ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్…

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్‌లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు

నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత…

నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా చైర్మన్ కోట రాజబాబు ని చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, అంతులు ఆదేశాల మేరకు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం చిట్యాల గ్రంధాలయం గ్రామపంచాయతీలో ఉండడం ద్వారా పరిపాలనకు ఇబ్బందికరంగా మారిందని ఇరుకు గదిలో గ్రంథాలయం ఉండడం జరిగిందని, కావున* నూతన గ్రంధాలయ భవనాన్ని నిర్మించి గ్రంధాలయ పాఠకులకు సౌకర్యం కలిగించాలని బుధవారం రోజున పంచి బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ తౌటం నవీన్ గ్రామపంచాయతీ పాలవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ తప్పకుండా*నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది*ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గు మ్మడి శ్రీదేవి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , దొడ్డికిష్టయ్య, గ్రంథాలయ ఇన్చార్జి గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజ బాబు అధ్యక్షతన నిర్వహించిన 58 వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ప్రతీ విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్‌ఫోన్‌ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరి చేస్తామని,అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు 10 లక్షల రూపాయలు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోటా రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version