కొత్తగూడ ఏకలవ్య గురుకుల పాఠశాల ఎదుట డి ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ధర్నా..

కొత్తగూడ ఏకలవ్య గురుకుల పాఠశాల ఎదుట డి ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో ధర్నా…….!!

కొత్తగూడ, నేటిధాత్రి:

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకూడా కారంతో భోజనం పెట్టడం పట్ల ఆగ్రహించిన డి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్…సమస్యలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో గేట్ ఎదుట ధర్నా….ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకులాల పట్ల నిర్లక్యం వహిస్తున్న ఆర్ సి ఓ పై చర్యలు తీసుకోవాలి — సంబంధిత వార్డెన్ ప్రిన్సిపాల్ లను సస్పెండ్ చేయాలి….
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గత నాలుగు రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్న విద్యార్థుల గోడని తెలుసుకుందామని ఏకలవ్య గురుకుల పాఠశాలకి వెళ్తే అనుమతించకోవడంతో గెట్ ఎదుట DSFI అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు……ఈ సందర్భంగా DSFI రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచిన అప్పటినుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారం తో భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని, ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటంవల్ల పిల్లలు బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు…..మొన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడంతో డిఎస్ఎఫ్ఐ నేతలు అగ్రహించారు…చివరికి నిన్న పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్లు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి, ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని తెలిపారు….ఇది ఇలా ఉండగా ఏకలవ్య స్కూలు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడం తో విద్యార్థులు చదువులు అప్పటికంటే ఇప్పుడే చాలా వెనుకబడి ఉన్నారని, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, డిఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు…ఉదయం 8 గంటలకు వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్న ఒంటిగంట వరకే ఉండి ప్రభుత్వం వాల్లకు కల్పించిన క్వార్టర్స్ లోకి వెళ్లిపోయి మళ్లీ పిల్లల ముఖం చూడటం లేదు ధ్వజమెత్తారు..అసలు పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారని కూడా పట్టించుకోవడంలేదని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఏకలవ్య స్కూలుకు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి RCO పై,పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో DSFI మండల నేతలు శేఖర్,నవీన్, సురేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

అస్వస్థతకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నాణ్యత లేని కూరగాయలు, ఫుడ్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.

:- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం లో పురుగుల అన్నం తిని వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పితో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారు.
కస్తూర్భా గాంధీ కళాశాలలో కలుషితమైన ఆహారం తిని 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి విద్యార్థుల పరిస్థితి విషమించటంతో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికీ చికిత్స అందించడం జరిగింది.
నేను గత శుక్రవారం రోజున ఇదే కస్తూర్భా స్కూల్ సందర్శించడం జరిగింది.
ఆ రోజు కుళ్ళిపోయిన కూరగాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్లకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి కూడా ఫుడ్ పెట్టడం లేదు, పప్పు ఒక చెంచా,ఉల్లిగడ్డ పులుసు చేసి పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కూర తక్కువ కలుపుకుని తింటా ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్లకు క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది.ఆ రోజు మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈ ఈ స్కూల్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడకు రావడం జరిగింది, వారికీ కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా విద్యార్థులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను తెలుసుకొని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యావ్యవస్థ సక్రమంగా నడిచేలా మీరు స్పెషలాఫీసర్ దృష్టి పెట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్నోక్కటే రోజు మూడు స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు. మొన్నటి రోజున విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి తమ సమస్యలు చెప్పుకునే స్థితిని చూస్తే మరి ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉన్నది.

మేము కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు కార్యక్రమాన్ని మేము చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారు. నేను రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు.

ఈ రోజు విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని, ఈరోజు మీకు అర్థమైంది.

కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణి లో ఉన్నాయి. మరీ జిల్లా జనరల్ అసుపత్రిలోని కింది స్టాప్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయం తోటి నియమించబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కో ఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తి కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నట్టువంటి పరిణామాలను మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలని, ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము, మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అని భయపడుతున్నారు.
కాబట్టి మీరే పిల్లలు నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలియజేస్తూ.
ఇప్పటికైనా స్పెషల్ కమిటీ నియమించి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాలపై దృష్టి పెట్టాలనికోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version