బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా, నేటిధాత్రి:
వెంకటాపూర్ మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గంప సుమలత ఇల్లు షార్ట్ షర్కూట్ వల్ల కాలిపోగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క వారి కుటుంబానికి దైర్యం చెప్పారు
పూర్తిగా ఇల్లు దగ్ధం కావడంతో వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి వారి కుటుంబానికి బియ్యం, దుప్పట్లు,దుస్తులు అందించ ఆర్థిక సాయం చేశారు
మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
