డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకున్న కెటిపిపి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకున్న కెటిపిపి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ బహుజన సాహిత్య అకాడమి -నేషనల్ అవార్డు 2026 సంవత్సరమునకు గాను
ప్రముఖ సంఘ సేవకులు కెటిపిపి ఉద్యోగులకు కార్మికులకు అర్టీజన్ కార్మికులకు ఉద్యోగరిత్యా సమస్యలపై ‌సానుకూల అవగాహన కల్పించి పరిష్కారం కోసం ప్రయత్నం చేసే సూపరింటెండింగ్ ఇంజినీర్ జువ్విగుంట రామకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఏప్రిల్ 19వ తేదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య ఆకాడమి 9వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ. ఎస్.సి., ఎస్.టి., బి.సి. & మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి సుమారుగా 300 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి హాజరైనారని తెలియజేశారు.అవార్డు అందజేసిన వారితో పాటుగ ఉన్నవారు తెలంగాణ ఉద్యమకారులు రచయిత గాయకులు గిద్దె రాంనర్సయ్య, కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

విద్యా సదస్సును విజయవంతం చేయండి

విద్యా సదస్సును విజయవంతం చేయండి

TPTFజమ్మికుంట అధ్యక్షులు కొండపాక తిరుపతి
జమ్మికుంట (నేటిధాత్రి )

 

టిపిటిఎఫ్ (TPTF) తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని జమ్మికుంట TPTF అధ్యక్షులు శ్రీ తిరుపతి గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండల కేద్రములో కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సదస్సు 2026 ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
“సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టిపిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు.
ఈ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం పై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణలో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండపాక తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్ జమ్మికుంట మండల జనరల్ సెక్రటరీ పాక కుమారస్వామి,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి..

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సందర్భంగా కామ్రేడ్ సిపి రెడ్డి రాసిన ఏరిన రచనలు అనే
పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.రాజేందర్ మాట్లాడుతూ
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చేసిన కృషి గొప్పదని,దేశ చరిత్రలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటంలో చెరగని ముద్రవేశారని అన్నారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఐఎఫ్టియు నర్సంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్,గొర్రె ప్రదీప్, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు అశోక్,పివైఎల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భోగి సారంగపాణి, నాయకులు కొంపెల్లి సాంబన్న,భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version