మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

* సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో ట్రాన్స్ఫర్మర్ బంద్ చేయడం స్టార్ట్ చేయడం వంటివి పనులు చేయకూడదని. అలాగే ఏదైనా సమస్య వస్తే సెస్ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగినవి.ఇక పై అలా జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఏ సమస్య అయినా సెస్ సిబ్బంది కి తెలుపగలరు. అని సెస్ DE. రామ సుబ్బారెడ్డి, AE. పద్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు సైబర్ క్రైమ్ లకు గురవుతున్నారని,ప్రలోభపెట్టేమాటలకు లొంగకూడదని,ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నగదు లావదేవీలు చేయకూడదని,ఏదైనా అనుమానంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

యువకులారా మత్తును వీడండి

నేటితరం యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు, మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,యుక్త వయసులోనే వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారని,జల్సాలకు అలవాటు పడి మద్యం,గంజాయి మత్తులలో క్షణికా ఆవేశాలకు లోనై నేరాలు చేస్తూ చేతులారా భవిష్యత్తును చెరసాలలో బందీగా మార్చుకుంటున్నారని వాపోయారు.సోషల్ మీడియా ప్రభావానికి లోనై అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని,ఆన్లైన్ లో బెట్టింగులు కాస్తూ డబ్బులు కోల్పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవన్నీ చాలా విచారకరమని అన్నారు.యువకుల్లారా మత్తును వీడండి.చెడు అలవాట్లను వదిలేసి చదువు పైన దృష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని,విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగించాలని, సత్ప్రవర్తన తోని జీవించాలని తెలిపారు.

 

Chief guest

 

తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి*

పిల్లల ప్రవర్తనలో మార్పు గురించి ముందుగా తల్లిదండ్రులకి తెలుస్తుందని, పిల్లలను మార్చుకునే శక్తి తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుందని,ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూనే ఉండాలని,వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ప్రతి పల్లెటూరు లో సీసీ కెమెరాలు ఉండటం చాలా అవసరమని, దొంగతనాలు,నేరాలు జరగకుండా చూడడానికి, ఒకవేళ జరిగిన నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో సహాయపడతాయని,నిఘా నేత్రాల ద్వారా ప్రజలకు పోలీసులకు ఎంతో ఉపయోగం ఉందని,గ్రామస్తులంతా కలిసి సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ సమయంలోనైనా 100 నెంబర్ కు డయల్ చేయాలని చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులోకి వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని,రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు శాంతి భద్రతలకు రక్షణ వలయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా బాధ్యతగా పోలీసు వారితో సహకరించాలని కోరారు.ప్రజలందరూ కూడా సామరస్యంగా తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని,క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని, జనాలు తెలిసి తెలియక తప్పులు చేసి కేసులలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ చుట్టూ,కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని,ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మంచిగా సమాజంలో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా జీవించాలన్నారు.పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని న్యాయం కొరకు పోరాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్,పోలీసులు,స్థానిక నాయకులు,మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ . భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ. కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. జై బాపూ. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు తెచ్చే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందు అని. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి బిజెపి విధానమని. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారని రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో దేశంలో ప్రజలందరికీ వివరించారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 50 వేల ఉద్యోగులను భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీవ్ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఈ ప్రభుత్వం.అభివృద్ధి ఎక్కడ ఆపలేదని ఒక్కొక్క హామీలు నెరవేస్తూ. ప్రజాపాలన సాగుతుందని మత కుల ద్వేషాలు రెచ్చగొట్టాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర కొనసాగించాలని బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ ప్రజలకు తెలియజేశారని రాహుల్ గాంధీ యాత్రలో బిజెపి పార్టీ 200 సీట్లకే పరిమితమైందని సన్న బియ్యం పథకంతో మీ కంచంలో అన్నమై వచ్చిండు అని దానికి కారణం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ.రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా సాధించిందని ప్రభుత్వ పాలకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుని తిన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన అవినీతి అక్రమార్కులు కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అందుకే సీటు దించి ప్రజలు చీ వా ట్లుపెట్టారని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత దోపిడీ గురైందో అందరికీ తెలుసు అని ప్రజా జం జకా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ప్రభుత్వానికిఅండగా ఉండాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నవత ఆటో యూనియన్ చలివేంద్రం ఏర్పాటు.

నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముఖ్య అతిథిలుగా హాజరైన ఎస్ఐ మహేందర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి నేటి ధాత్రి:

 

 

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని అంబేద్కర్ కూడలిలో నెక్కొండ నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నెక్కొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చలివేంద్రం ను ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు త్రాగునీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, గంధం సుధాకర్, నవత ఆటో యూనియన్ సభ్యులు శ్రీరంగం శ్రీనివాస్, పొదిల సురేష్, వాగ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జ్యోతిరావు పూలే ఫోటో కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజేందర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహిళలు అనగారిన కులాల ప్రజలలో విద్య వ్యాప్తికి కృషిని కొనసాగించారని వారి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ,నాయకులు దూడపాక శ్రీనివాస్,రజనీకాంత్,సంపత్,శివకుమార్ యూత్ నాయకులు పాల్గొన్నారు._

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.!

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి మహా ఉద్యమ శాలి మరియు తన ఆశయాలు తన బాటలో నడవాల్సిందిగా జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి మాజీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి,కుంభలా మల్లారెడ్డి, మాట్ల మధు, అగ్గి రాములు, కొయ్యడ రమేష్, చిరంజీవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

తంగళ్ళపల్లి  నేటిదాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో భాగంగా బద్దెనపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి చౌరస్తా నుండి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని.

ఏఐసీసీ టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించన అప్పటినుండి దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎస్టి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని .

దేశం గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని దేశం గురించి ప్రాణాలు అర్పించారని అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని అస్య హాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని.

రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పుడున్న.

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని.

 

ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల ను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మహిళ నాయకులు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రెస్ క్లబ్ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని జర్నలిస్టులు వార్తలకే పరిమితం కాకుండా సామాజిక సేవ చేయడం అభినందనీయమని అలాగే పాత్రికేయులు కీర్తిశేషులు మాస్ రాజయ్య రామ్ రెడ్డి స్మారకార్థం ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు, ఈ చలివేంద్రానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య, జర్నలిస్టులు రమేష్ రామచంద్ర మూర్తి, రవితేజ, సత్యం , రాజశేఖర్, కట్కూరి శ్రీనివాస్, బుర్ర రమేష్ రాజమౌళి,బొల్లరాజేందర్, సరిగొమ్ముల రాజేందర్ ,రంగన్న సంపత్, తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణకై నిర్వహించే “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతీ గడపగడపకి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన బిజెపి నాయకుల ఆలోచన విధానాన్ని, వారు దేశ భద్రతపై చేస్తున్న అంతర్గత దాడిని వివరించాలన్నారు. మండల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇట్టి పాదయాత్రలో పాల్గొని రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ), కరీంనగర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ కోల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పర్శరాంగౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తోట రవి, కర్ణ శీను, లచ్చయ్య, కనకయ్య, స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత.

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పశువులకు పాల దిగుబడి తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అలాగే ఆసుపత్రులు అందుబాటులో లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే గర్భకోశ వ్యాధులు ఎక్కువగా ఎదురవుతున్నందున రైతులు ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో పశువులకు వైద్యం నిర్వహించాలని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున బొత్త వాపు గాని జబ్బ వాపు గాని రావడం జరుగుతుందని సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు పశువులపై ప్రత్యేక దృష్టి కేటాయించి ఇటువంటి వైద్య శిబిరాలకు తీసుకువచ్చి తగిన వైద్యం తీసుకోవాలని రైతులకు సూచించారు అలాగే గ్రామంలో రైతులందరికీ పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారుఇట్టి ఉచిత పశు వైద్య శిబిరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ డైరెక్టర్లు నక్క నరసయ్య దుబాల వెంకటేశం భరత్ గౌడ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ.

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం తంగళ్ళపల్లి మండలరైతులకు అన్ని రకాలుగా వ్యవసాయ రుణాలు కానీ సంబంధిత పంటల అవసరాలకు రైతులకు సహకార సంఘం ఎంతో ఉపయోగపడుతుందని. మండలంలో ఉన్న రైతులందరూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇప్పటిదాకా జరిగిన వాటిని రైతులకు ప్రజలకు వాటి గురించి వివరంగా వివరించారు సహకార సంఘానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చయితున్నాయి తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడిపించడం జరుగుతుందని. దీనిలో వచ్చే ఆదాయం ఎంత దాని గురించి కూడా సంఘం అభివృద్ధిలో కలుపుతున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధిపై మండల రైతులు మీరు కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణ రెడ్డి డైరెక్టర్లు బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు రైతులు సహకార సంఘం సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం

 

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల జిల్లా లోని మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వా వసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం సినారే జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగినది. సభాధ్యక్షులుగా కందేపి రాణి ప్రసాద్ ముఖ్యఅతిథిగా నాగుల సత్యనారాయణ విశిష్ట అతిథిగా జూకంటి జగన్నాథం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడూరి అనిత రచించిన కవితా సంపుటిని జూకంటి జగన్నాధం గారు ఆవిష్కరించారు. రచయితకు పలువురు అభినందనలు తెలిపారు.
జూకంటి జగన్నాథం గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కవి ప్రతిస్పందన ఉండాలి. తద్వారా ప్రజాస్వా సమస్యల ఉనికిని చాటుతూ కవిత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అన్నారు.

Ugadi

సభాధ్యక్షులు కందేపు రాణి ప్రసాద్ గారు మాట్లాడు ప్రజలు పర్యావరణాన్ని నష్టం చేయకుండా ఉండాలి.సామాజిక స్తాయి పురోగతి మరియు వ్యక్తిగత శాంతి సాధన కొరకు ప్రేరణ ఇవ్వాలి. సాహితీ రంగంలో మహిళలు రాణించాలని కోరారు. మారసం అధ్యక్షులు tv నారాయణ,కార్యనిర్వాక అధ్యక్షులు యేలగొండ రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్
మారసం సభ్యులు అంకారపు రవి,దూడం గణేష్, చిటికెన కిరణ్ కుమార్, మాడూరి అనిత, సభా నిర్వహణ శ్రీమతి, వందన సమర్పణ ఇడెపు సౌమ్య చేసారు. కవులు బూర దేవానందం, కామారపు శ్రీనివాస్, కరుణాకర్, పాలి, భాగ్యలక్ష్మి,,నరసింహులు,దేవయ్య, వెంకటరెడ్డి విద్యార్థులు లక్షణ అక్షిత సాయి సురేష్ సృజన్ కుమార్ అంగల శ్రీవాణి కవిత గానం చేశారు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .

ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .

1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .

ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

 జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందు పట్టణం లోని షాది ఖానా లోనీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఎండి ముల్తాని మండల ఎమ్మార్వో తిరుమల రావు డిప్యూటీ ఎమ్ఆర్ఓ ఆసిన్ హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు లో వారితో కలిసి పాల్గోని పండ్లు, ఫలహారాలు తినిపించారు. రంజాన్ అంటేనే నియమ నిష్ఠలతో కూడుకున్న పండుగా అని, నిబద్ధత తో ఎలా జీవనం సాగించాలో చాటి చేప్పే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తాజా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ ముస్లిం మత పెద్దలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ ముస్లిం నాయకులు ఆన్సర్ . లియాకత్ ఆఫీస్ షకీల్ షకీర్ శంకర్ పాటిల్ తాజా మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్ అశ్విని పాటిల్ ఇస్మాయిల్ సాబ్ అసఫ్ అలీ వేణుగోపాల్ రెడ్డి. ముస్లిం సోదరులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

.తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన రెడ్డిసంఘం సభ్యులు తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుట కొరకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కుల సభ్యులం అందరము నిర్ణయించడం జరిగిందని దీని ప్రకారం గోపాలపల్లి గ్రామంలో బే ద్రెంపల్లి వెళ్లే దారిలో స్థానిక ఐకెపి సెంటర్ దగ్గర గుట్ట బోరు ఉన్నందున ఇట్టి భూమి సర్వే నెంబర్.647. లో ఉన్నస్థలాన్ని స్థానిక మహంకాళి అమ్మవారి గుడికి స్థలంఇవ్వడానికి ప్రొసీడింగ్ ఇవ్వాలని ఇవ్వాలని స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి కలిసి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఏసి రెడ్డి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కాసర్ల నర్సింహారెడ్డి సభ్యులు తంకర తిరుపతి రెడ్డి ఆలూరి బాల్రెడ్డి రాజిరెడ్డి బింద్రపు రాజిరెడ్డి ఎగుమంటి సాయి రెడ్డి కాసర్ల లిజీ ప్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .

రాష్ట్రంలోప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో సహాయపడుతుందని.

సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన అని .

కాంగ్రెస్ పార్టీ నాయకుల తెలియజేశారు అలాగే గోపాల్ రావు పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు గోట్ల కొమురయ్యకు25000. రూపాయలు న గునూరి ఎల్లయ్యకు25000. రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ వేముల వాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి తంగళ్ళపల్లి మండలం అధ్యక్షులు ప్రవీణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు ఇందుకుగాను లబ్ధిదారులు ఆపద సమయంలో మాకు ముఖ్య మంత్రి సహాయనిధి అందజేసినందుకు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారిసునీల్ రెడ్డి మండల నాయకులు మీరాల శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు కూతురి రాజు ఎడ్ల ప్రేమ్ కుమార్ కొండవేని రవి కాసర్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వికాస తరంగణి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం.

వికాస తరంగణి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని పశువుల ఆసుపత్రిలో బుధవారం రోజున వికాస తరంగణి వారి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

వికాస తరంగణి ఉపాధ్యక్షులు రిటైర్డ్ పశుసంవర్తన శాఖ జాయింట్ డైరెక్టర్ చాడసుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వికాస తరంగిణి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందిస్తామని,ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

Farmers

ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.విజయ భాస్కర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హనుమకొండ జిల్లా, డాక్టర్ పి శ్రీనివాస్ సహాయ సంచాలకులు,సిహెచ్ వెంకటేష్ కమిషనర్,డాక్టర్ బి. వినయ్,డాక్టర్ శ్రీరామ్ పశువైద్యాధికారులు,పెద్ది ఆంజనేయులు ఎంపీడీవో, రవీందర్ నాథ్,కల్పన, రాంబాయిలాల్ సింగ్, రమేష్,కుమార్ పశు వైద్య సిబ్బంది,కుమారస్వామి, కిషోర్,కోటి,రవి పశువుల మందుల షాపుల యజమాన్యం సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు దయాకర్ రెడ్డి,రామచంద్ర రెడ్డి, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version