స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్
హన్మకొండ, నేటిధాత్రి:
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా 13 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్వేరో సంస్థకు గత పది సంవత్సరాల నుండి పనిచేస్తూ స్వేరో ఉద్యమానికి నికార్సైన స్వేరో నాయకుడిగా వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో కష్టనష్టాలను ఎదుర్కొని చివరి వరకు నిలబడాలనే ఆకాంక్షకు అనుగుణంగా తన పనితనాన్ని గుర్తించి హనుమకొండ జిల్లా పరకాల మండలం మాదారం కీ చెందిన యువనాయకుడు మంద మనోజ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార మల్ల ప్రకాష్ కో కన్వీనర్ పుల్ల కిషన్ ల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనీ ప్రకటించడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షుడు మంద మనోజ్ మాట్లాడుతూ స్వేరోస్ సంఘాన్ని మా జిల్లాలో ఉన్న 14 మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా వెలికి తీసి వారికి స్వేరోస్ తరఫున అండగా నిలబడి అధికారుల ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అన్ని గ్రామాలలో స్వేరోస్ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
