గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ పత్రాల పంపిణీ

ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో బాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు…వినియోగధారులకు సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలిపిన ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ సర్కార్…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, ఉపసర్పంచ్ మంగళి దత్తు,వార్డు సభ్యులు వై నగేష్,చాకలి మాణయ్య,మొగులయ్య, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, శేరి సంగమేష్,రామయ్య,జర్నయ్య, కాశీనాథ్, హరి,పాపయ్య,సంజీవులు హెల్పర్, ముజీబ్,తుకారం,సుకుమార్,పాండు,బీరప్ప, శేఖర్,లింగరాజ్ మహిళలు ఈశ్వరమ్మ,లక్ష్మి,అనసుజ తదితరులు పాల్గొన్నారు..

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామంలో బుధవారం సర్పంచ్ దయానంద్ పాటిల్ ఆధ్వర్యంలో 365 మంది లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాతరి ఏసప్ప, మొగులయ్య, బసవరాజ్, స్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది.

గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి లబ్ధి

గృహ జ్యోతి పథకం రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంక్రాంతి పండుగ ముందర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చేసిన మంచి పనిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నదని.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఈ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఝరాసంగం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను లైన్మెన్లు కిరణ్, యూనూస్ అందజేశారు.

గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్

*గృహ జ్యోతి పథకం ద్వారా పేద ప్రజలకు తగిన ఆర్థిక భారం. గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు*

*-మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు*
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు అన్నారు. మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ..గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్న కరపత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు లబ్ధిదారుల కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలపడం జరుగుతుందన్నారు.

 

 

లబ్ధిదారులు వాడిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరిగిందన్నారు. విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం మరియు కుటుంబాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 52, 82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు రూ. 3,593 కోట్ల రూపాయలను ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సంక్రాంతి పండుగను మీ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, విద్యుత్ శాఖ అధికారులు ఫోర్ మెన్ యాదగిరి, ఏఎల్ఎం రమేష్, అన్ మ్యాన్డ్ వేముల కిరణ్ గౌడ్, గృహ జ్యోతి లబ్ధిదారులు పాల్గొన్నారు.

దిడిగి గ్రామంలో ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం

ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం దిడిగి గ్రామంలో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో
సర్పంచ్ జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ గృహజ్యోతి వంటి పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప మాట్లాడుతూ దిడిగి గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గృహ జ్యోతి పథకం: రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది

గృహ జ్యోతి పథకం: రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఈ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను లైన్మెన్లు కిరణ్, యూనూస్ అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version