’గా తెలంగాణ సాధించిన వీరుడు ‘‘కేసిఆర్‌’’

`తెలంగాణ కర్త, కర్మ, క్రియ ‘‘కేసిఆర్‌’’

`తెలంగాణ ఆత్మ గౌరవం నిలిపిన నాయకుడు ‘‘కేసిఆర్‌’’

`ఉద్యమాన్ని, రాజకీయాన్ని రంగరించి తెలంగాణ సాధించిన ‘‘అపర చాణక్యుడు కేసిఆర్‌’’

`రాజకీయంగా అస్తిత్వాన్ని చూపించి తెలంగాణ తెచ్చిన నేత ‘‘కేసిఆర్‌’’

`ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఉద్యమ రాజకీయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ‘‘కేసిఆర్‌’’

`‘‘కేసిఆర్‌’’ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు

`‘‘కేసిఆర్‌’’ ను కాదని తెలంగాణను చూడడం చరిత్రకే సాధ్యం కాదు

`తెలంగాణ రాష్ట్ర సిద్ది కోసం పడిన పరిశ్రమ ‘‘కేసిఆర్‌’’

`తెలంగాణ తేవడమే జీవిత లక్ష్యంగా రాజకీయం నడిపిన నాయకుడు ‘‘కేసిఆర్‌’’

`‘‘బిఆర్‌ఎస్‌’’ ‘‘రజతోత్సవ’’ సభతో కాంగ్రెస్‌ గుండెలు అదిరిపోతాయి

`మరో 25 సంవత్సరాల వరకు ‘‘బిఆర్‌ఎస్‌’’ అధికారంలో వుండేందుకు పునాదులు పడతాయి

`ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను ఎప్పుడూ నమ్మరు

`సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తెలంగాణను బంగారం చేసిన ఘనత ‘‘కేసిఆర్‌’’ది

`తెలంగాణ తెచ్చి, బంగారు తెలంగాణ చేసిన నాయకుడు ‘‘కేసిఆర్‌’’

`‘కేసిఆర్‌’’ లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే మరొకరు కనిపించరు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
నా పల్లెలో నీరెందుకు లేదు? నా ఊరుకు నీళ్లెందుకు రావు? నా చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి? చెరువులెందుకు ఒట్టిపోతున్నాయి? నా తెలంగాణ ఎందుకు పచ్చబడదు? నా తెలంగాణలో నీళ్లెందుకు పరవళ్లు తొక్కవు? పంటపొలాల నిండా నీళ్లెందుకు వుండవు? బావుల్లో ఊటమెందుకు మాయమైపోతున్నాయి? చేదబావుల్లో నీళ్లెందుకు అడుగంటుతున్నాయి? చుక్క నీరు కూడా లేక జనం గొంతు ఎండుతోంది? ఎవరి లోపం? ఎందుకు ప్రశ్నించలేకోతున్నాం? ఎందుకు నిలదీయలేకపోతున్నాం? ఎందుకు తెలంగాణకు నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాం? అటు ఫ్లోరైడ్‌ పీడన, ఇటు సాగుకు రైతు వేధన ఎంత కాలం? ఎన్నెళ్లు ఈ ఆరాటం? ఊళ్లన్నీ వల్లకాడులౌతున్నాయి? తెలంగాణ పల్లె జనం వలసలు పోయి ఇళ్లన్నీ కూలిపోతున్నాయి. వాకిళ్లు పొక్కిళ్లు తేలి, ఊరు పాడుబడితోంది? నా తెలంగాణకే ఎందుకీ గోస? మా ప్రజలకే ఎందుకీ బాధ? అని ప్రతి క్షణం కన్నీరు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్‌. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా..అంటూ కవులు పాడుతుంటే కన్నీరు మున్నీరైన నేత కేసిఆర్‌. అందుకే తెలంగాణకు విముక్తి జరిగితే తప్ప మన ప్రాంతం బాగు పడదని బలంగా నమ్మి జై తెలంగాణ నినాదం అందుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌ అంటున్న రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వద్ది రాజు రవిచంద్ర నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో కేసిఆర్‌ గురించి పంచుకున్న ముచ్చట్లు ..ఆయన మాటల్లోనే…

బలవంతంగా చేసిన పెళ్లితో సంసారం కల కాలం సాగదు. గతి లేని సంసారమైనా సాగుతుందేమో? కాని శృతిలేని సంసారం సాగదు?ఉ మ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. పాలనతో వివక్ష చూపుతూ వచ్చారు. అభివృద్దిలో సవతి తల్లి ప్రేమ చూపారు. తెలంగాణను ఎండబెట్టారు. ఏపిని పండుగ చేసుకున్నారు. ఏపి, తెలంగాణ కలవక ముందు తెలంగాణలో కరవు లేదు. తెలంగాణలో పీడ లేదు. తెలంగాణకు ఆకలి లేదు. కాని ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాగానే శాపం తగిలినట్లు తెలంగాణ వాడిపోయింది? ఎండిపోయింది? నీటికి గోసపడాల్సి వచ్చింది. సాగు పడిపోయింది. రైతుకు దుఖం మిగిలింది. ఇల్లు, ఊరు, భూమిని వదలుకొని తెలంగాణ పల్లె జనం వలసలు పోయే దుస్తితి వచ్చింది. సాగులేదు. కొలువు లేదు. తెలంగాణకు సరిగ్గా సదువులేదు. సౌకర్యాలు లేవు. కరంటు లేదు. ఏదీ లేదు. కాని ఏపిలో అన్ని సమకూరుతున్నాయి. కాలువలు లేని చోట కొత్త కాలువలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు తెలంగాణకన్నా సాగులో ఏపి వెనుకబడి వుంది. తెలంగాణతో కలవగానే ఏపి అన్న పూర్ణగా మారింది. అయినా తెలంగాణతో జతకట్టి బాగు పడ్డామని ఏపి నాయకులు అనుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృ ద్ది చేయాలనుకోలేదు. రెండు ప్రాంతాలు కలిసినప్పుడే తెలంగాణ వద్దని మొత్తుకున్నది. కాని బలవంతంగా కలిసి, తెలంగాణను చిల్లం చిల్లం చేశారు. తెలంగాణను గోస పెట్టారు. ఈ గోసను చిన్న నాటి నుంచి కళ్లారా చూసిన కేసిఆర్‌ను రగిలించింది. తెలంగాణ ఉద్యమ బావుటా ఎగురవేయాలని ఆనాడే కేసిఆర్‌ మది సంకల్పించింది. సమైక్య వాదులు చేసిన మోసాన్ని, పాపాన్ని కడిగేసే సమయం వచ్చింది. కేసిఆర్‌ చేతి పిడికిలి బిగించింది. జై తెలంగాణ అని ఎలుగెత్తి చాటింది. దిక్కులు పిక్కటిల్లేలా కేసిఆర్‌ గొంతు జై తెలంగాణ నినానం చేసింది. అంతే తెలంగాణ మొత్తం గొంతు సవరించుకొని జై తెలంగాణ అని జై కొట్టింది. ఎందుకంటే కేసిఆర్‌ అనే పదమే ఒక ఉప్పెన. కేసిఆర్‌ అనే పదమే ఒక విజృంభన. కేసిఆర్‌ అనే పదమే ఒక ఉద్యమం..ఒక ఆరాటం..ఒక పోరాటం. ఒక ఆలోచనతో కూడిని ఆవేశం. మొత్తంగా కేసిఆర్‌ పిలుపే ఒక ప్రభంజనం. అందుకే కేసిఆర్‌ జై తెలంగాణ అన్న వెంటనే తెలంగాణ సమాజం కదలింది. ఉప్పెనై పొంగింది. వరదలా జై తెలంగాణ నినాదం మారు మ్రోగింది. కేసిఆర్‌ అనే మూడక్షరాల పదంలోనే తెలంగాణ వుంది. తెలంగాణ జీవితం వుంది. తెలంగాణ ఆత్మ వుంది. తెలంగాణ జీవం వుంది. తెలంగాణ జీవితం ప్రజలకు కేసిఆర్‌లో కనిపించింది. కేసిఆర్‌తో కలిసి తెలంగాణ సమాజం నడిచింది. తెలంగాణ కోసం ప్రజ తెగించి కొట్లాడిరది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి యుగానిక్కొరే కేసిఆర్‌ లాంటి యుగ పురుషులు జన్మిస్తారు. ప్రజల కోసం తమ జీవితం కరిగిస్తారు. జనం కోసమే జీవిస్తారు. జనం దుఖమే తమ దుఖమనుకుంటారు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి గొప్ప సుగుణాలే కాదు, పోరాట విలువలున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. జనమే కేసిఆర్‌, కేసిఆరే జనం అన్నంతగా ప్రజల గుండెల్లో నిండిపోతారు. అలాంటి కారణజన్ముడు తెలంగాణ సాధన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. పుబ్బలో పుట్టి మగలో మాయపోతుందని ఎగతాలి చేసిన వాళ్లును తెలంగాణ పొలిమేర దాక తరిమికొట్టిన నాయకుడు కేసిఆర్‌. తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎద్దేవా చేసిన వారి కళ్లు కుల్లుకునేలా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశారు. ఒకప్పుడు కోనసీమలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే అదే కోనసీమలో 50 ఎకరాలు కొనొచ్చు అనే స్ధాయికి కేసిఆర్‌ తెచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారు. తెలంగాణకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వడమే కష్టమన్న వారు చూస్తుండగానే ఇంటింటికీ దేశంలోనే ఎవరూ ఇవ్వనటువంటి సురక్షితమైన మంచినీటిని అందించారు. ఆరోగ్య తెలంగాణను కేసిఆర్‌ ఆవిష్కరించారు. ఎత్తి పోతల తప్ప తెలంగాణకు దిక్కులేదు..అంత శక్తి ప్రభుత్వానికి లేదు…తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేం..ఆ ప్రాంత దౌర్భాగ్యానికి మేమేం చేయలేమని సమైక్య వాదులు ఈసడిరచుకున్నారు. తెలంగాణలో పుట్టడమే మీ ఖర్మ అన్నంతగా నిర్లక్ష్యం చేశారు. ఆ కసి నుంచి పుట్టిన జంరaామారుతమే కేసిఆర్‌. ఏ నోటితోనైనా తెలంగాణ పచ్చబడడం కల అని అన్నారో వాళ్ల నోటితోనే తెలంగాణ అన్న పూర్ణ అనిపిస్తానని చెప్పి మరీ నీళ్లు తెచ్చిన అపరభగీరధుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తునక చేశాడు. సహజంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కుదుటపడడానికే కొంత సమయం పడుతుంది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణకు వెలుగులు పంచారు. ఆరు నెలల్లో తెలంగాణలో కరంటు కోతలు లేకుండాచేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కరంటువస్తుందో..ఎప్పుడు పోతుందో.. తెలియని పరిస్దితి నుంచి తెలంగాణలో చీకట్లను తరిమేసిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాత్రిళ్లు కూడా పగలును మరిపించేలా వెలుగులు విరజిమ్ముతుంటే, ఏపిలో కరంటు కోతలతో అల్లాడిరది. తెలంగాణ వస్తే కరంటు వుండదు..అంధకారమౌతుందని చెప్పిన వాళ్ల కళ్లు తెరిపించేలా కరంటువెలుగులు నింపారు. మరో వైపు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చారు. ఏడాది లోపే మిషన్‌ కాకతీయ జలయజ్ఞం మొదలుపెట్టారు. చెదిరిపోయి, పూడిపోయి, ఆనవాలులేకుండా పోయిన చెరువులను బాగు చేశారు. తెలంగాణలో వున్న 46వేలకు పైగా చెరువులను మూడు దఫాలుగా మూడేళ్లలో రూపు రేఖలు మార్చారు. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు పోయించారు. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఎండిపోయిన బావులు నీళ్లు ఎల్లబోశాయి. బోర్లు వేసి, వేసి అలసిపోయిన రైతులకు పాత బావులు నిండి పొలాలు పారాయి. తమ జీవిత కాలంలో కూడా అచ్చు కట్టని భూములను కూడా రైతులు సాగుకు సన్నద్దంచేశారు. చెను, చెలకల్లో కూడా వరి పండిరచి, గుంట స్ధలం కూడా వదిలిపెట్టకుండా రైతులు పొలాలుగా మార్చుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు వస్తుండడంతో వలసలు పోయి తెలంగాణ ప్రజలు మళ్లీ పల్టెబాట పట్టారు. చెదిరిపోయిన ఇళ్లను బాగు చేసుకొని, పల్లెల్లో బంగారం పండిస్తున్నారు. సాగుతోపాటు, పాడిని పెంచుకుంటూ, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రైతు కూడా రకరకాల ఆదాయ మార్గాలను ఎంచుకునేలా చేశాడు. ఇరవై నాలుగు గంటల కరంటుతో అనేక ఉపాది అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు జిరాక్స్‌ కావాలంటే కూడా రోజులో కరంటు ఎప్పుడొస్తుందా? అని గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లే, ఇప్పుడు సాగుతోపాటు జిరాక్స్‌ మిషన్లు తెచ్చి అదనపు ఆదాయం సంపాదించుకుంటున్నారు. తెలంగాణ పల్లెలను ఆదాయసృష్టి వనరులుగా మార్చారు. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. అందుకే కేసిఆర్‌ తెలంగాణప్రజల దేవుడు. ఊరును మట్టిదిబ్బ, పొలాన్ని ఎడారి చేసిన సమైక్య వాదుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణను రక్షించి, తెలంగాణ తెచ్చి పల్లెను పాలవెల్లిని చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్‌.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

90 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి:

 

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు ఇస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసంగి సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ముందస్తుగానే ప్రణాళిక చేసి సాగు నీటిని విడుదల చేసి గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించాము. తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న వడ్లకు రూ.500 చెల్లిస్తున్నాము.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేసంగి సీజన్లో భూమికి బరువైనన్ని వడ్లు వచ్చాయి.
ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెలువెత్తుందని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావొద్దు, కొనుగోలు కేంద్రాలకు రైతును తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య ,గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, రోమల రమేష్, దోమకొండ మహేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి,రాజ గోపాల్ రెడ్డి ,కర్ర బాపు రెడ్డి, తోట సంధ్య ,రెండ్ల శ్రీనివాస్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

 

*వనపర్తి పట్టణములో పాత బజార్ 4వ వార్డ్ లో దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి అమ్మవారికి వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు
అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడిగిన వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సహాయం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
తిరుమల మహేష్ విగ్రహ ప్రతిష్ట కు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తిరుమల మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు ఓ బీ సీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మాజీ మున్సిపల్ వై
స్ చైర్మన్ బి కృష్ణ కృష్ణ నందిమల్ల శ్యామ్ పాషానాయక్ పరుశురాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీ పీ సీ సీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు

గురుకుల పాఠశాల విద్యార్థులను.!

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన కూన గోవర్ధన్
మెట్ పల్లి ఏప్రిల్ 16

నేటి ధాత్రి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆసుపత్రిలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి

పరకాల ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

గాలి వాన బీభత్సం నేల వాలిన పంటలు.

గాలి వాన బీభత్సం.. నేల వాలిన పంటలు

అకాల వర్షం రైతన్నల పాలిట శాపం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలో రాత్రి సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించే లాగా విపరీతమైన ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

Farmers

 

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుము లు మెరుపులతో ఎడతెగని గాలి,వాన కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు తడిచి ముద్దయిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావిం చిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశ లు చేసింది. ఏదై ఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.

ప్రభుత్వమే ఆదుకోవాలి రైతన్నల ఆవేదన

మూసికె అశోక్ శాయంపేట రైతు

 

శాంపేట మండలంలో మంగళవారం రాత్రిపూట వర్షానికి రైతులు చాలు చేసిన మొక్కజొన్న పంట అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగింది. మండలంలోని ముష్క అశోక్ మూడు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశారు మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి పంట అంతా నేలకొరిగింది దీంతో రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలలలో అరటి చెట్లు గాలివాన బీభత్సానికి నెలకు వాలింది. కూతురు రాజు, కోల మల్లయ్య, కోల చక్రపాణి, గాదె చిరంజీవి, కురాకుల ప్రశాంత్ 10 ఎకరాల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పాలవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Farmers

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

శాయంపేట మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైలారం, పెద్దకోడేపాక, కొప్పుల, పత్తిపాక, హుస్సేన్ పల్లి, శాయంపేట, గట్లకానిపర్తి, తహరాపూర్, కొత్తగట్టు సింగారం గ్రామాలలో మంగళ వారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న పంటలను అర్చన, అన్వేషు, రాకేష్ ఏ ఈ ఓ లు ఉబ్ సందర్శించడం జరిగింది. అందులో మొత్తం 245మంది రైతుల వరి చేను 347ఎకరా లు,38మంది రైతుల 57ఎ కరాల మొక్కజొన్న,15మంది రైతుల 30ఎకరాలు అరటి తోట దెబ్బతిన్నాయి.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు

రోడ్డు దిగ్బంధం,రోడ్డుపై బైఠాయించి ధర్నా

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన.!

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలో నిన్న అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యాన్ని పరిశీలించి మీరు అధైర్యపడకూడదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రైతులకు దైర్యం చెప్పి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వంచే కొనుగోలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ సహాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి.

దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి

పాదయాత్ర చేపట్టిన జాతీయ బిసి హక్కుల పోరాట సమితి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల పట్టణంలోని ఐ.బి.చౌరస్తా నుండి హాజీపూర్ మండల కేంద్రం వరకు జాతీయ బిసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు.దేశవ్యాప్త బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి.కుల గణన చేరిస్తే అదనంగా ఒక కాలం మాత్రమే చేరుతుంది.దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు ఒక కాలం చేర్చడానికి వెనుకాడుతున్న కేంద్రపాలకులు ఈ దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నాం.జనగణలో కుల గణన భాగం చేస్తే విద్యా ఉద్యోగాలతో పాటు ప్రస్తుతం స్థానిక సంస్థలలో కొనసాగుతున్న రిజర్వేషన్ పెంచాల్సి వస్తదని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే బీసీ కుల గణన అనుకూలంగా దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి.పది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ కుల గణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీల వివక్షగా భావిస్తున్నాం. పది సంవత్సరాల క్రితమే మేము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని చెప్పిన బిజెపి మోసం చేసింది అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బిసి కులగణనకు శ్రీకారం చుడతామని చెప్పి మోసం చేసిన ఘనత బిజెపికి దక్కింది.ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్,బీసీల ఉద్యమ ఆకాంక్ష బీసీలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యవాట ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ అంశాన్ని తీసుకెళ్లి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్, నాయకులు శాఖ పురి భీమ్ సేన్,శ్రీపతి రాములు,పెండ్లి రాములు,ఆరెందుల రాజేశం, అంకం సతీష్ ,పంపరి వేణుగోపాల్,బండా సతీష్ అందే సంతోష్,చెలిమెల అంజన్న,భీమ్ రావు,సూర్ల శంకర్,ఎల్లాపుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఏ వన్, ఏ టూ గా కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడిన పిరికిపంద చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం, టీపీసీసీ పిలుపు మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం చరిష్మా ను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే కేసు విచారణలో ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమంగా సంపాదించిన సంపత్తి ఉందన్న నిబంధనలపై నిర్థారణ లేదని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకువస్తామనీ చట్టపరంగా, రాజకీయంగా దీనికి గట్టి ఎదురుదెబ్బ ఇస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, మాజీ వార్డు సభ్యులు ఉప్పులపు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ , గాండ్ల సమ్మయ్య, బుడిగె శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, బంగారు ప్రసాద్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, రాజేశం, గండి కుమార్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ మండలానికి చామనపల్లి.!

కరీంనగర్ మండలానికి చామనపల్లి చోక్కారావు పేరును నామకరణం చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంతోమంది నిరుపేదల ఆరాధ్య దైవం చామనపల్లి గ్రామానికి చెందిన చోక్కరావు పేరును కరీంనగర్ మండలానికి నామకరణం చేసి ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు. బుధవారం రోజున సిపిఐ కరీంనగర్ మండల ఎనిమిదవ మహాసభ మండల కార్యదర్శి సాయవేని రాయమల్లు అధ్యక్షతన జరిగింది. మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కరీంనగర్ మండలమే కాకుండా జిల్లాలోని ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం భూమి లేని నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పార్టీకి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి చామనపల్లి చోక్కారావు ఈగ్రామంలో పుట్టడం ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. చోక్కారావు నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శనీయవంతుడని ఆయన లాంటి నేత ఈప్రాంతంలో ప్రాంత ప్రజలను నిజాం రజాకార్ల చెర నుండి రక్షించాడని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందని పేదవారికి కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ఉద్యమిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడే పార్టీ సిపిఐ అని తిండి లేని వారికి అండదండగా ఉంటూ ఇంటి స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, నీటి సౌకర్యం, భూమికోసం అనేక పోరాటాలు చేసి వందల మంది కార్యకర్తలను జైలు పాలయ్యారని అలాంటి త్యాగం చేసిన పార్టీ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీయేనని పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో పేదవాడు పేదవాడి గానే ఉన్నవాడు ఉన్నవాడిగానే మిగిలిపోయారని కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకే ఊడిగం చేస్తుందని, మతం పేరా మారణ హోమం సృష్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందని కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వo పేద ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మెరుగు కొమరయ్య, ఇరుకుల్ల బాబు, తోట ఆంజనేయులు, బుర్ర రాజయ్య, కాశ వేణి సతీష్, నెల్లి రవీందర్, బుర్ర కుమారస్వామి, రాములు, నాంపల్లి, సత్తయ్య, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version