మహా రుద్రయాగంలో పాల్గొన్న గంటా కళావతి దంపతులు
పరకాల,నేటిధాత్రి
సోమవారం రోజు పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో కార్తీకమాస మహా రుద్రయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ మహోత్తర కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ మహా యాగంలో పాల్గొనడం ఆ శివుడి కృపను పొందండం మా జన్మ ధన్యమేనని అన్నారు.ఈ మహా యాగన్ని ఏర్పాటు చేసిన ఆలయకమిటీకి మరియు రుద్రయాగా సమితికి ధన్యవాదాలు తెలిపారు.
