నులి పురుగుల మందులు తప్పనిసరి

 

నులి పురుగుల మందులు తప్పనిసరి

పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులు పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలి ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సాధారణంగా,ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా నులిపురుగుల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని అన్నారు.పిల్లల పొట్టలో నులిపురుగులు చేరితే రక్తహీనత,పోషకాల లోపం, ఆకలి మందగించడం,కడుపు నొప్పి,వికారం,వాంతులు, విరేచనాలు,బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా పిల్లలు ఆల్బండాజోలు మాత్ర వేసుకోవాలని,ఎవరైనా వేసుకోకుంటే మాప్ అప్ డే రోజు 18వ తేదీన తప్పని సరిగా వేసుకోవాలని అన్నారు.

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version