రైతు భరోసా పథకంకు అర్హులైన వారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

shine junior college

ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
దాంక రమేష్ ,రోడ్డ రమేష్
క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

shine junior college

మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం

మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి

 

 

shine junior college

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

 

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్‌ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజులలో పరిష్కారం చూపాలని, తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 53 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు

సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )

shine junior college

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.

నెలకే తేలిన నాణ్యత.

నెలకే తేలిన నాణ్యత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తారు వేసిన నెల రోజులకే దారి గుంతలమయంగా మారింది. రాయికోడ్ నుంచి కప్పాడ్ వరకు ఆర్అండ్బై ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేశారు. చాలా చోట్ల తారు లేచి.. కంకర తేలుతోంది. వర్షా నికి సైడ్ బర్న్స్ కోతకు గురవుతున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చొరవచూపి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదా రులు కోరుతున్నారు.

మహాత్ములు లోక కల్యాణం కోసం పుడతారు.

మహాత్ములు లోక కల్యాణం కోసం పుడతారు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

shine junior college

 

మహాత్ములు లోక కల్యాణం కోసమే పుడతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం భూత్పూర్ రోడ్ లోని వాసవి కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

MLA Yenna Srinivas Reddy

 

 

పట్టణంలోని ప్రజలు పీఠాధిపతులను దర్శించుకొని వారు ఇచ్చే సందేశాలను వారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జె.పి.ఎన్ సి.చైర్మన్ కె.యస్. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,రమేష్

కరీంనగర్ నేటిధాత్రి:

 

shine junior college

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు కృషి చేయలేదు.మరోపక్క విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఏఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది.కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం

ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి

హనుమకొండ, నేటిధాత్రి:

 

shine junior college

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు పూజ కార్యక్రమం చేసి,పనులను ప్రారంభించారు.నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని.ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి,ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని,ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారుగానీ, అమలు చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన సంక్షేమ పాలన అమలవుతోంది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాల అమలుకు ముందుకు సాగుతోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన, పక్కా ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి ఇళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.53 వ డివిజన్ పేదలు అధికంగా ఉన్నారని కేటించిన వాటికంటే అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ,రహీమున్నీసా నాయకులు ఎర్ర మహేందర్,మట్టెడ అనిల్ కుమార్,శ్యామ్,రేణికుంట ప్రవీణ్,సత్తార్,కాసిం,ఎర్ర చందు ,రజిత్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీనం చేసుకోవాలి.

సర్వే నెంబర్ 574 ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీనం చేసుకోవాలి.
సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

 

shine junior college

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నెంబర్లో గల పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటల ప్రభుత్వ భూమిని భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడంతో పాటు సర్వే నెంబర్ కు హద్దులు నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలో 574 సర్వే నెంబర్ లోని పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటల ప్రభుత్వ భూమి ఉందని ఇది కొన్ని సంవత్సరాలుగా జ్యోతిష్మతి కళాశాల యజమాన్యం ఆక్రమించి భవనాలు నిర్మించిందని దీనిపై ఇప్పటికి ఎవరు చర్యలు తీసుకోక పో వడంతో కళాశాల యజమాన్యం ప్రభుత్వ భూమిలో ఏదేచ్ఛగా భవనాలు నిర్మించి తరగతులు నిర్వహిస్తుందన్నారు. కరీంనగర్ హైదరాబాద్ నేషనల్ హైవే కు సమీపంలో ఉన్న సుమారు నూటయాభై కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈయొక్క సర్వే నంబర్లు కొలతలు వేసి స్వాధీన పరుచుకోవాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలతో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఐ నగర సహాయ కార్యదర్శిలు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, ఉపాధ్యక్షులు కలుకం సాగర్, తదితరులు అందజేశారు.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం

దళితులకు దళిత బందు 12 లక్షల రూపాయలు ఇవ్వాలి

బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

 

 

shine junior college

 

బిసిలను మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు బిసిలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల బిసిలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్…

సిఎండి బలరాం నాయక్ ను కలిసిన జర్నలిస్టులు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

shine junior college

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన మందమర్రి రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అనిల్ భగత్ ఉపాధ్యక్షుడు అక్బర్ లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వేదికగా సిఎండి బలరాం నాయక్ ను కలిసి సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలని కోరారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని, మునీర్ విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కోల్ బెల్ట్ లో మునీర్ అబిమానులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ భగత్ అక్బర్ లు తెలిపారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన మునీర్ మృతి నల్ల నేలకు తీరని లోటు అని సింగరేణి చరిత్రలో మునీర్ ప్రజల హృదయాలో సజీవంగా ఉంటారని, సీనియర్ పాత్రికేయులు మునీర్ జర్నలిస్టులకు ఆదర్శం అని బలరాం నాయక్ అన్నారు. ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ తదితరులు ఉన్నారు.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా

 

పరకాల నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

పరకాల పట్టణంలోని 14 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు భూమిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ సోద అనితా రామకృష్ణ కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి,మాజీ మైనారిటి సెల్ అధ్యక్షులు ఎండీ అలీ హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సబ్యులు కొక్కిరాల స్వాతి,ఎండీ అమీనా,ఆకుల అశోక్,ఎండీ షఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి

 

 

Shine Junior Colleges

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామం లో నిర్మాణంలో వున్న శివ పంచాయతన ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీ&శ్రీమతి పాశికంటి రాజేందర్ వనమాల దంపతులు రూ.200116 అక్షరాల రెండు లక్షలు విరాళం గా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గుడి చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం,చెక్క నర్సయ్య, మందల రాఘవరెడ్డి మరియు గ్రామ ప్రజలు అమరేందర్ రెడ్డి,ఓదెలు, కత్తెరసాల రాజయ్య,సాంబయ్య,అనగాని రాజయ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం
ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

Shine Junior Colleges

 

 

చిట్యాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు బుధవారం 18వ తేదీన చిట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కన్వీనర్ కొడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలు) చిట్యాల మండలంలో ఉన్న బాల బాలికలు క్రీడా పాఠశాలలో 4వ తరగతి అడ్మిషన్ కొరకు 1 – 9 – 2016 నుండి 31 – 08 – 2017 మధ్యలో జన్మించిన బాల బాలికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలలో అడ్మిషన్ కొరకు చిట్యాల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని తెలపడం జరిగింది ఇది క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ క్రీడా పాఠశాలల అడ్మిషన్ల ఎంపికలో షటిల్ రన్, మెడిసిన్ బాల్, వర్టికల్ జంప్, 800 మీటర్ల పరుగు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎత్తు మరియు బరువు విభాగాలలో పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తామని ఈ మండల స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల కోఆర్డినేటర్ సూదం సాంబమూర్తి ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్లు తీసుక రావాలి వివరాల కొరకు 9966992295 నెంబర్ లో సంప్రదించాలన్నారు

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పరకాల నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొచ్చు అనూష దశ్వంత్ రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన కొనసాగించినదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు l మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు, మడికొండ లలిత,బొచ్చు అనిల్,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,ఏం డి,హాజీ చుక్క శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి…

మంగపేట నేటిధాత్రి:

 

Shine Junior Colleges

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారులందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణానికి ముప్పుగా మారుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం కావున ప్రజల విధిగా హెల్మెట్ ధరించి వాహన చట్టాలను గౌరవిస్తూ ప్రయాణం సాగించాలని మంగపేట పోలీస్ విజ్ఞప్తి చేశారు.
మంగపేట పోలీస్ పరిధిలో జరిగిన లోకధారథలో 70 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పైన్ మరియు పదిమందికి మూడు రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది అని కావున అందరూ హెల్మెట్ ధరించకుండా , ఆల్కహాల్ తాగి వాహనాలు నడపరాదని వాహన దారులకు పోలీసులు వారు విజ్ఞప్తి చేశారు.

బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి

ఇస్లావత్ దేవన్ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

 

మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో 8 ఇంక్లైన్ రోడ్ లో నూతనంగా చేపట్టనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఐ ఎన్ టి యు సి. నాయకులు మహిళా కాంగ్రెస్ ఆయా విభాగాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version