జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
బండి సంజయ్ కి వినూత్న వినతి పత్రం
జమ్మికుంట నేటిధాత్రి:

స్థానిక జమ్మికుంట పట్టణంలో గల పాత అంబేద్కర్ వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి చిత్రపటానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రెటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ లు మాట్లాడుతూ;
జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మాణం ప్రారంభించాలని, మరియు కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలును రోజు నడిపించాలని అదేవిధంగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను దక్షిణ్ అప్ అండ్ డౌన్, దానాపూర్, నవజీవన్, గ్రాండ్ ట్రంక్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో ఆపవలసిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేసారు. జమ్మికుంట – హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి గానీ, ఈ ప్రాంతం అభివృద్ధి గానీ ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నప్పటికి కూడా హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి, బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇకనైనా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోని కేంద్రం నుండి రావలసిన నిధులు అన్నిటిని తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇల్లంతకుంట దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రెండవ దేవస్థానం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ దేవస్థానానికి నయా పైసా కూడా తీసుకురాని నేటి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు రామభక్తుడిని నేనని ఎప్పుడు చూసినా రామజపం చేస్తూనే ఉంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని ప్రాంత అభివృద్ధి గాని తనకు అవసరం లేదనట్టుగా ప్రవర్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, ఇకనైనా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, యూత్ నాయకులు పతకాల ప్రవీణ్, పచ్చిమట్ల భాను, ఏరెడ్డి సతీష్, రాగల్ల శివ, బండి పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

పరకాల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,కుంకుమేశ్వర స్వామి ఆలయకమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ మరియు సమన్వయకమిటి సభ్యులు చిన్నల గొనాద్,మంద రాంచెందర్,బొచ్చు చెందర్,చందుపట్ల రాఘవరెడ్డి,పంచగిరి జయమ్మ, మార్క రఘుపతి గౌడ్,పసుల రమేష్,మడికొండ సంపత్ కుమార్,మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాపరెడ్డి దుబాసి వెంకట స్వామి,అనిల్,పోరండ్ల వేణు,ఒంటెరు శ్రవణ్, మంద నాగరాజు,దార్న వేణుగోపాల్,గడ్డం శివ,లక్కమ్ వసంత,బొమ్మకంటి చంద్రమోలి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాలేశ్వరం వెళుతున్న మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అంబేద్కర్ సెంటర్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్,పరకాల రూరల్ మండలం అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్,ఎర్రం రామన్న,చందుపట్ల రాజేందర్ రెడ్డి,కుక్కల విజయ్ కుమార్, సంగా పురుషోత్తం,చిర్ర సారంగపాణి,భాసాది సోమరాజు,ముత్యాల దేవేందర్,కుంటమల్ల గణేష్, ఆకుల రాంబాబు,ధర్నా సునీల్,కందుకూరి గిరిప్రసాద్, గాజుల రంజిత్,సారంగా నరేష్,పల్లెబోయిన భద్రయ్య, చంద్రిక అశోక్,ఆర్పీ సంగీత మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము.

లింగాయత్ సమాజ్, జహీరాబాద్ ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఆత్మీయ శరణ బంధువులకు శరణు శరణార్థి,
12వ శతాబ్దము నందు సమాజములో పాగావేసిన జాతి, వర్ణ, వర్గ మరియు లింగ వివక్షతలను రూపుమాపుటకై భక్తి ఉద్యమానికి నాంది పలికిన యుగపురుషుడు విశ్వగురు బసవేశ్వరుడు..సకల జీవాత్ముల సంక్షేమము కొరకు నిరంతరము పాటుపడిన మహామానవతావాది, అభ్యుదయ వాది మనందరికి ఆదర్శప్రాయుడు. అతడు బోధించిన తత్యాలు యావత్ మానవాళికి అనుసరణీయమైనవి. అందుకే బసవేశ్వరుల వారిని విశ్వగురువుగా, ప్రపంచమునందె మొట్టమొదటి పార్లమెంట్ వ్యవస్థాపకుడిగా మరియు సమసమాజ నిర్మాతగా విశ్వమంతటా కీర్తించబడుచున్నాడు. ముక్తిదాయకుడు, శరణరక్షకుడు, విశ్వగురువు బసవేశ్వరుల వారిని నిత్యం దర్శించి, స్పూర్తిని పొందాలనే సదుద్ధ్యేశంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సమస్త బసవ భక్తుల ఆర్ధిక సహాయంతో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ వారిచే హుగ్గెల్లి కూడలి (చౌరస్తా) వద్ద జాతీయ రహదారిపై “విశ్వగురు బసవేశ్వరుల వారి కాంస్య విగ్రహము” ప్రతిష్టింపబడినది.పరమ పూజ్యశ్రీ భాల్కి పట్టాధ్యక్షులు, మఠాధీశులు, రాష్ట్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాజకీయ ప్రముఖులు, ఆర్థిక సహాయ మందించిన పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు యావత్ బసవ భక్తుల సమక్షములో తేదీ : 23-05-2025 శుక్రవారం మధ్యాహ్నం 12-00 గం॥లకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తమ అమృత హస్తాలతో “ఐశ్వగురు బసవేశ్వరుల వారి విగ్రహావిశ్కరణ” గావించెదరు.
కావున సమస్త శరణ బంధువులు, బసవతత్వాభిమానులు మా ఆహ్వానమును మన్నించి పై కార్యక్రమములో పాల్గొన వలసినదిగా ప్రార్ధన,

పుష్కరాల వద్ద ICDS ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు.

పుష్కరాల వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు.

చిట్యాల నేటి దాత్రి

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల సూపర్వైజర్ జయప్రద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో
సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇన్చార్జి డి డబ్ల్యూ ఓ మల్లేశ్వరి మూడు స్టాల్స్ ను పుష్కర ఘాటు వద్ద రెండు, టెంపుల్ వద్ద ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ లో రెండు మిస్సింగ్ కేంద్రాలు ఒకటి క్రష్ ఏర్పాటు చేసి క్రష్ సెంటర్లో పిల్లలకు ఆటలు పాటలతో పాటు పోషకార పదార్థాలు అందించడం మిస్సింగ్ సెంటర్ల లొ తప్పిపోయిన పిల్లలు, వృద్దులు, మహిళలు మైకుల ద్వారా తెలిపి సేద తీర్చుటకు వసతి కల్పిస్తు పోషకాహార పదార్థాలు అందించి మళ్లీ పేరెంట్స్ కి అప్పగించడం, ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ లన్ని సఖి సెంటర్ హెల్ప్ లైన్ మహిళా శక్తీ సేవలపై అవగాహన కల్పించడం. ప్రైవేట్ స్కూల్ కు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నవని అందులో ఉన్న ఫ్రీ స్కూల్ మెటీరియల్ తో స్టాల్ పెట్టి మైకు ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా సూపర్వైజర్స్ ముగ్గురు చొప్పున రెండు రోజుల ఒకసారి డ్యూటీ లు చేయడం జరిగిందండి. జయప్రద, సరోజ, అప్సర,సుల్తానా సూపర్వైజర్సు మహిళా శక్తి నుండి మమత సఖి నుండి మాధవి హాజరైనారు.ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గ, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మేడం ,అశోక్ , సిడిపిఓ మల్లేశ్వరి , రాధిక విజిట్ చేస్తూ ఐసిడిఎస్ సేవలను చాలా  అభినందించారు.

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న . .

మెట్ పల్లి మే 10 నేటిధాత్రి :

 

 

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మల్లాపూర్, చిట్టపూర్, సాతారం డబ్బా, మేడిపల్లి గ్రామ చౌరస్తాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది . అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ మాట్లాడుతూ 12వ తారీకు సోమవారం రోజున మల్లాపూర్ మెట్పల్లి గ్రామం మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు విగ్రహావిష్కరణ చేస్తారని గీతా కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరియు నియోజకవర్గ గౌడ సంఘ ప్రజలు అత్యధిక మంది పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని అందని వారు ఇదే ఆహ్వానంగా అనుకొని మన కార్యక్రమం మనం ముందు ఉండాలని ఉద్దేశంతో అందరూ రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గొల్లపల్లి రామా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు రామా గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్, ఆరెల్ల నరస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జికె నామ్ ఎడ్యుకేషనల్.!

జికె నామ్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్ లీగల్ సహకరం.

ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు

నర్సంపేట,నేటిధాత్రి:

 

జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్, లీగల్ సహకారం అందించబడునని
ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు తెలిపారు. నర్సంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్
ప్రాజెక్ట్ చైర్మన్ సుప్రియా రత్న కుమార్ గౌడి పేరు మాట్లడుతూ నిరాదరణకు గురైన ప్రజలకు మెడికల్, లీగల్ సర్వీస్ అందించడం కోసం ఈ ట్రస్ట్ ఎర్పాటు చేశామని దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ ప్రాజెక్ట్ సమాజంలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి మరియు వైద్య సేవల ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.
ప్రాజెక్ట్ ప్రాన్ పబ్లిక్ రీడ్రెస్సల్ అసోసియేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఉచిత వైద్య సేవలు,చట్టపరమైన అవగాహన శిబిరాలు అలాగే హన్మకోండలోని చక్రవర్తీ నెట్‌వర్క్ హాస్పిటల్ సహకారంతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు లండన్,ఎమ్మార్సి,యూఎస్ఏ లోని న్యూజెర్సీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఎన్జీఓ 13 రాష్ట్రాల్లో న్యూ ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయంతో వివిధ ప్రాజెక్టులతో పనిచేస్తుంది.రి.నం.725,అలాగే తెలంగాణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ట్రస్ట్ ఆరోగ్య కార్డుతో లభించే సేవలు:

ఉచిత ఓపిడి కన్సల్టేషన్లు,
డయాగ్నస్టిక్ పరీక్షలపై డిస్కౌంట్లు 50 శాతం,చికిత్స ఖర్చులపై రాయితీలు 50 శాతం,ఉచిత ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

సంస్థ ద్వారా అత్యవసర వైద్య సహాయానికి మార్గనిర్దేశం:

డాక్టర్ తారున్ కుమార్ రెడ్డి (క్రిటికల్ కేర్),డాక్టర్ ఏ.వి మోహన్ రెడ్డి (MS జనరల్ సర్జన్)డాక్టర్ ఎ. చంద్రికారెడ్డి (ఎంఎస్ జనరల్ సర్జన్),డాక్టర్ రామకృష్ణ (ఎండి జనరల్ మెడిసిన్),డాక్టర్ పాద్మాజా (క్రిటికల్ కేర్)

మా కార్డు పొందడానికి అర్హులు:

1. వికలాంగులు
2. అనాథలు
3. అన్ని బిపిఎల్ హోల్డర్లు
4. ఒంటరి మహిళలు
5. డెస్టిట్యూట్స్
6. తక్కువ ఆదాయ కుటుంబాలు
7. క్రమమైన ఆరోగ్య సంరక్షణకు నోచుకోలేని వ్యక్తులు

గుర్తింపు మరియు ఆదాయ పత్రాలు (అవసరమైతే)

కార్డుకు ఎలా…ఎలా దరఖాస్తు చేయాలి:

మే 15 వ తేదీ నుండి – ఆగస్టు 15, 2025 మధ్య అన్ని మండలాలలో పంచాయతీ కార్యాలయం మా నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
తద్వారా అవసరమైన పత్రాలు (గుర్తింపు కార్డు,ఆదాయ ధ్రువీకరణ మొదలైనవి) తీసుకురావాలి.

మా సంస్థ లక్ష్యం:

ఆర్థిక సమస్యల కారణంగా ఎవ్వరూ మౌలిక ఆరోగ్య సేవలకు, మరియు చట్టపరమైన సేవలు దూరంగా ఉండకూడదు అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.మనమంతా కలిసి ఆరోగ్యవంతమైన, చట్టపరమైన సమానత్వమున్న సమాజాన్ని నిర్మించుకుందాం.
మరిన్ని వివరాల కోసం: సంప్రదించండి.
: 7207024416/9581226703
ఇమెయిల్: gktrustnaam@gmail.com
వెబ్‌సైట్: www.gktrustnaam.org

వేసవి శిక్షణా తరగతులు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.
1 ఇండోర్ గేమ్స్
2 ఆటలు మరియు పాటలు
3 స్పోకెన్ ఇంగ్లీష్
4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్
5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
6 డ్రాయింగ్ స్కిల్స్
7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు)
8 కమ్యూనికేషన్ స్కిల్స్
9 డాన్స్
10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్
పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.

UCCRIML ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.

యు సి సి ఆర్ ఐ ఎం ఎల్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.

 

 

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

 

కారేపల్లి మండల కేంద్రంలో శనివారం మేడే వారోత్సవాలను పురస్కరించుకొని జాకెట్ నాగేశ్వరరావు తాటి అంజయ్య లు పోలీస్ స్టేషన్ సెంటర్ నందు మేడే జెండాను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలేబోయిన ముత్తయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాల బాధ్యులు ఎర్రబాబు బాణాల లక్ష్మీనారాయణ ఓ పి డి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారు మాట్లాడుతూ భూమి స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న పోరాటాలతో కార్మిక వర్గం నాయకత్వం వహించాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం

ఈనాడు మరింత సందర్భాచితంగా ఉన్నదని వారన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవచ్చని ఇప్పటికే

మన దేశంలో నిరుద్యోగం మహమ్మారిలాగా తయారైందని కార్మికుల వేతనాలు తగ్గిపోయాయి ప్రజల్లో అన్ని రంగాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారని మరొకవైపు అన్ని దేశాలు అభివృద్ధిలో ముందు నడుస్తుంటే

మన దేశం మాత్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని వారన్నారు 10 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే అభివృద్ధి నిరోధక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ అమెరికా అగ్రరాజ్య

అధిపతి వాద ప్రయోజనాలకు కూడిగం చేస్తున్నది దేశాలపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్నది రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నదని అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను ప్రభుత్వం

ఈ పరిస్థితి ఏమాత్రం మార్చలేదు నిరుద్యోగం ధరల పెరుగుదల అనారోగ్యం అవినీతి వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతూనే ఉన్నారు వారిని పక్కదారి పట్టించడానికి ఇస్తున్న ప్రకటిస్తున్న ఉచిత పథకాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి మన దేశంలో

ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే దేశంలోని ప్రజాస్వామ్య విధానాన్ని రద్దుచేసి ధన్యవాదాలు భూమిపంచాలు సామ్రాజ్యవాదుల ప్రభావం నుండి ప్రత్యేకించి అమెరికా ఆగ్రరాజ్య ప్రభావం నుండి బయటపడి స్వతంత్రమైన విదేశాంగ

విధానాన్ని చేపట్టాలి పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రజలకు ప్రజాస్వామ్యకు హక్కులు కల్పించాలి

ఈ విధంగా భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కోసం పోరాటం ఒక్కటే ప్రజల ముందున్న మార్గం పాలకవర్గాలు కులమత ప్రాంతీయ వైశ్యాలను రెచ్చగొట్టి ప్రజలను ఐక్యం కాకుండా చూసి పోరాటంలోకి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు

శ్రీ భేదాలు అధిగమించే ప్రజలను సంఘటిత పరుచు వారు సాగించే పోరాటానికి నాయకత్వం వహించడం సమాజంలో అత్యంత పురోగమి వర్గమైన కార్యవర్గం యొక్క కర్తవ్యం కమ్యూనిస్టు విప్లవకారులు నాయకత్వంలో మన దేశం కార్మిక వర్గం

ఈ సవాలను స్వీకరిస్తుందని తన చారిత్రిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తుందని మేము విశ్వసిస్తున్నాము మేడే సందర్భంగా కార్మిక వర్గం ముందున్న ఒకే ఒక కర్తవ్యం ఇదే ప్రపంచ కార్మికులారా ఏకంకండి మేడే వర్ధిల్లాలి అంటూ నినదించారు

ఈ కార్యక్రమంలో నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పారు.

హిందువులను చైతన్యం చేసేందుకే ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మీద పీఠాధిపతులు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు

జర్నలిస్టుల హక్కులకై సమిష్టిగా పోరాడుదాం

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో ప్రభుత్వాల కుట్రలకు బలైపోయిన కలం కార్మికులకు నివాళులర్పిస్తూ కలం కార్మికుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జర్నలిస్టు యోధులు షేక్ బందగీ, ఎన్ కౌంటర్ దశరథ రామ్, గౌరీ లంకేష్, ల ఆశయాలను కొనసాగించాలని కోరారు. కలం కార్మికుల హక్కుల కోసం సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బండిపెల్లి మధు (జర్నలిస్టు సూర్య), ప్రెస్ క్లబ్ కోశాధికారి కొత్తకొండ వాసు (బెస్ట్ వాయిస్ రిపోర్టర్), కార్యవర్గ సభ్యులు కమ్మగాని నాగన్న (పయనించే సూర్యుడు), గజ్జి సంతోష్ కుమార్ ( నేటి దిన పత్రిక సూర్య ), వన్నాల ధనుంజయ (నేటిధాత్రి), అబ్బోజు యాక స్వామి (ఐ న్యూస్), సీనియర్ జర్నలిస్ట్ చిట్యాల మధు (నమస్తే తెలంగాణ) పాల్గొన్నారు.

జేఏసీ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ముందు.!

జేఏసీ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

మందమర్రి నేటి ధాత్రి

కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో జి ఎం ఆఫీస్ మరియు సివిల్ ఆఫీస్ ముందు ధర్నా మెమోరం ఇవ్వడం జరిగింది
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కూలిండియా వేతనాలు ఇతర హక్కుల సౌకర్యాలు అమలుపరచడం గురించి
సింగరేణి సంస్థలో అన్ని విభాగాలలో సుమారు 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు కాంటాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు చట్టబద్ధమైన హక్కులను సౌకర్యాలను అమలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం జెవిసిసిఐ నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలను 2013 నుండి అమలు చేయవలసి ఉండగా సింగరేణి సంస్థ అమలు చేయడం లేదు కూల్ ఇండియా పరిధిలో కొన్ని సంస్థలు జేబీసీసీ నిర్ణయించిన హైపర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ లాభాలతో నడుస్తున్న సింగరేణిలో కుంటి సాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయం కాంట్రాక్ట్ కార్మికులుగా

GM office

పనిచేస్తున్న వారు దళిత గిరిజన మైనార్టీ నిరుపేద కాంట్రాక్ట్ కార్మికులు వారి శ్రమకు తగ్గ వేతనం లభించకపోవడంతో లక్షలాది రూపాయల కష్టార్జితం కోల్పోయి ఇబ్బందులను అనుభవిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ అందుకు కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడానికి పూనుకొనలేదు ఈ మేడే సందర్భంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను చట్టబద్ధహక్కులను తక్షణమే అమలు చేయాలని కోరుచున్నాము ఇట్లు జేఏసీ సంఘాల ప్రతినిధులు ఎండి జాఫర్ ఐ ఎఫ్ టి యు పి.మహేశ్వరి ఆర్ అజయ్ ఎస్ కనకయ్య ఎస్ భూమయ్య వెంకట స్వామి గణేష్ తదితరులతోపాటు టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు మణిరం సింగ్ ఎండి సుల్తాన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
జిఎం ఆఫీస్ లో పీఎం సివిల్ ఆఫీసులో డివైజిఎం రాములు మెమోరండం ఇవ్వడం జరిగింది

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో.!

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళి…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

కాశ్మీర్ పహాల్గాం లోని ఉగ్రవాదుల దాడిలో అమరులైన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులు అర్పించారు. గోపినగర్ హనుమాన్ దేవాలయం నుండి.. చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద నుండి.. పీజేఆర్ స్టేడియం నుండి వేరువేరుగా ప్రారంభమైన మూడు శాంతి ర్యాలీలు బిహెచ్ఇఎల్ చౌరస్తా వరకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు అక్కడ కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో సంఘ్ పరివార్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, పతంజలి యోగ సమితి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఉగ్రవాదుల దుశ్చర్యపై మండిపడ్డారు.

Pahalgam

పాకిస్తాన్ ద్వంద్వ నీతి పై ద్వజమెత్తారు. హిందువా కాదా అని తెల్చుకొని మరి కాల్చి చంపడం అమానుషమని అన్నారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్లో హిందువులను తమ స్వస్థలాల నుండి తరిమి కొట్టారని.. ఈరోజు కాశ్మీర్ లోని పహాల్గంలో ఏకంగా పేర్లు అడిగి, కల్మా చదివించి, దుస్తులు విప్పదీసి మరి హిందువులపై దాడి చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని వాపోయారు. సమాజంలోని ప్రతి వర్గం వారు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పించాలని మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా వెన్నులో వణుకు పుట్టించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

* సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో ట్రాన్స్ఫర్మర్ బంద్ చేయడం స్టార్ట్ చేయడం వంటివి పనులు చేయకూడదని. అలాగే ఏదైనా సమస్య వస్తే సెస్ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగినవి.ఇక పై అలా జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఏ సమస్య అయినా సెస్ సిబ్బంది కి తెలుపగలరు. అని సెస్ DE. రామ సుబ్బారెడ్డి, AE. పద్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు సైబర్ క్రైమ్ లకు గురవుతున్నారని,ప్రలోభపెట్టేమాటలకు లొంగకూడదని,ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నగదు లావదేవీలు చేయకూడదని,ఏదైనా అనుమానంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

యువకులారా మత్తును వీడండి

నేటితరం యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు, మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,యుక్త వయసులోనే వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారని,జల్సాలకు అలవాటు పడి మద్యం,గంజాయి మత్తులలో క్షణికా ఆవేశాలకు లోనై నేరాలు చేస్తూ చేతులారా భవిష్యత్తును చెరసాలలో బందీగా మార్చుకుంటున్నారని వాపోయారు.సోషల్ మీడియా ప్రభావానికి లోనై అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని,ఆన్లైన్ లో బెట్టింగులు కాస్తూ డబ్బులు కోల్పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవన్నీ చాలా విచారకరమని అన్నారు.యువకుల్లారా మత్తును వీడండి.చెడు అలవాట్లను వదిలేసి చదువు పైన దృష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని,విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగించాలని, సత్ప్రవర్తన తోని జీవించాలని తెలిపారు.

 

Chief guest

 

తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి*

పిల్లల ప్రవర్తనలో మార్పు గురించి ముందుగా తల్లిదండ్రులకి తెలుస్తుందని, పిల్లలను మార్చుకునే శక్తి తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుందని,ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూనే ఉండాలని,వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ప్రతి పల్లెటూరు లో సీసీ కెమెరాలు ఉండటం చాలా అవసరమని, దొంగతనాలు,నేరాలు జరగకుండా చూడడానికి, ఒకవేళ జరిగిన నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో సహాయపడతాయని,నిఘా నేత్రాల ద్వారా ప్రజలకు పోలీసులకు ఎంతో ఉపయోగం ఉందని,గ్రామస్తులంతా కలిసి సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ సమయంలోనైనా 100 నెంబర్ కు డయల్ చేయాలని చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులోకి వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని,రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు శాంతి భద్రతలకు రక్షణ వలయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా బాధ్యతగా పోలీసు వారితో సహకరించాలని కోరారు.ప్రజలందరూ కూడా సామరస్యంగా తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని,క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని, జనాలు తెలిసి తెలియక తప్పులు చేసి కేసులలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ చుట్టూ,కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని,ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మంచిగా సమాజంలో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా జీవించాలన్నారు.పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని న్యాయం కొరకు పోరాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్,పోలీసులు,స్థానిక నాయకులు,మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ . భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ. కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. జై బాపూ. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు తెచ్చే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందు అని. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి బిజెపి విధానమని. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారని రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో దేశంలో ప్రజలందరికీ వివరించారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 50 వేల ఉద్యోగులను భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీవ్ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఈ ప్రభుత్వం.అభివృద్ధి ఎక్కడ ఆపలేదని ఒక్కొక్క హామీలు నెరవేస్తూ. ప్రజాపాలన సాగుతుందని మత కుల ద్వేషాలు రెచ్చగొట్టాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర కొనసాగించాలని బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ ప్రజలకు తెలియజేశారని రాహుల్ గాంధీ యాత్రలో బిజెపి పార్టీ 200 సీట్లకే పరిమితమైందని సన్న బియ్యం పథకంతో మీ కంచంలో అన్నమై వచ్చిండు అని దానికి కారణం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ.రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా సాధించిందని ప్రభుత్వ పాలకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుని తిన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన అవినీతి అక్రమార్కులు కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అందుకే సీటు దించి ప్రజలు చీ వా ట్లుపెట్టారని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత దోపిడీ గురైందో అందరికీ తెలుసు అని ప్రజా జం జకా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ప్రభుత్వానికిఅండగా ఉండాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version