ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం

ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి

హనుమకొండ, నేటిధాత్రి:

 

shine junior college

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు పూజ కార్యక్రమం చేసి,పనులను ప్రారంభించారు.నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని.ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి,ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని,ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారుగానీ, అమలు చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన సంక్షేమ పాలన అమలవుతోంది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాల అమలుకు ముందుకు సాగుతోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన, పక్కా ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి ఇళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.53 వ డివిజన్ పేదలు అధికంగా ఉన్నారని కేటించిన వాటికంటే అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ,రహీమున్నీసా నాయకులు ఎర్ర మహేందర్,మట్టెడ అనిల్ కుమార్,శ్యామ్,రేణికుంట ప్రవీణ్,సత్తార్,కాసిం,ఎర్ర చందు ,రజిత్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version