ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం.

ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ బిల్డింగ్ లోనీ కో ఆఫ్ రేటివ్ కార్యాలయం లో కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాస్ మరియు జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందడం సహజమే కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ చేసిన సేవలు సిరస్కలం గుర్తుండి పోత యనారు మరియు వారి శేష జీవితాన్ని సంతోషంగా ఆయుర ఆరోగ్య లతో గడపాలని కోరారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ రిజిస్టర్లు పోమ్ సింగ్ ఇందిరా రామకృష్ణ సీనియర్ ఇన్స్ పెక్టర్ లు శివ లింగ వర ప్రసాద్ నిర్మలా నవీన్ కుమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి షేక్ నిసార్ అహ్మద్ సొసైటీ కార్యదర్శులు శ్రీనివాస్ విజయ్ కుమార్ రాములు సిరాజ్ మధుసూదన్ రెడ్డి సహకార శాఖ అధికారులు తదితరులు పాల్గొని కె. శ్రీనివాస్ రావు గారికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి….

ఏఎస్ఐ సర్వేశ్వరరావు సేవలు మరువలేనివి.

ఎస్ఐ రాజ్ కుమార్

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి ఇనుగుర్తి కి బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ
అతి తక్కువ సమయంలో ఎనలేని సేవలు అందించారు…పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు అతితక్కువ కాలంలోనే తమదైన శైలిలో సేవలు అందించారుని ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. డిపార్ట్ మెంట్ లో బదిలీలలో భాగంగా కొత్తగూడ పిఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సర్వేశ్వరరావు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆయనను సత్కరించి తను చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు.అందించిన సేవలు, నేర్పించిన పాఠాలు, మరియు పంచుకున్న ఆనందాలను తలుచుకుంటూ, వారికి కృతజ్ఞతలు.
వారితో ప్రయాణం ప్రారంభమైనప్పుడు, వారు ఎంతో ఉత్సాహంతో, నూతన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లారు… మేము వారితో కలిసి పనిచేసినప్పుడు, వారు మాకు ఎన్నో మంచి విషయాలను నేర్పించారు. వారిలోని సహనశీలత, నిబద్ధత, మరియు ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేము వారితో పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, నవ్వులను ఎప్పటికీ మర్చిపోలేముని
భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించాలని, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని
మరోసారి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మమ్మల్ని కొత్తగూడ మండల ప్రజలు గుర్తుంచుకుంటారు అని ఆశిస్తున్నాము. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి ని . సందర్భంగా ఎస్సై రాజ్ కుమార్ సిబ్బంది శాలువా తో సన్మానించారు

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version