ఇసుక కు వే బిల్లుల అనుమతులు యధావిధిగాఇవ్వాలి….

ఇసుక కు వే బిల్లుల అనుమతులు యధావిధిగాఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మానేరువాగునుండి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు లభించడంతో వే బిల్లుల ద్వారా ఇసుక రవాణాకు సౌకర్యం కల్పిస్తూ స్థానిక ఎమ్మార్వో వే బిల్లులు ఇవ్వడంతో ట్రాక్టర్ యజమానులము సిబ్బంది అందరం కలిసి మానేరు వాగులోని ఇసుక తీసుకొని వెళుతుండగా చుట్టుపక్కల పొలాలకుచెందిన రైతులతో చిన్న సమస్య ఏర్పడడంతో వాటిని పరిష్కారం చేసుకొని వెళ్తామని చెప్పినా కూడా వినకుండా సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి ట్రాక్టర్లు లోడ్ చేసిన ఇసుకను మానేరు వాగులో విడిచి వెళ్లాలని ట్రాక్టర్ యజమానులతో స్థానిక ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ట్రాక్టర్ సిబ్బంది యజమానులు అందరూ కలిసి ట్రాక్టర్లు నిలిపివేసి ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి తమకు యధావిధిగా వే బిల్లులకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుచున్నామనిఏదైనా సమస్య ఉంటే రైతులతో మా యజమానులు అందరం కలిసి సమస్య పరిష్కారమయ్యే దిశగా చేసుకుంటామని ఈ సందర్భంగా స్థానిక సిబ్బందిని ఎమ్మార్వో ని వేడుకుంటూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అవసరం ఉన్నందున కట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్న నేసేద్యంలో అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి సమస్య పరిష్కరించాలని యజమానులసంఘం సిబ్బంది ఇట్టి ధర్నా కార్యక్రమంలో తంగళ్ళపల్లి ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు భాస్కర్ ట్రాక్టర్ యజమానులు లేబర్స్ తదితరులు పాల్గొన్నారు

సిద్ధన్నకు బి ఆర్ ఎస్ నాయకుల నివాళులు..

బి ఆర్ ఎస్.పార్టీ సీనియర్ నాయకులు సిద్దన్న మృతదేహానికి నివాళులు అర్పించిన చిక్కాల….

 

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేటగ్రామానికి చెందిన కీ..శే.బల్లెపునరసయ్య అలియాస్.సిద్దన్న. హత్యకు గురవడంతో స్థానిక గండి లచ్చపేటగ్రామానికి తీసుకువచ్చారు మృతదేహాన్ని స్థానిక బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ.సిద్ధన్నపార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నారని.ఇలా అకస్మాత్తుగా హత్యకు గురవడం చాలా బాధాకరంగా ఉందని వారి మరణానికి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని.అలాగే వారికి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని ఇట్టి విషయమై స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి తమ తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామనీ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సెస్. చైర్మన్ చిక్కాలరామారావు. టిఆర్ఎస్ ..పార్టీ మండల అధ్యక్షుడుగజబింకర్.రాజన్న. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగలరాజు తంగళ్ళపల్లి మాజీవైస్ఎంపీపీ.జంగిటి అంజయ్య.నీరటి బాబు.గ్రామస్తులు కుల బాంధవులుగ్రామస్తులుపెద్ద ఎత్తున అంతిమయాత్రలోపాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version