భారత ప్రధాని పిలుపుమేరకు.

“నేటిధాత్రి” జమ్మికుంట.

11వ “అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల” జరుగున్న కార్యక్రమాలలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 21 వరకు (25 రోజుల పాటు) జమ్మికుంట మండలంలో “ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్” GAD పోతీరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా” కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా ఆయుష్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో…

మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ సంధ్యారాణి,GAD పోతీరెడ్డిపల్లి, ప్రిన్సిపాల్ CH.లచ్చయ్య, స్కూల్ స్టాఫ్, PET లు సిబ్బంది, పాల్గొన్న కార్యక్రమంను విజయవంతం చేసారు..

 

యోగ శిక్షణ కార్యక్రమలో. మెడికల్ ఆఫీసర్ సంధ్యా రాణి మాట్లాడుతూ… యోగా తో నిత్యం వాడే మందుల వాడకం తగ్గుతుందని చెప్పారు… ప్రిన్సిపాల్ లచ్చయ్య మాట్లాడుతూ… యువత శరీర శౌష్ణవం, వృద్ధి చెంది, ఆరోగ్యావంతమైన శరీరం ఏర్పడుతుందని…చెప్పారు..మరియు యోగా నిర్వాహకులు, ప్రఖ్యాత శిక్షకులు శ్రీ దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”భారతీయ జీవనశైలి లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ నిత్య జీవితం లో భాగం చేసుకోవాలని ” పిలుపునిచ్చారు.

కాళేశ్వరంపై కూనంనేని విషం!

`కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీకే అవమానం!

`తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు!

`కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు

`తెలంగాణలో విద్యుత్‌ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు 

`రాజకీయంగా కేసిఆర్‌ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు

`ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం!

`కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది

`ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు!

`తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం

`పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల నైజం

`కాళేశ్వరం బాగు చేసి నీళ్లివ్వాలని కోరాల్సిన కూనంనేని

`తెలంగాణ రైతును ఆగం చేసే సలహాలివ్వడం దురదృష్టకరం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కమ్యూనిస్టులు పేద పక్షపాతి సిద్దాంతాలు తిలోదకాలిచ్చినట్లున్నాయి. పాలకపక్షాలకు అనుబంధంగా మాట్లాడితే గాని మనుగడ సాగించలేవని నిర్ణయానికి వచ్చినట్లున్నాయి. అందులోనూ తెలంగాణ అంటే కమ్యూనిస్టుపార్టీలకు ఆది నుంచి చిన్న చూపే. వివక్షలకు కేంద్రమే.అందుకే తెలంగాణ ప్రగతి కోసం కమ్యూనిస్టులు మాట్లాడిరదిలేదు. ప్రశ్నించింది లేదు. కాని అడుగుడునా అభివృద్దికి అడ్డుపడ్డారన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో ఏనాడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయలేదు. పైగా తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకున్న సందర్భం కూడా వుంది. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నసందర్బాలు కూడ వున్నాయి. అందుకే ఓ దశలో కేసిఆర్‌ దబ్బనం పార్టీలు కూడా వారిని విమర్శించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కాళేశ్వరం రద్దు చేయాల్సిందే అంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు సంచనల ప్రకటన చేశారు. కాలేశ్వరం అంటే కేసిఆర్‌, కేసిఆర్‌ అంటే కాళేశ్వరం అని గొప్పగా ప్రకటించుకున్న కేసిఆర్‌ ఇప్పుడు కమీషన్‌ మందు అబద్దాలు చెబుతున్నారన్నారు. నిజంగా కాళేశ్వరం గురించి తెలిసినా, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి తెలంగాణ రైతాంగం దృష్టిలో కూనం నేని సాంబశివరావు మరోసారి విలన్‌ అయ్యారని చెప్పక తప్పదు. తెలంగాణలో కాళేశ్వరం అంటే ఏమిటో ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడా? లేక కాంగ్రెస్‌ గొంతుకై మాట్లాడుతున్నాడా? అన్నది ఆయనే చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్‌ నిర్మాణం సమయంలో 50 టిఎంసిల రిజర్వాయర్‌ నిర్మాణం చేయొద్దని కమ్యూనిస్టులు పెద్దఎత్తున పోరాటం చేశారు. తెలంగాణకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించారు. కాని ఇప్పుడు వారి వ్యహార శైలి ఏమిటో పూర్తిగా అర్ధమౌతోంది. అంటే సిపిఐ పార్టీకి కాళేశ్వరం నిర్మాణం చేయడమే ఇష్టం లేదని అర్ధమౌతోంది. కాళేశ్వరం నిర్మాణం జరిగితే ఆంద్రాకు ఇబ్బంది అవుతుంది? ఇదీ కమ్యూనిస్టుల ఆలోచనలాగా వుంది. నిజానికి తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం. కమ్యూనిస్టులది సమైక్య వాదం. విశాలాంద్ర నినాదం. అందుకే ఇంకా ఆ భావన నుంచి కమ్యూనిస్టులు బైటకు రాలేకపోతున్నారు. మంచికో చెడుకో సిపిఎం పార్టీ ఆది నుంచి అదే స్టాండ్‌ మీదవుంది. తెలంగాణ ప్రకటించిన నాటికికూడా సమైక్యాంధ్ర నినాదాన్నే ఎత్తుకున్నది. ఏపిలో సమైక్య ఉద్యమం సాగించింది. కాని సిపిఐ మాత్రం మనుగడ కోసం తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చింది కాని, తెలంగాణ వాదం ఆ పార్టీలో లేదని కూనం నేని వ్యాఖ్యలతో తేలిపోతోంది. ఓ వైపు తెలంగాణ సమాజం మొత్తం కాళేశ్వరంతో నీళ్లందాయని నమ్ముతుంటే రైతులు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే కూనంనేని సాంబశివరావుకు తెలియడం లేదా? కాళేశ్వరం నీళ్ల ఖమ్మం జిల్లాలో కనిపించలేదా? ఇప్పటికీ ఎల్లంపల్లినీళ్లే తెలంగాణను ఆదుకుంటున్నాయా? అదే నిజమైతే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? తెలంగాణ ఉద్యమానికి సిపిఐ ఎందుకు ముద్దతిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఎలా కనిపించింది? ఎల్లంపల్లితోనే తెలంగాణ సాగు సాగితే ఏటా తెలంగాణకు కరువెందుకు వచ్చింది? తెలంగాణ పల్లెలు వలసలు ఎందుకు వెళ్లిపోయాయి? పాలమూరు ఎందుకు వలసల జిల్లా అయ్యింది? మాట్లాడే ముందు కనీసం సోయితో కూనంనేని మాట్లాడితే బాగుండని తెలంగాణ వాదులు కోరుతున్నారు. కాలేశ్వరం వల్ల ఎక్క ఎకరాకు నీరందలేని అసత్యాలు మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారా? లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ప్రకటనలు చేయొచ్చా? ఎల్లంపల్లి ద్వారా తెలంగాణ పంటలు పండితే 2014 వరకు తెలంగాణలో చెరువులెందుకు నిండలేదు. కాలువలెందుకు పారలేదు. వాగులు, వంకలు ఎందుకు జీవ కాలువలు కాలేదు. బోర్లు ఎందుకు వెయ్యి ఫీట్లు వేసినా నీళ్లు రాకపోయేవి. ఎండాకాలం సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో చుక్క నీరు కూడా అందకపోయేది. తెలంగాణలో బావులన్నీ ఎందుకు ఎండిపోయాయి? తెలంగాణ రైత సాగు వదిలేసి ఎందుకు వలసలు వెళ్లినట్లు? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద రైతులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు? పాలమూరు నుంచి నిత్యం బొంబాయి, పూన, షోలాపూర్‌, బీవండి, సూరత్‌కు బస్సులు ఎందుకు నడిచినట్లు? ఈ సంగతులన్నీ కూనంనేనికి తెలియనివా? శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కూడా కొంత కాలం ఆగితే నిర్మాణం చేసేవారు కాదు. అప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకావడంతోపాటు ప్రధాని నెహ్రూ చొరవతీసుకొని ప్రాజెక్టు శంకుస్ధాపన చేశారు. అయినా ఎన్నేళ్లు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు సాగిందో కూనం నేనికి తెలియదా? 16లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా డిజైన్‌ చేసిన శ్రీరాం సాగర్‌ ను 14 ఎకరాలకు కుదించిన వారు ఎవరు? అలా నిర్మాణం చేసినా కనీసం ఐదు లక్షల ఎకరాలకు పారకం పారించారా? శ్రీరాంసాగర్‌లో నీళ్లున్నా తెలంగాణ రైతులకు నీళ్లు విడదల చేయమంటే చేసేవారా? తెలంగాణకు కరువొచ్చినా ఫరవాలేదని వదిలేసిన కాలం లేదా? ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు. దాని వల్ల తెలంగాణ సాగు పెరిగిందా? కరువు తీరిందా? తెలంగాణ అదనపు స్ధిరీకరణ జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గోసను కమ్యూనిస్టులు చూడలేదా? కాని తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి, ఆంద్రాలో అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నా ఏనాడైనా సిపిఐ ప్రశ్నించిందా? రాయలసీమ కరువు మీద వున్న ప్రేమ పాలమూరు మీద సిపిఐ చూపించిందా? ఆంద్రాలో 70 టిఎంసిల కండలేరు నిర్మాణం చేస్తున్నప్పుడు కళ్లలో ఏం పెట్టుకున్నారు. అప్పుడు భూకంపాలు వస్తాయని ఎప్పుడైనా అన్నారా? వెలిగొండ 43 టిఎంసిలతో నిర్మాణం చేస్తుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? ఈ ఎత్తిపోతల వల్ల ప్రజా దనం వృదా అని ప్రశ్నించారా? లేదు. ఆంద్రాలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఎండబెట్టేందుకు సహకరించారు. పోతిరెడ్డి పాడు నుంచి మద్రాసు దాకా నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు నీళ్లియ్యాలని కొట్లాడిన చరిత్ర సిపిఐకి వుందా? లేదు. ఆంద్రాలో ఊరకళ్లు, బ్రహ్మంగారి మఠం, అలుగునూరు, అవుకు ఇలా అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసినా అడ్డుకోలేదు. అంతెందుకు పోలవరం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాకు నష్టం జరుగుతుందని ఏనాడైనా మాట్లాడిన సందర్భం వుందా? భద్రాద్రి రాముడు మునిగిపోయే ప్రమాదమున్నా ప్రశ్నించారా? ఇప్పుడు బనకచర్లకు గోదావరి నది నుంచి 200టిఎంసిల నీరు తరలించుకుపోవాలని ఏపి ప్రభుత్వం చూస్తుంటే సిపిఐ కళ్లు మూసుకున్నదా? తెలంగాణలోని కాళేశ్వరం రద్దు చేస్తే ఏపికి నీళ్లు వరదలా వెళ్తాయి. అటు పోలవరానికి పుష్కలంగా నీరందుతాయి. బనకచర్లకు కూడా నీళ్లు పారుతాయి. బనకచర్ల కూడాఎత్తిపోతల పధకమే? అది ఎలా సక్రమమౌతుంది? దానికి విద్యుత్‌ ఖర్చు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసిన అనేక రిజర్వాయర్లు నిండేందుకు ఎత్తిపోతల పథకాలకు ఖర్చు కావడం లేదా? పోతిరెడ్డి పాడు వల్ల ఎంత విద్యుత్‌ వినియోగమౌతుందో తెలియదా? అన్నీ తెలుసు. కాని కూనం నేనికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. తెలంగాణలో ఎమ్మెల్యేగా వుండాలి. ఆంద్రా ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సమస్యలతో వుండాలి. కమ్యూనిస్టులు ఉద్యమాలతో ఉనికిని కాపాడుకోవాలి. ఆ పార్టీల మనుగడ కోసం ప్రజలు కష్టాల పడాలి. అన్నమో రామచంద్రా అంటుంటే ప్రజలను ఆదుకుంటున్నట్లు, వారి పక్షనా పోరాటం చేస్తున్నట్లు కమ్యూనిస్టులు నటించాలి. నాయకులుగా వెలుగొందాలి. సిపిఐ స్వార్ధపూరిత రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేయాలి. గతంలో చంద్రబాబు రెండోసారి సిఎంగా గెలిచిన తర్వాత కరంటు చార్జీలు పెంచడం జరిగింది. అయితే అప్పుడు కమ్యూనిస్టులు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారు. కాని ఏపి రైతులు నీటి తీరువాతో సాగు సాగిస్తుంటారు. అందులోనూ బోర్లు వినియోగిస్తుంటారు. వారికి కరంటు బిల్లులు భారమౌతాయని వారి పక్షాన పోరాటం చేసేందుకు తెలంగాణ రైతులను రెచ్చగొట్టారు. అప్పుడూ కమ్యూనిస్టుల నిజస్వరూపం తేలిపోయింది. తెలంగాణ వచ్చినా, ఆంద్రా ప్రయోజనాలే మోస్తోంది. కూనం నేని వ్యాఖ్యలు తెలంగాన రైతాంగానికి ఆగ్రహం తెప్పించింది.

ఎన్టీఆర్‌ ఫస్ట్‌.. రేవంత్‌ నెక్స్ట్‌

`ఎప్పటికైనా నేను సీఎం అని చెప్పిన వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి.

`నేను సీఎం కావడమే నా లక్ష్యం అని చెప్పిన ఒకే ఒక్కడు రేవంత్‌ రెడ్డి.

`అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మరొకరు లేరు.

`సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు.

`గతంలో నేను సీఎం కావాలి అని చెప్పిన ఎన్టీఆర్‌.

`తర్వాత ధైర్యంగా చెప్పింది రేవంత్‌ రెడ్డి.

`సీఎం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన రేవంత్‌.

`అప్పటి కాంగ్రెస్‌ నాయకులు చేసిన అవమానం ఎన్టీఆర్‌లో కసి పెంచింది.

`అవమాన భారంతో సీఎం కావాలనుకున్న ఎన్టీఆర్‌.

`ముందు నుంచి సీఎం కావాలన్న లక్ష్యంతో ముందుకొచ్చిన రేవంత్‌.

`పదవుల కోసం ఎక్కడా ఎదురుచూడలేదు.

`రాజకీయ పదవులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

`సమయస్ఫూర్తితో రాజకీయాలు చేశాడు.

`ఉన్నత రాజకీయ పదవులే ఎంచుకుంటూ వెళ్లాడు.

`సామాన్య కార్యకర్తగా వుండడానికి ఎక్కడా ఇష్ట పడలేదు.

`అంది వచ్చిన అవకాశాలు వదులుకోలేదు.

`ఎవరికీ భయపడలేదు..కేసులు, జైళ్లు లెక్క చేయలేదు.

`అందుకే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు.

`కేసీఆర్‌ ఇంత ధైర్యంగా సీఎం కావాలని చెప్పలేదు.

`మనసులో సీఎం కావాలని అందరికీ వుంటుంది.

`తెలంగాణ వస్తే నేనే సీఎం అని కేసీఆర్‌ చెప్పుకోలేదు.

`దళితుడు సీఎం అని చెప్పి అధికారంలోకి వచ్చిండు.

`రేవంత్‌ రెడ్డి నేనే సీఎం అని కూడా అనేక సార్లు అన్నాడు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి సీఎం కావాలని కలలుగన్నాడు.

`అది నెరవేరడానికి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు.

`సొంత పార్టీలోనే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

`ఆఖరుకు పాదయాత్ర చేసి సిఎం అయ్యారు.

`అప్పుడు కూడా నేనే సీఎం అని ఎప్పుడూ చెప్పలేదు.

`చంద్రబాబునాయుడు కూడా ఎప్పుడూ నేను సిఎం అవుతానని చెప్పింది లేదు.

`ఎన్టీఆర్‌ బతికున్నంత కాలం ఆయనే సిఎం అని అనేక సార్లు అన్నాడు.

`ఆఖరుకు ఎన్టీఆర్‌ కు పక్కన పెట్టి సిఎం అయ్యారు.

`నేను సీఎం అవుతా అని అవరోధాలెదురౌతున్నా చెప్పిన ఏకైక లీడర్‌ రేవంత్‌.

 

హైదరాబాద్‌ ,నేటిధాత్రి: 

  ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుంటుంది. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే డాక్టర్‌, ఇంజనీర్‌, లాయర్‌, కలెక్టర్‌ ఇలాంటి మాటలు వింటుంటాం. ఇప్పుడు కొద్దిగా పరిస్దితి మారింది. సాఫ్ట్‌ వేర్‌ అంజనీర్‌ అనే పదం పిల్లలకు కూడా తెలిసిపోయింది. గత తరంలో మాత్రం ప్రభుత్వఉద్యోగాలు గురించి మాత్రమే తల్లిదండ్రులు చెప్పేవారు. ఒకవేళ తమ పిల్లలు మెకానిక్‌ అవుతా అంటే ఆ తల్లిదండ్రులు షాక్‌ అయిన సందర్భాలు కూడా వుంటాయి. ఇన్ని కోట్ల మందిలో అందరూ చెప్పిన సమాదానం కన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం ప్రత్యేకం. చిన్నప్పుడు స్నేహితులతో ఎప్పుడు మాట్లాడినా లీడర్‌ నైతా అంటూ చెప్పేవారిన ఆయన సన్నిహితులు, చిన్న నాటి స్నేహితులు ఇప్పటికీ గర్తు చేస్తుంటారు. చిన్న నాటి నుంచే రేవంత్‌రెడ్డి లీడర్‌ లక్షణాలు పునికి పుచ్చుకున్నట్లు చెబుతారు. అలాగే ఆయన పెరిగి పెద్దై లీడర్‌గానే ఎదిగారు. సహజంగా లీడర్‌ కావాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఆ తర్వాత సర్పంచ్‌ ఇలా అంచెలంచెలుగా ఎదుగిన వారున్నారు. కాని ఒకే సారి జడ్పీటీసి అయిన నాయకులు చాలా తక్కువ. అది కూడా ఇండిపెండెంట్‌గా గెలవడం అంటే మాటలు కాదు. సామాన్యమైన విషయంకాదు. అందులోనూ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, మరో వైపు బిఆర్‌ఎస్‌ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో ఇండిపెండెంటుగా మిడ్జిల్‌ జడ్పీటీసి అయ్యారు. లీడర్‌గా తొలి మెట్టు ఎక్కేశారు. ప్రజా ప్రతినిధి అయ్యారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడు కూడా బలమైన మూడు రాజకీయపార్టీలను కాదని ,రేవంత్‌రెడ్డి గెలవడం అనేది గొప్ప అవకాశం. అలా మండలిలో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డిని ఓ మాజీ ఎమ్మెల్సీ ఏం కావాలని ఎమ్మెల్సీ అయ్యారు? అని ప్రశ్నిస్తే సిఎం. అని క్షణం ఆలోచించుకోకుండా రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు. నిజానికి ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి మాటను ఎవరూ నమ్మరు. అలాంటి సమాధానం ఎవరు చెప్పినా, మనసులో నవ్వుకుంటారు. లేక అవునా…అంటూ ధీర్ఘం తీస్తారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? అనుకునే ఆత్మ విశ్వాసం నిండుగా వున్న రేవంత్‌ రెడ్డి సిఎం. కావాలన్న లక్ష్యమే ఇంత దూరం నడిపించింది. ఆయనలో ఆత్మవిశ్వాసమే కాదు, అతి విశ్వాసాన్ని కూడా నింపింది. లేకుంటే ఇంత దూరం వచ్చేవారు కాదు. సహజంగా ఎవరికైన ఒక దశలో అతి విశ్వాసం కూడా అవసరమౌతుందని రేవంత్‌రెడ్డి జీవితాన్ని చూస్తే అర్ధమౌతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలకు మాత్రమే సిఎం అయ్యే చాన్సులు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి తెలుగుదేశంలో సిఎం. అయ్యే అవకాశం వచ్చేదో లేదో కాని, తదాస్తు దేవతలు మాత్రం అప్పుడే దీవించారు. ఇంతలో తెలంగాణ ఉద్యమం బలపడిరది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వున్న వైఎస్‌ అకాల మరణం చెందారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ రానే వచ్చింది. తెలంగాణ నుంచి తెలుగుదేశం క్రమక్రమంగా కనుమరుగౌతూ వచ్చింది. అయితే ఇక్కడ మరికొన్నివిషయాలు చెప్పుకోవాలి. నిజానికి రేవంత్‌రెడ్డికి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కావాలని బలంగా వుండేది. కాని ఆ పదవికి అడుగడుగునా అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడుకాకుండా అడ్డుపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతూ వచ్చింది. అప్పుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూశారు. ఏం మాయా మంత్రం చేశారో గాని కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. అయితే ఇక్కడ కూడా నల్లెరు మీద నడకసాగలేదు. కాంగ్రెస్‌లో ఎంట్రీ అంత సులువుగా జరగలేదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిన తర్వాత అవమానాలు తప్పలేదు. సీనియర్‌ నాయకులు బెదిరింపులు తప్పలేదు. అందుకు ఎదురీత రేవంత్‌రెడ్డికి తప్పలేదు. కాని ఆయన లక్ష్యం ఒక్కటే…తాను జీవితంలో సిఎం కావాలి! అనే లక్ష్యం ముందు అన్నీ చిన్నవిగా మారిపోయాయి. అటు కేసిఆర్‌ ప్రభుత్వ వేధింపులు, ఇటుకాంగ్రెస్‌ పార్టీలోసీనియర్‌ నాయకుల చిన్న చూపులు ఎన్ని వున్నా వెరవలేదు. బెదరలేదు. లక్ష్యం చేరే వరకు అలసిపోలేదు. అందుకే సిఎం అయ్యారు. ఆ సమయంలో కూడా తాను సిఎం. అవుతానన్న నమ్మకంతోనే ఆయన పార్టీని భుజాల మీద మోశాడు. కాంగ్రెస్‌ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చాడు. తన పంతం నెగ్గించుకోవడమే కాదు, గమ్యం చేరాడు. లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఇలా రాజకీయాల్లో లక్ష్య సిద్దితోపాటు, కేసిఆర్‌ను పడగొట్టి నిలబతానని, సిఎం. అవుతానని చాలెంచ్‌ చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. తెలుగు రాజకీయ చరిత్రలోనే ఇలా సిఎం. అయిన నాయకుడు వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి. సిఎం కావాలన్న కలను నెరవేర్చుకున్న మరో నాయకుడు ఎన్టీఆర్‌. నిజానికి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఇక సినిమాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం సినీరంగంలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో రాజకీయాల వైపు మళ్లాలన్న ఆలోచన వచ్చింది. కాని ఏదో ఒక పదవి తీసుకోవాలని మాత్రమే అనుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఒకరిద్దరితో చర్చలు కూడా జరిపారు. కాని లాభం లేదన్న సమాధానం వినాల్సివచ్చింది. పైగా అవమానాలు కూడా ఎదురయ్యాయి. దాంతో ఎవరో ఇచ్చే పదవి నాకెందుకు? నేనే లీడర్లను తయారు చేస్తాను. ఇంత కాలం ఆదరించిన ప్రేక్షకులకు రుణం తీర్చుకుంటాను. సిఎం. అయి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటాననకున్నాడు. అప్పటికే రాజీవ్‌గాంధీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారన్న వార్త దావాణలంలా వ్యాపించింది. తెలుగువారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టులో వుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అదే సమయంలో తెలుగుజాతి విముక్తి, తెలుగు ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అదికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ను ఓడిరచి, సిఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాజకీయ నీరును అందించారు. కాంగ్రెస్‌లో హేమా హేమీలనుకున్న నాయకులంతా కొత్త వారి చేతిలో ఓడిపోయారు. అసలు నవయువకులెంతో మంది మంత్రులయ్యారు. అలా తనకు జరిగిన అవమానం నుంచి సిఎం. అవుతానాన్నారు. అయ్యారు. ఈ ఇద్దరు తప్ప చరిత్రలో తాను సిఎం. కావాలని అనుకున్నవారు లేదు. అయినవారు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో 1980 నుంచి సిఎం కావాలని కలలు గన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 వరకు ఎదరుచూడాల్సి వచ్చింది. సీనియర్ల ఎప్పుడు పోతారో..తాను సిఎం ఎప్పుడు అవుతానో అనుకునేవారని కొందరు చెబుతుండేవారు. కాని నేను సిఎం అవుతా ముందే చెప్పిన నాయకుడు కాదు. ఎమ్మెల్యే , మంత్రి అయిన తర్వాత సిఎం. ఆశలు చిగురించాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీని గెలిపించారు. పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఎక్కడా నేనే సిఎం అవుతానని చెప్పింది లేదు. అధిష్టానం ఎవరికి అవకాశమిస్తే వాళ్లే సిఎం. అవుతారని చెప్పాడు. అంతే కాని రేవంత్‌రెడ్డిలా సిఎం. అవుతానని చెప్పలేదు. ఇక ఏపి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకు సిఎం. కావాలన్న ఆశ వున్నప్పటికీ ఎప్పుడూ, ఎక్కడ చెప్పినట్లు లేదు. ఎన్టీఆర్‌ వున్నంత కాలం ఆయనే సిఎం. అని అనేక సార్లు చెప్పిన నాయకుడు చంద్రబాబు. కాకపోతే ఆ పరిస్ధితులు ఆయనను సిఎం. చేశాయి తప్ప, తాను సిఎం అవ్వడానికే రాజకీయాల్లో వచ్చానని ఏనాడు చెప్పలేదు. కకపోతే ఎవరికైనా మనసులో వుంటుంది. బైటకు పదిమందిలో పదే పదే చెప్పిన నాయకుడు రేవంత్‌ తప్ప మరేవరూ లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కేసిఆర్‌ కూడా తాను సిఎం. అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆంతరంగిక సమావేశాలలో అనేవారు అని కొంత మంది చెబితే వినడమే తప్ప ప్రజలకు నేరుగాచెప్పింది లేదు. ఆఖరుకు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రచారం చేశారు. నేనే సిఎం.అని కేసిఆర్‌ ఎక్కడ చెప్పలేదు. అయితే నేను సిఎం అవుతానని చెప్పిన ఇద్దరు లీడర్లలలో మరోక విషయంలోనూ పోలిక వుంది. ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి పేదల కడుపు రేవంత్‌ నింపుతున్నారు. ఈ విషయంలోనూ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. చరిత్రలో నిలిచిపోతారు.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య

ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ

కేసముద్రం నేటి ధాత్రి:

 

 

shine junior college

కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు

జైపూర్ నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 140 లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం మొరంచపల్లి నుండి మంజూరునగర్ వరకు వరకు సాగిన పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో అతిథులు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మంజూరునగర్లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామున్నారు. 

Groundbreaking ceremony

ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం, మరో 30 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేసామన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలల్లో గుమ్మడి శ్రీదేవి అప్పం కిషన్ విస్లావత్ దేవన్ పిప్పాల రాజేందర్ సుంకర రామచంద్రయ్య పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు…

కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

ఆపరేటర్లకు భారంగా మారుతున్న పోల్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ రావు డిమాండ్ చేశారు…

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని సింగరేణి ఫంక్షన్ హాల్ లో కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది…ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షులు వేశాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదురుకుంటున్న సమస్యల పై చర్చించారు…ముక్యంగా ఆపరేటర్లు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు..ప్రభుత్వాలకు,ప్రజలకు నిత్యం వారధి లా ఉండే కేబుల్ టీవీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందన్నారు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబుల్ ఆపరేటర్లకు కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదన్నారు…అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన.. ఆచరణ లోకి రాలేదని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు..ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పట్టించుకోవాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం నాయకులు కోరారు..ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్, జయశంకర్ విగ్రహం మీదుగా జెన్కో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు…అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించారు…పోల్ టాక్స్ ను రద్దు చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు…

ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ సింబల్‌బోర్డ్‌లో ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్‌లోని ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో ఎలాంటి రాతలు లేవు. AIMIM జహీరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, జమాత్ ప్రతినిధులు మా ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకుని, మొదట ఆ పనిని నిలిపివేసి, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్రభుత్వం ఉర్దూలో మాట్లాడుతున్నప్పటికీ, ఉర్దూను విస్మరించారని మరియు R&B శాఖ ప్రతినిధులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు,అతను జహీరాబాద్ RDO సిబ్బంది తో R&B గురించి మాట్లాడాడని నోటీసు జారీ చేశాడు. 

Ε.Ε మరియు A E తో ఫోన్‌లో మాట్లాడి, ఈ బోర్డుపై ఉర్దూ రాయడం పూర్తి చేయని వరకు,ఈ బోర్డును అమర్చడానికి మేము అనుమతించబోమని డిమాండ్ చేశాడు. దీనిపై, టౌన్ S.I వినయ్ కుమార్ R&B శాఖ ప్రతినిధులతో మాట్లాడి A.E సంధ్య ను ఫోన్ చేసి, వారిద్దరూ కలిసి 24 గంటల్లో దానిపై ఉర్దూ రాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం జాయింట్‌ సెక్రటరీ మొహియుద్దీన్‌ గౌరీ సాహబ్‌, అమీర్‌ బిన్‌ అబ్దుల్లా,షేక్‌ ఇలియాస్‌, వార్డెన్స్‌ అందగాడు షేక్‌ సద్దాం,మహమ్మద్‌ ముజీబ్‌ జమాత్‌ నాయకులు మహ్మద్‌ అలీం,మహ్మద్‌ ఫరూఖ్‌,మహమ్మద్‌ సమీర్‌, మహ్మద్‌ అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత  మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ,  వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్*

25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన…..

వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్…

వరంగల్, నేటిధాత్రి : 

 

shine junior college

శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కమిషనర్ తనఖి చేశారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్ లు సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం విధులకు హాజరై, వెళ్లేటప్పుడు నమోదు చేయాలని , అటెండెన్స్ నమోదులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుండి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కలియతిరిగిన కమిషనర్ స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్షిత చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ఇందుకు సంబంధించిన స్టిక్కర్ ను గృహాలకు అతికించి నిర్వహించిన స్వచ్చ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డి ఆర్ సి సి సెంటర్ తో పాటు నర్సరీనీ పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించిన కమిషనర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సి పి లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్ వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్ రావు ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఏ సి పి ఖలీల్ సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ ఏ ఈ లు మొజామిల్ హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య గ్రామ అధ్యక్షులు పేట రాజు సమ్మయ్య ఉపాధ్యక్షులు అంబాల సంజీవ్ కార్యదర్శి నిట్టూరి అంకయ్య ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ ప్రచార కార్యదర్శి పేట రవి నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరగబోయే ఊరు ఊరునా దండోరా జెండా జూలై 7న ఘనంగా ఆవిష్కరించుకొని ఈ దేశంలోనే మాదిగ జాతి ఒక శక్తివంతంగా ఎదిగి సబ్బండ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ ఈ క్రమంలో జాతి చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని సామాజిక న్యాయం సాధించిన తరుణంలో విజయోత్సవాలు చేసుకోవాలని మండలంలో గ్రామాల ప్రజలు యొక్క దండోరా విజయాలని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు జూలై 7న జెండా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య పేట దేవేందర్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంత్రి రవితేజ చింతకుంట సదానందం చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు

సంకల్ప సభను విజయవంతం చేద్దాం .

సంకల్ప సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

shine junior college

 

శాయంపేట మండలం మైలారం గ్రామంలో గురు వారం అనగా19-06-2025 ఉదయం 10 గంటలకు వికసి త్ భారత్ యొక్క అమృత కాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం గడచిన సందర్భంగా సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారత దేశం అభివృద్ధి పథంలో వేగం గా ముందుకు సాగుతున్న తరుణంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమృతకాల సేవా సుపరి పాలన సంకల్పసభ విజయ వంతం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలలో భాగంగా గత 11 సంవత్సరాలలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమ లుపై కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల మద్దతుతో మరింత బలపరచ డానికి ఈ సంకల్ప సభ నిర్వహించబడు తుంది కావున మండలంలోని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల పతాధికారులు, సీనియర్ నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు మరియు మండలంలోని పురప్రముఖు లు అందరూ హాజరై సంకల్ప సభను విజయవంతం చేద్దాం

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి.

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి
భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు
రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో
జమ్మికుంట :నేటిధాత్రి

 

shine junior college

 

 

జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది అలాగే కొంతమంది బినామీ పేర్ల పైన కొత్త పాసు బుక్కు ఉండంగా కూడా వాళ్లు వేలిముద్ర వేయకుండా వాళ్ల సంతకాలు పెట్టకుండా వేరే వాళ్లకు మార్పు చేయించినాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆట స్థలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇట్టి పోరుపై చాలాసార్లు కలెక్టర్ను ఆర్డీవోను ఎమ్మార్వో మారినప్పుడల్లా మా బాధలను వినిపిస్తున్నాము ఈ అక్రమార్కుని పై పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు భూభారతి కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో జరుగుతుందని తెలుసుకుని బాధితులంతా రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపినారు తర్వాత అధికారులకు వారి యొక్క వినతి పత్రాలు అందజేసినారు ఇకనైనా ఈ భూభారతి లోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు కనుక అధికారులు గమనించి సమగ్ర విచారణ జరిపి పేదల భూములు వారి వారికి పాసుబుక్కులు ఇప్పించాలని బాధితులంతా కోరుకోవడం జరిగింది

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హసన్ పర్తి మండలం పెంబర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ, నేటిధాత్రి:

shine junior college

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు.
మంగళవారం హనుమకొండ హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణాలు, రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల నిర్మాణ పనులను ఏ విధంగా చేయిస్తున్నారని, మేస్త్రీలు ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకుంటున్నారు, నిర్మాణ పనులను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేస్తున్నారా అని లబ్ధిదారులు స్వరూప, రజిత, నిర్మల, అరుణ, సమ్మక్క, మంజుల, సులోచన, రాజేశ్వరిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, కాబట్టి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ రహీం పాషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు…

అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ, నేటిధాత్రి:

 

shine junior college

 

 

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు..

*అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

*వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

*వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

 

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

 

“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు…

 

వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానన్నారు. స్థానిక దళిత, గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు. గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి
టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్
బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

shine junior college

 

 

 

దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి.

ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి

బడిబాట కార్యక్రమం నిర్వహించని వారిపై చర్య తీసుకోవాలి…

నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ పై చర్య తీసుకోవాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

 

టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాల ను కాపాడాలని బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించి ప్రభుత్వ స్కూల్లో చదివే విధంగా తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలని ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కానీ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక్కరోజు కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించిన దాఖలు లేవు … ఈ పాఠశాల మూతపడే పరిస్థితి ఉంది ఇందులో ఒక విద్యార్థి కూడా వచ్చిన దాఖలు లేవు వచ్చిన ఉపాధ్యాయుడు మాత్రం కూర్చుండి వెళ్ళిపోతున్నాడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు…. ఈ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు మాత్రం ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపే విధంగా ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యం ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు టాటా మ్యాజిక్ ల ద్వారా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడే సక్రమంగా రాడు మా పిల్లలు ఏమి చదవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో ఉన్నటువంటి మండల అధికారి ఎంఈఓ గారు కనీసం స్పందించిన దాఖలు లేవు ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల పైన చర్య తీసుకున్న పరిస్థితులు లేవు విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాల వాళ్ళు అధికఫీజులు తీసుకుంటూ డ్రెస్ కోడ్ పేరుతో బుక్స్ పేరుతో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారు అయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎంఈఓపై చర్య తీసుకోవాలని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలల కు టాటా మ్యాజిక్ ద్వారా పిల్లలను తీసుకపోతున్న ప్రైవేటు యజమాన్యంపై చర్యలు తీసుకొని స్కూలు గుర్తింపు రద్దు చేయాలని అన్నారు తక్షణమే బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్చి అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు .

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

-MEO లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

shine junior college

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడ పాఠశాల నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలను గురువారం మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి తెలిపారు. మంగళవారం మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సన్నద్ధత సమావేశoలో ఆయన మాట్లాడారు. ఎంపికు వచ్చే అభ్యర్థుల వయస్సు 8 నుండి 9 సంవత్సరాలలోపు (అనగా 01.09.2016 నుండి 31.08.2017 వరకు) ఉండాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, మండల స్థాయిలో ఎంపికలు తేది 19.06.2025న మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల స్టడీ సర్టిఫికెట్,
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో( కలర్).మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జిరాక్స్ఆధార్ కార్డు జిరాక్స్.కమ్యూనిటీ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని కోరారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఎం.ఆర్.సీ, సీ.సీ.వో వేణును 9866744719 చరవాణిలో
సంప్రదించాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, మహేష్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version