నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి…

నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి

* ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులను నమ్మకండి

* ప్రజలకు సేవ చేసే నాయకులను నమ్మి తమ అమూల్యమైన ఓటు వేయాలి

* చేవెళ్ళ మున్సిపాలిటీ 17 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుని తమ విలువైన ఓటుతో మేధావులను చదువుకున్న విజ్ఞాన వంతులను సామాజిక బాధ్యత ఉన్న పౌరులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. డబ్బు, మద్యానికి కాకుండా 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసే వారిని ప్రశ్నించే గొంతులను గెల్పించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని చెప్పారు. చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 18 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాలనీలలో ప్రచారం కొనసాగిస్తుంటే ప్రజలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం పదవుల కోసమే పనిచేశారని ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకే ఇలాంటి దుస్థితి ఏర్పడ్డదని వాపోయారు. పదవులు వచ్చాక ప్రజలను , అభివృద్ధిని మరిచిపోయే నాయకులను గెల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపించే నాయకులను నిత్యం ప్రశ్నించాలంటే ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకూడని సూచించారు. ఇన్నాళ్లు ప్రశ్నించలేకే కాలనీల్లో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని అన్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికే రమేష్, మహమ్మద్ ఖలీల్, బాబు, కాలనీ పెద్ద మనుషులు సత్యనారాయణ, విష్ణు తదితరులు అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి…

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు మొక్కుకున్న పుస్తె, మట్టెలను జాతర ఉత్సవ కమిటీ కార్యదర్శి చదువు అన్నారెడ్డి సమక్షంలో అమ్మవార్లకు బహుకరించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ గా తాను గెలిస్తే సమ్మక్క-సారలమ్మలకు పుస్తె, మట్టెలను బహుకరిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. అమ్మవార్ల అనుగ్రహంతో తాను గెలిచానని, తాను మొక్కుకున్నట్లుగానే అమ్మవార్లకు పుస్తె, మట్టెలను బహుకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి తదితరులున్నారు.

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మార్వో

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తంగళ్ళపల్లి ఎమ్మార్వో….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జరుగుతున్న జాతరకు విచ్చేసి న ఎమ్మార్వో అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం జరుగుతున్న సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావు గారిని సమ్మక్క సారాలమ్మ జాతరకు రావాలని ప్రత్యేకంగాఆలయ కమిటీ సభ్యుల గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారిని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబం

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు
మొగులపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన జనసందోహం మధ్య మహేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులను సమర్పించారు. అనంతరం తన పెద్ద కుమార్తె వేముల అనుప్రియ అమ్మవార్లకు ఇష్టమైన నిలువెత్తు బంగారంను దేవతలకు సమర్పించారు. ఈ క్రమంలో ఆయన జాతరలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ తల్లులు వారిని నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరిమి కొట్టి, వారిని చల్లగా చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మినీ మేడారం గద్దెలపై ఆసీనులైనారన్నారు. ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవతలను వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

మానవత్వాన్ని చాటుకున్న మహిళ
మొగుళ్లపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహిస్తున్న జాతరలో జమ్మికుంటకు చెందిన ఒక మహిళ పర్స్ తో పాటు 5 వేల రూపాయలను పోగొట్టుకుంది. పోగొట్టుకున్న పర్సు మరో మహిళకు దొరికింది. దీంతో ఆ మహిళ దొరికిన పర్సు తో పాటు 5 వేల రూపాయలను జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డికి అప్పగించింది. దొరికిన పర్స్ తో పాటు 5 వేల రూపాయలను అప్పగించి మానవత్వాన్ని చాటుకున్న ఆ మహిళను మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి, వడ్జే ఆనంద్ రావు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు మల్సాని నర్సింగరావు, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version