రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అంజిరెడ్డి చేయూత

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T171702.643.wav?_=1

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అంజిరెడ్డి చేయూత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సమీపంలో పస్తాపూర్ వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అండగా నిలిచారు. ఆయన వెంటనే స్పందించి, ఆ యువకుడిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సహాయక చర్యకు పలువురు ఆయనను అభినందించారు.

నూతన ఎస్సై ని కలిసిన షేక్ సోహెల్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T125656.388.wav?_=2

నూతన ఎస్సై ని కలిసిన షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ నూతన టౌన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ ను సోమవారం తుమ్మనపల్లి గ్రామ షేక్ సోహెల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి,ఈ సందర్భంగా ఎస్ ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ. పట్టణంలో శాంతి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సన్మానించిన షేక్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్ గారిని కలిసిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-4.wav?_=3

మంత్రి వివేక్ గారిని కలిసిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి గారిని పెండింగ్ లో ఉన్న మరియు పలు నూతన అభివృద్ధి పనులకోసం కలిసి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎ చంద్ర శేఖర్, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రామలింగారెడ్డి,ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, న్యాల్కల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ సంగ్రామం పాటిల్, రాజు స్వామి, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ తధితరులు కలిసి మంత్రి గారితో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులు తక్షణమే మొధలు పెట్టి పూర్తి చెయ్యాల్సిందిగా మరియు నియోజకవర్గం లో గల వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు కావాలని అడగడం జరిగింది మరియు వివిధ నూతనా అభివృద్ది పనులు అడిగారు అందుకు ఇంచార్జి మంత్రి సానుకులంగా స్పందించి త్వరలోనే పూర్తి చేయించేద్దమన్నారు.

రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T173140.229.wav?_=4

రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు భీమా పథకం 2025 ఝరాసంగం మండల కేంద్రంలోని అన్ని రైతువేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బీమా దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఒక ప్రకటన తెలిపారు.

◆ 05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతు అర్హులు

◆ 18 నుండి 59 సంవత్స రాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్న వారు మాత్రమే అర్హులు.

◆సంబంధిత రైతే స్వయంగా వచ్చి రైతు వేదికలో దరఖాస్తు అందజేయాలి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎటువంటి దరఖాస్తు స్వీకరించబడదు.

◆ చివరి తేదీ – 12.08.2025

◆ జతచేయవలసిన పత్రాలు
◆ దరఖాస్తు ఫారం
◆ రైతు ఆధార్ కార్డు జిరాక్స్
◆ రైతు భూమి పాస్ పుస్తకం జిరాక్స్
◆ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్
సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులను ఇవ్వాలని సూచించడం జరిగింది..

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-3.wav?_=5

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి నివాసంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.సిద్దం ఉజ్వల్రెడ్డి వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మాణిక్ రావు.

 

నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జిల్లా పరిషద్ గర్ల్స్ హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థినులకు అర్బెండజోల్ మాత్రలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులి పురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు ఈ వ్యాధి వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన, వండిన మరియు కలుషితమైన ఆహారం , స్వీట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వంటి వివిధ కారణాలవల్ల పిల్లల్లో వార్మ్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని అన్నారు
అందుకే ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా ఈ నూలి పురుగుల నివారణ కొరకై ఈ టాబ్లెట్లను పిల్లలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు
అనంతరం నూలి పురుగుల నివారణకు టాబ్లెట్లను పిల్లలకు అందించారు ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ , గణేష్ ,దీపక్ ,చంద్రయ్య ,
డీఎం & హోం గాయత్రి దేవి ,వైద్య సిబ్బంది ,ఉపాధ్యాయులు , తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-2.wav?_=6

ఘనంగా ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

◆:- వేడుకల్లో సిడిసి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ గారి జన్మదిన వేడుకలు ఝరాసంగం మండల బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించి, శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి డి సి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్,బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ విజేందర్ రెడ్డి ఎజాజ్ బాబా నాగన్న పటేల్,సంజీవ్, నర్సిములు మాజీ సొసైటీ చైర్మన్ బస్వరాజ్,విలాస్ బల్ రాజ్ సంగమేష్, గౌసోద్దీన్,సంజ్జు, గాలప్ప సామెల్, సద్దాం రాహుప్,తదితరులు పాల్గొన్నారు.

రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-1.wav?_=7

రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం

◆:- రైతు బీమా – నమోదుకు 13.08.2025 చివరి తేదీ

◆:- మండల వ్యవసాయ అధికారి వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని రైతులు రైతు బీమా గురించి కేవలం 4 రోజులు సమయం ఉన్నది
05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్నవారు మాత్రమే అర్హులు.నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరోక్స్ కాపీలను తీసుకురావాలి
1. రైతు ఆధార్ కార్డు
2. భూమి పట్టా పాస్‌బుక్
3. నామినీ ఆధార్ కార్డు
4. రైతు బీమా Enrollment ఫామ్
రైతు తప్పక హాజరు కావలెను.

Agriculture Officer Venkatesham

(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.)
భూమి కలిగి ఇంకా రైతు బీమా నమోదు చేయని రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల రైతు వేదిక ఆఫీసర్ లో వద్ద అందుబాటులో ఉన్నాయి. దయచేసి సంప్రదించండి.

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

◆:- మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంటున్న రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ ఒక రైతుకు రెండు బస్తాల ఎరువు ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారు ఎరువుల కొరత లేదు అని చెప్పే అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కూడా ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్ స్టేషన్ లో టోకెన్ తీసుకొని చెప్పులు క్యూ లైన్లో పెట్టి చిమ్మ చీకటిలో పక్కన నిద్రపోయే వారు ఇప్పుడు మళ్ళీ అవే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-3.wav?_=8

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండండి…

సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T113150.883.wav?_=9

గారెడ్డి , సైబర్ జాగ్రుకత దివాస్ సందర్భంగా –జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..

•:- సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉందండండి..

•:- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..

సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికాగోయల్ ఐపిఎస్ ఆదేశాలనుసారం, జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సూచనల మేరకు ఈ రోజు తేది: 06.08.2025 ఆగస్టు నెల మొదటి బుధవారాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అన్నారు. సైబర్ సెల్ డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు

•:- వ్యాపారాలలో, పెట్టుబడి మోసాలు – పార్ట్ టైం జాబ్ స్కామ్స్..

•:- ఐడెంటిటీ థెఫ్ట్ – అక్రమ క్రెడిట్ కార్డ్ వాడకం..

•:- లోన్ మోసాలు – నకిలీ లోన్ యాప్స్ & ఆర్థిక ఉచ్చులు..

•:- ప్రకటన మోసాలు – ఆన్‌లైన్‌లో వస్తువులు / సేవలు అందకపోవడం..

•:- ఆన్‌లైన్ భద్రత చిట్కాలు – డిజిటల్ ప్రపంచంలో మీరే మీ రక్షకులు.. అనే అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దన్నారు. సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విధ్యావంతులే అధికం అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు. ఏ పోలీసు అధికారి ఎంక్వైరీ పేరుతో నేరుగా వాట్స్ ఆప్ వీడియో కాల్స్ చేయరాని, డిజిటల్ అరెస్ట్ అని కాల్స్ వస్తే నమ్మరాదని అన్నారు. అనుమానిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలని సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి అవకాశం ఉందని, సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.

సైబర్ జాగ్రుకత దివాస్ కార్యక్రమంలో ఆచార్య డిగ్రీ కళాశాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ మరియు రాత పరీక్ష నిర్వహించి, విజేతలుగా నిలిచిన కె. వెంకటేశ్, ఎం. నాగేశ్వరి నవ్యశ్రీ లకు ప్రశంసా పత్రాలు శీల్డులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, చిరాగపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరికుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి D4C, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగుల ఆందోళన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-2.wav?_=10

ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగుల ఆందోళన.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో, అత్యవసర రోగులకు ఈసీజీ తీయాల్సిన టెక్నీషియన్ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. ఆయన లేని రోజుల్లో ట్రైనింగ్ నర్సులు, పేషెంట్ కేర్ సిబ్బందితో ఈసీజీలు తీయిస్తున్నారని, దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T130153.632-1.wav?_=11

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు నాయకులతో కలిసి ఆసుపత్రి కి చేరుకుని , ప్రమాద వివరాలు కుటుంబ సభ్యులను ,గ్రామస్తులను అడిగి తెలుసుకునారు డాక్టర్ ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రి కి తరలించారు ,ఎమ్మెల్యే డాక్టర్ లతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు,త్వరగా కోలుకుంటారు అని అధైర్యపడొద్దు అని,అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు* ….
అనంతరం ఆసుపత్రి లో అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మరియు సిబ్బంది సూచించారు .ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్ ,నాయకులు నరేష్ రెడ్డి ,శంకర్,నవీన్ తదితరులు ఉన్నారు..

జహీరాబాద్:: పాలిటెక్నిక్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T123737.693.wav?_=12

జహీరాబాద్:: పాలిటెక్నిక్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ. కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత మంగళవారం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈనెల 5 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. మరిన్ని వివరాలకు 9704671915 నంబర్కు సంప్రదించాలని కోరారు.

యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T160041.770.wav?_=13

యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొన్నా

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా||ఎ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ నాయక్ పవార్ మరియు యంగ్ స్టార్ క్లబ్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ లో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసన్ని పెంపొదిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రీడాలకు ప్రధాన్యత ఇవ్వాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి,ఎ.యం.సి.డైరెక్టర్ వంశీ,కాంగ్రెస్ నాయకులు హుగ్గెలి.రాములు, ఖాజా మియా, మూర్జల్,శ్రీనివాస్
నాయక్,సోహైల్,అయూబ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

జహీరాబాద్ లో పోచమ్మ, బాలమ్మ విగ్రహ ప్రతిష్ట.

జహీరాబాద్ లో పోచమ్మ, బాలమ్మ విగ్రహ ప్రతిష్ట.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T113818.777.wav?_=14

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణం వెంకటరమణ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ, బాలమ్మ విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా వచ్చే నెల 1,2,3 తేదీలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీన స్వస్తి, పుణ్యావచన, నాంది, నవగ్రహ పూజతో పాటు పోచమ్మ, బాలమ్మ యంత్రం విగ్రహ ధాన్యాది వాసం, 2వ తేదీన బాలమ్మ, పోచమ్మ దేవతల పూజ, చండి హోమం, జలాధివాసం 3వ తేదిన సయ్యాది పుష్పవాసం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటాయని వివరించారు. ఉత్సవాల చివరి రోజు హౌసింగ్ బోర్డు కాలనీ, వెంకటరమణ కాలనీ లోని ప్రతి ఇంటినుండి బోనం సమర్పించాల్సిందిగా విజ్ఞాపించింది. ఈ బోనం సమర్పించే కార్యక్రమం హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభం అవుతుందని వివరించింది.

మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఝరాసంగం మండలం బర్దిపూర్ ఆశ్రమం పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి శ్రీ అవధూత గిరి మహారాజ్, న్యాల్కల్ మండలం ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ దేవగిరి మహారాజ్,మల్లన్న గట్టు ఆశ్రమం పీఠాధిపతి శ్రీ బసవలింగ అవధూత మహారాజ్, మొగుడంపల్లి మండలం ధనసిరి హీరేమట్ ఆశ్రమ 108 పీఠాధిపతి శ్రీ వీరేశ్వర్ శివాచర్య మహారాజ్, న్యాల్కల్ మండలం న్యామతబాద్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివానందగిరి మహారాజ్ ల సమక్షంలో జరుగుతాయని వివరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరడం జరిగింది.

ఆందోళనలో పట్టణ ప్రజలు.

శునకాల గుంపులు.. ఆందోళనలో పట్టణ ప్రజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు విలీన గ్రామాల ప్రజలు వీధి కుక్కల వల్ల తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డిఓ రామ్ రెడ్డి గారికి వారి కార్యాలయంలో కలిసి బి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు ,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నామ రవికిరణ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లపై వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర్య విహారం చేస్తున్నాయని, పట్టణంలోని పలు ప్రదేశాలలో వీధి కుక్కలు చిన్న పిల్లలపై దాడులు సైతం చేశాయని అన్నారు.. వీధి కుక్కల వల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తూ పలువురు ప్రమాదానికి గురి అయ్యారని అన్నారు… నిత్యావసర సరుకులు ఖరీదు చేసి ఇంటికి వెళుతున్న మహిళల చేతులలో ఉన్న సంచులను వీధి కుక్కలు వారిపై దాడి చేసి లాక్కొని వెళ్తున్నాయని తెలిపారు… ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.. ప్రత్యేక అధికారి గారు తక్షణమే చర్యలు తీసుకుని వీధి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు రాజా రమేష్ యాదవ్, నరేష్ రెడ్డి, సందీప్ రాజ్, జహీర్, అజయ్ స్వామి, అల్లాడి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో గత రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీనివల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు సైతం వస్తున్నాయి. అంతేగాక రోజువారి పనులు చేసుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగస్తులు సైతం సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఎక్కువ శాతం పాఠశాలలు సెలవులను ప్రకటించాయి. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత భారీ వానలు పడడం ఇదే మొదటిసారి. ఈ భారీ వర్షాల్లో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-92.wav?_=15

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version