టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.