గాంధారి మైసమ్మ జాతరకు సహకరించిన..

గాంధారి మైసమ్మ జాతరకు సహకరించిన అధికారులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనే గల గాంధారి మైసమ్మ బోనాల జాతర సజావుగా సాగేందుకు అహర్నిశలు కృషిచేసి, ఆలయ కమిటీకి ఎల్లవేళలా సహకరించిన మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం చివరి ఆదివారం నిర్వహించే గాంధారి మైసమ్మ జాతరకు పోలీస్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు జాతరను సజావుగా సాగించేందుకు కృషి చేస్తారని అందులో భాగంగానే ఈ సంవత్సరం జరిగిన ఆషాడ మాస బోనాల జాతరను దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు అధికారులను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జక్కుల సమ్మయ్య, సత్యనారాయణ, పారుపల్లి తిరుపతి, భీమ సుధాకర్, మొగిలి, కనకయ్య, రాజయ్య, కుమార్, తిరుపతి, ఓదెలు, మొండి, కుమార్ గౌడ్, శంకర్, ప్రధాన అర్చకులు రమణాచారి, లవ కుమార్ లు పాల్గొన్నారు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పరిరక్షణ కమిటీ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఈనెల 26న ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు 28 శుక్రవారంతో ముగిసినట్లు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శివరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తలు, పోషకులు, నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, జర్నలిస్టు సోదరులకు, పోలీస్, విద్యుత్, వైద్య శాఖ గణపురం గ్రామపంచాయతీ సిబ్బంది, తదితర అధికారులకు ఆలయానికి తరలివచ్చిన భక్తులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గత 18 సంవత్సరాలుగా ఆలయ నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version