సివికే రావు 97వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పిసిసి మేంబర్

సివికే రావు 97వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పిసిసి మేంబర్ నల్లపు దుర్గాప్రసాద్

నేటిధాత్రి చర్ల :

 

ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళాతపస్వి సంఘసంస్కర్త సివికే రావు 97వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చర్ల మండలం నాయకులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు చిమల్లమరి మురళి కడియం సర్వేశ్వరరావు దొంతుకుర్తి రామారావు ఆవుల శివ విజయ నాయుడు గూడపాటి రంజిత్ తదితరులు పాల్గొని సివికేరావు కు శ్రద్ధాంజలి ఘటించారు

సీఎం సహాయ నిది పేదలకు వరం

సీఎం సహాయ నిది పేదలకు వరం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన ఈక సారక్క గారు మరియు ఎర్రవరం గ్రామనికి చెందిన ధనసరి యకబాబు ఇరువురు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభీవృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు
డా”ధనసరి అనసూయ సీతక్క
గారి కి విన్నవించగా.. తక్షణమే సీఎం సహాయ నీది నుంచి చెక్కులను ఇప్పించటం జరిగిందని అట్టి యొక్క చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో గురువారం రోజు కొత్తగూడ మండల కేంద్రం లో బాధితులకు అందించటం జరిగింది..ఈ కార్యక్రమం లో వజ్జ సురేందర్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బిట్ల శ్రీను, సోలం వెంకన్న, సిరిగిరి సురేష్, యాదగిరి కిరణ్, సునీల్, శ్రవణ్ ధనసరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు,,,

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తుందని మొగుడంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండలంలోని పలు వార్డులో స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోసి,ప్రొసిడింగ్‌లు అందజేశారు.ప్రతి ఒక్కరికి ఇంటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ పథకం లక్ష్యం.అందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మారుతి, హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ నిహారిక రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంగల్ కిష్టన్న,ఆలూరు కిష్టన్న,విష్ణు,రాజు, ఖాన్ సాబ్, లాలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో పర్యావరణ దినోత్సవం

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం:-

హాజరైన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

గురువారం రోజున “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ ని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్స్ బి.వి.నిర్మలా గీతాంబ, ఎ.పట్టాభి రామారావు జెండా ఊపి ప్రారంబించారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు నారాయణ బాబు, బి.అపర్ణాదేవి, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు యం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే మరియు ఇతర న్యాయమూర్తులు, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు సైక్లిస్ట్ తేజా రెడ్డి, కె.యం.సి.ఏ.జె.టీం (వావ్ వరంగల్) జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

 

Environment

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పర్యావరణమును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆరోగ్యకరమైన మరియు పచ్చని వాతావరణం మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. మొక్కలను కాపాడుకోవడంతో పాటు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని కొంతైనా నిర్మూలించుకోగలము. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు అందరం కలిసి నడువాలని కోరారు. అలాగే, పర్యావరణ ప్రాముఖ్యత గురించి, ప్రజలకు అవగాహన పెంచాలని ప్రధాన న్యాయమూర్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

మొదటి వార్షికోత్సవ సభ

మొదటి వార్షికోత్సవ సభ

మందమర్రి నేటి ధాత్రి :

 

మందమర్రి మార్కెట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి మొదటి వార్షికోత్సవ పాలన విజయోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం బి1 లో కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్,సేవాదళ్ నాయకుల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ కాకా మనవడు,వివేక్ వెంకట్ స్వామి గారి తనయుడు అయినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పాలన సంవత్సరం గడిచిన సందర్భంగా మందమర్రిలో కేకులు కట్ చేయడం జరిగింది. గెలిచాక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద కొడుకు లాగా ఉంటానని మాట ఇచ్చి నిలుపుకున్నాడు.లక్ష 35 వేల మెజార్టీతో అతి చిన్న వయసులో విజయం దక్కించుకున్న నాయకుడు గడ్డం వంశి గారు అని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పదివేల పెన్షన్ ఇవ్వాలని పోరాడి 144 కోట్ల పెన్షన్ ఫండ్ మంజూరు అయ్యేలా చేసిన ఘనత మరియు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని,ఎల్లంపల్లి ముప్పు గ్రామం బాధితులకు పరిహారం ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో కరోనా కాలంలో నిలిపివేసిన అజిని ఎక్స్ప్రెస్ పున ప్రారంభం,పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ ను హాల్టింగు రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి పెద్దపల్లి నియోజకవర్గం లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు మరియు ఎన్టిపిసి పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి,అలాగే బడుగు బలహీన వర్గాలకు త్రాగునీరు అందించేలా బోర్వెల్ లాంటి వివిధ అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామని ముత్తయ్య, వనం నర్సన్న,ఎర్ర రాజు,ఇషాక్, బండి శంకర్,లక్ష్మణ్,వెంకన్న, రాచర్ల గణేష్,సట్ల సంతోష్,విజయ్,సతీష్,వేణు,శ్రీనివాస్,అంజయ్య,రామకృష్ణ,
యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్,జావిద్ ఖాన్,మూడారపు శేఖర్, సురేందర్(సేవాదళ్), చోటు,మహేష్,సూరజ్,రాజు అజయ్,బాచి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం –

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

*ప్లాస్టిక్ భూతం నుండి పంచ భూతాలను కాపాడుకుందాం..

*చైర్మన్ సుగుణమ్మ..

*మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం –

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 05: 

 

పర్యావరణ పరిరక్షణ తోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదా శివం, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ దూదికుమారిలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు, మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలనీ అన్నారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూష‌న్ థీమ్ తో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవాణ్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, ఒక‌సారి వాడి ప‌డేసే ఫ్లాస్టిక్ కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్టిక్ పొల్యూష‌న్ త‌గ్గింపులో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించార‌ని ఆయ‌న తెలిపారు. ప్లాస్టిక్ విన‌యోగంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనందరం వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. పంచ భూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకనబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై నగరపాలక సంస్థ పరిధిలో 5090 మొక్కలు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 15 వేలు మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి బాలాజి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

తోపనపల్లిలో ఇంటి నిర్మాణ భూమి పూజ చేసిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో భాగంగా తోపనపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమంలో నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సంత ఇంటి నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో ఆనందంగా ఉందని తోపన పల్లి గ్రామంలో లబ్ధిదారులు సంతోషంతో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్,నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, మహిపాల్ రెడ్డి, కొత్తపల్లి రత్నం, బర్రె సూరయ్య, చంద్రహాసన్, రమేష్, చాగంటి నారాయణ, కక్కర్ల రాజు, ఇంద్రసేనారెడ్డి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

గీత కార్మికుడు మృతి.

గీత కార్మికుడు మృతి.

నాగర్ కర్నూల్/ నేటిదాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో సిర్సవాడ గ్రామంలో తాడిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మల్లేష్ (40) మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం తాటి కల్లు దింపడానికి పైకి వెళ్లి కళ్ళు దింపే ప్రయత్నంలో.. మొకు తాడు తెగి.. భూమిపైకి జారిపడి అక్కడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి

చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి దళిత గిరిజన మత్స్య సహకార సొసైటీలు ఏర్పరచాలి

తాళిపేరు డ్యామ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాలిపేరు డ్యాం అభివృద్ధికి నిధులు కేటాయించాలి
సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ప్రత్యేక చొరవ చూపాలి

నేటిధాత్రి చర్ల :

 

చర్ల మండల కేంద్రంలోని 60 చెరువులను మినీ తాలిపేరు డామ్ గా తీర్చిదిద్దాలి గేట్లను అమర్చాలి చేపల సాగుకు మరియు వ్యవసాయ రైతుల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు అదేవిధంగా దళిత గిరిజన మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసి చేప పిల్లలను పంపిణీ చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలి బయట ప్రాంతం నుండి వచ్చే చేపల వ్యాపారస్తులను అడ్డుకోవాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తాలుపెరు డ్యామ్ ను మరియు చెరువులను సందర్శించాలి సమగ్ర ప్రణాళికతో చర్ల మండల కేంద్రంలో సాగునీటి కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్ల మండల ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని స్థానిక దళిత గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజల ఆకాంక్ష అన్నారు అదేవిధంగా తాలిపేరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో బాగుచేయాలని హైడ్రాలిక్ గేట్లను అమర్చాలని తాళి పేరు లోపల భాగంలో సిల్ట్ ను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యం పెంపొందించి చేపల సాగుకు అనుకూలంగా మరియు రైతులకు సాగునీటిని అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని ప్రతి చెరువుకు నీటిని పంపిణీ చేయాలి ని ఎండాకాలంలో కూడా పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాలి చెరువులను సుందరీకరంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు

బాలీవుడ్‌లో మళ్లీ రష్మిక

బాలీవుడ్‌లో మళ్లీ రష్మిక

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం…. 

 

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం ఇటీవల ఫ్లాప్‌ అయినా ఆ ప్రభావం ఆమె మీద లేదనే చెప్పాలి. హిందీలో ఆమెకు ఆఫర్లు వస్తునే ఉన్నాయి. ఇంతవరకూ రష్మిక ఐదు హిందీ చిత్రాల్లో నటించారు. వాటిల్లో ‘యానిమల్‌’, ‘చావా’ చిత్రాలు పెద్ద హిట్‌ . మిగిలిన మూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా ఇప్పుడు మరో హిందీ సినిమాకు రష్మిక కమిట్‌ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో వచ్చిన ‘కాక్‌టైల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కాక్‌టైల్‌ 2’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సరసన రష్మిక నటించనున్నారు. క్రితీ సనన్‌ మరో కీలక పాత్ర పోషించనున్నారు. యూర్‌పలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే మనదేశంలో కూడా విభిన్న ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తారట. వచ్చే ఏడాది ‘కాక్‌టైల్‌ 2’ చిత్రం విడుదలవుతుంది.

 

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌..

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌.. అదిరిపోయే హిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 

 

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేసింది.

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ (Jaat ). తెలుగు అగ్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించడం విశేషం. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌న్నీ డియోల్ (Sunny Deol) హీరోగా మ‌రో స్టార్ ర‌ణ‌దీప్ హుడా (Randeep Hooda) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. రెజీనా (Regina Cassandra), స‌యామి ఖేర్ (Saiyami Kher), వినీత్ ఉమార్ సింగ్ (Vineet Kumar Singh), జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్మ‌కృష్ణ‌, బిగ్‌బాస్ దివి ఇత‌ర‌ పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఇప్పుడీ సినిమా ముందుగా అనుకున్న టైం క‌న్నా ఓ రోజు ముందుగాను ఈ రోజు గురువారం (జూన్ 6) నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రణతుంగ , అతని సోదరుడు శ్రీలంక నుంచి భారీ నిధిని దోచుకుని పారిపోయి ఇండియాకు వ‌చ్చేస్తారు. ఆపై ఏపీలోని మోటుప‌ల్లిని స్థావ‌రంగా చేసుకుని దాని ప‌రిస‌ర గ్రామాల‌ను త‌మ ఆదీనంలో ఉంచుకుని నియంత‌లా వ్య‌వ‌రిహిస్తుంటాడు. అయితే ఓ రోజు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ వెళ్తున్న రైలు ఆ ఊరి స‌మీపంలో ఆగిపోతుంది. దీంతో ద‌గ్గ‌ర్లో ఉన్న హోట‌ల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తుండ‌గా లోక‌ల్ రౌడీలు హోట‌ల్ పై దౌర్జ‌న్యం చేస్తూ హీరోను డిస్ట్ర‌బ్ చేస్తారు. దీంతో కోపొద్రిక్తుడైన బ్రిగేడియర్ వారి ప‌ని ప‌డ‌తాడు. ఆపై అనుకోకుండా ఒక‌రి త‌ర్వాత మ‌రొక గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వ‌డం వారంద‌రిని చిత‌క్కొట్టుకుంటూ చివ‌ర‌కు ప్ర‌దాన విల‌న్ రణ‌తుంగ వ‌ర‌కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరి అకృత్యాల గురించి హీరోకు తెలియ‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఇంత‌కు ఆ ఊర్లో ఉన్న స‌మ‌స్య‌ ఏంటి, హీరో ఆ క్రూర‌మైన విల‌న్ల‌ను ఒంట‌రిగా ఎలా ఎదిరించాడ‌నేదే ఈ మూవీ.

ఇప్ప‌టికే తెలుగులో వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చిన సినిమాల త‌ర‌హాలోనే ఈ సినిమా సాగుతుంది. అయితే స్క్రీన్ ప్లే , ఎలివేష‌న్లు, ట్రీల్‌మెంట్ అంతా ఓ రేంజ్‌లో ఉంటూ సూప‌ర్ హై ఇస్తుంది. మ‌నం పాత క‌థే చూస్తున్నాం అని తెలిసినా సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. పైగా ఇది హిందీ సినిమా అయిన‌ప్ప‌టికీ పూర్తిగా తెలుగు ప్రాంతం నేప‌థ్యంలో, ఇక్క‌డి న‌టులే క‌నిపిస్తూ మ‌నం ఓ బాలీవుడ్ సినిమా చూస్తున్నామ‌నే ఫీల్ కూడా రాదు. ప్ర‌స్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో హిందీ, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డ‌బ్బింగ్ కూడా స్ట్రెయిట్ సినిమాలానే ఉంది. థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు, యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఈ మూవీని మిస్ చేయ‌వ‌ద్దు. ముఖ్యంగా హీరో, విల‌న్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

 

పర్యావరణంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ట్రాన్స్పోర్టేషన్ అడవుల నరికివేతపై ద్రుష్టి సారించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ సరిగా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు స్పెషల్ పి.పి విష్ణువర్ధన్ రావు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ జి. ప్రియాంక న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్ సంగేమ్ రవీందర్ రజినీకాంత్ భూపాలపల్లి ఎస్సై రమేష్ కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి .

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..

సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శిలు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి :

 

దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేష న్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన ప్రభుత్వం అసమానతల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను అతి కిరాతకంగా ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే అందుకే మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. 2026 లో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టు లను అంతం చేయాలనే దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి కల్పించిందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనిషిని మనిషి చంపుకోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య కన్నూరి దానియల్ నేరెళ్ల జోసెఫ్ మాతంగి రామచందర్,శేఖర్, పొన్నగంటి లావణ్య,గోమాత,శ్రావణి,స్వరూప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

#మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు.

#నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత విత్తనాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే దళారులు ఇష్ట రీతిన నిషేధిత విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిషేధిత బీ టీ 3 విత్తనాలు వేయడం వల్ల రైతులు అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన చేయకపోవడంలో విఫలమైనరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు మారుమూల గ్రామాలలో విత్తనాలను డంపింగ్ చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 చొప్పున విక్రయిస్తూ ఎకరాకు 2 ప్యాకెట్లకు గాని 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. అలాగే విడి విత్తనాలను కేజీకి 3500 ల చొప్పున రైతులకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

#కూలీల కలుపు ఖర్చు మిగులుతుందని.

 

cotton

బీటీ 3 పత్తి విత్తనాలతో ఆరోగ్యానికి హానికరం, భూమిలో భూసారం క్షీణించి పోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీటీ-3 విత్తనాల అమ్మకాలు నిషేధించింది. కానీ బీటీ-3 విత్తనాలు మొలకెత్తిన తర్వాత కలుపు నివారణకై గడ్డి మందు పిచికారి చేసిన కూడా పంటకు ఎలాంటి నష్టం జరగదని దళారులు చెప్పడంతో రైతులు ఆ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని పంట దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదని రైతులకు దళారులు నచ్చజెప్పడంతో మండలంలో అధిక మొత్తంలో బిటి-3 విత్తనాలు రైతులు విక్రయిస్తున్నారు. బీటీ -2 విత్తనాలపై గడ్డి మందు (గ్లైబో సెట్) పిచికార్ చేస్తే పత్తి పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులకు దళారులు అవగాహన చేస్తూ నిషేధిత విత్తనాల వైపు రైతులను మళ్లిస్తూ అదేవిధంగా నిషేధిత గడ్డి మందు (గ్లైబోసేట్) ల సైతం గ్రామాలలో డంపు చేసి రైతులకు విక్రయిస్తూ దళారులు లక్షల సైతం దండుకుంటున్నారు.

#తనిఖీలు చేపట్టని వ్యవసాయ అధికారులు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ మండలంలో బీటీ-3 విత్తనాలు విక్రయాలు జరుగుతున్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న సంబంధిత వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాలలో తనిఖీలు చేపట్టి బీటీ-3 విత్తనాల విక్రయాలను అడ్డుకట్ట వేసి నిషేధిత విత్తనాల వల్ల జరిగే అనర్థాలను రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. Some heroes liked the story and made films without taking any remuneration.. but suffered losses after the film was released.

సినిమా టికెట్లు
  • అదే బాటలో సిద్ధు జొన్నలగడ్డ

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. కథ నచ్చి, పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన హీరోలు కొందరైతే.. చిత్రం విడుదలయ్యాక నష్టాలొస్తే తాము తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చిన వారు మరికొందరు. అయితే చిత్రసీమలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఏ.ఎమ్‌.రత్నమ్‌ నిర్మాత. క్రిష్‌ దర్శకత్వంలో 2020లో మొదలైన ఈ చిత్రం పలు కారణాలతో సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. ఇంతకాలం ఈ సినిమా సెట్స్‌ పైనే ఉన్నందుకు నిర్మాతపై పడ్డ అదనపు భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారని నిరూపించుకున్నారు. మరో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘జాక్‌’ ఏప్రిల్‌ 10న విడుదలైంది. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో పారితోషికంగా తాను తీసుకున్న మొత్తంలో సగం(రూ. నాలుగు కోట్లు) తిరిగిచ్చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.

 

Pawan kalyan

షూటింగ్‌కు సిద్ధం

పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల రెండో వారం నుంచి మొదలవుతోందని మంగళవారం తిరుమలలో వెల్లడించారు ఆయన. త్వరలోనే పవన్‌కల్యాణ్‌ కూడా సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలిపారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి .

కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాలువ, కేశవ నగర్ లో 25 లక్షలతో సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్ పనులు,బాల్ రాం నగర్ లో సీసీ రోడ్, 8వ వార్డు సుభాష్ నగర్ లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయం వద్ద వన మహోత్సవం సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుర్తి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో చేతివృత్తుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి,కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ కమీషనర్ మహ్మద్ షేక్, వాస శేఖర్, మాజీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌…

 

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌. ‘‘వేదం’కు 15 ఏళ్లు. నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిది. ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్‌కు రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీగా సినిమా తీశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌, అనుష్క వంటి సహనటులతో ప్రయాణించడం ఓ గొప్ప జ్ఞాపకం. ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్‌ దేవినేనిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

ముందు అనుకున్న సినిమా వేరు

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఓ సందర్భంలో పంచుకున్నారు క్రిష్‌. ‘‘గమ్యం’ తరువాత ఓ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రానికి ప్లాన్‌ చేశాను. అయితే ఆ సమయంలో అమరావతికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ‘వేదం’ కథ సిద్ధం చేసేలా చేసింది. ఓ చిన్న పిల్లాడు వృద్ధుడిని వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం నన్ను కదిలించింది. ‘ఒక చిన్న పిల్లాడు వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముతుంది’ ఇలాంటి ఓ లైన్‌తో మొదలైంది ‘వేదం’ కథ. అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క భాగం కావడంతో ఈ సినిమా పెద్ద సినిమాలా మారింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌గా చేసి పంజాగుట్ట సర్కిల్‌లో పెట్టారు. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించారు. అంతలా అనుష్క ఆకట్టుకున్నారు’’ అని అన్నారు దర్శకుడు క్రిష్‌.

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

 

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య (Suriya) న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి (Venky Atluri) ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌మితా బైజు (Mamitha Baiju) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాలా గ్యాప్ త‌ర్వాత‌ ర‌వీనా టాండ‌న్ (Raveena Tandon) తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండ‌గా రాధిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ (Sitara entertainments) నిర్మిస్తోంది. జీవీ ప్ర‌కాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఆ మ‌ధ్య పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ఆరంభించిన మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.

 

Suriya46

అయితే.. హీరో సూర్య‌తో పాటు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి (Venky Atluri), నిర్మాత నాగ‌వంశీ (Naga Vamsi) లు గురువారం త‌మిళ‌నాడులోని పళణి మురుగ‌న్‌ సుబ్ర‌మ‌ణ్య స్వామి (Palani Murugan Temple) ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. జూన్ 9 నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

 

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ

Raviteja

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ (Ravi Teja). గ‌త సంవ‌త్స‌రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (Mr. Bachchan) చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన ఆయ‌న త్వ‌ర‌లో ప్ర‌స్తుతం మాస్ (Mass Jathara) జాత‌ర సినిమాతో అరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమా ఆగ‌ష్టులో థియేట‌ర్ల‌కు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత ఇప్ప‌టికే చేతిలో మ‌రో మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ న‌టించ‌బోయే మ‌రో కొత్త సినిమా RT76 నుంచి తాజాగా అప్డేట్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

గ‌తంలో రామ్‌తో నేను శైల‌జా, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాల‌ను రూపొందించిన కిషోర్ తిరుమ‌ల (KishoreTirumala) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఆ పోస్ట‌ర్‌లో బిజినెస్ క్లాస్‌ విమానంలో ర‌వితేజ (Ravi Teja) ద‌ర్జాగా కూర్చోని ఎదుట సీటుపై కాలు వేసి కూర్చోని ఉన్న లుక్ అదిరిపోయేలా ఉంది.

 

కాగా ఈ సినిమాకు అనార్క‌లి (Anarkali) అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉండ‌గా నాగార్జున నా సామిరంగా మూవీ ఫేమ్ క‌న్న‌డ బ్యూటీ అషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) సింగిల్ బ్యూటీ కేతిక శ‌ర్మ‌ క‌థానాయిక‌లు. గురువారం షూటింగ్ ప్రారంభించిన మేక‌ర్స్ 2026 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా అదే సంక్రాంతికి చిరంజీవి అనీల్ రావిపూడి చిత్రం విజ‌య్ జ‌న నాయ‌గ‌న్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఓ రాజు, య‌ష్ టాక్సిక్ సినిమాల విడుద‌ల కానుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల విష‌యంలో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version