ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం.

ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రఖ్యాత ఉర్దూ పరిశోధకుడు, విమర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, అనువాదకుడు, విద్యావేత్త, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ముహమ్మద్ అస్లాం ఫారూఖీకి అరుదైన గౌవరం దక్కిందని ఒక ప్రకటలో ఆయన గురువారం తెలిపారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలను ప్రచురించిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “అదాబ్ వో అదీబ్” అనే పుస్తకంను యూఎస్ఏ వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కొనుగోలు చేసి, ఆ లైబ్రరీలో చేర్చారని తెలిపారు. ఈ పుస్తకం కాపీని ఆసియా రీడింగ్ రూమ్లో సిరీస్ నంబర్ 38622021 కింద లైబ్రరీలో ఆసియా రచయితల వర్గం కింద ఉంచారని తెలిపారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ పుస్తకాన్ని ఎంపిక చేయడం ఏ భారతీయ, ఉర్దూ రచయితకైనా గౌరవమని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో మౌల్వీ అబ్దుల్ హక్ అజీజ్ అహ్మద్ ఇబ్రహీం జలీస్, రఫియా మంజూర్-ఉల్-అమీన్ ఫిరాక్, గోరఖ్ పురి, అక్తర్-ఉల్-ఇమాన్, ఎన్. ఎం. రషీద్ అబుల్ కలాం ఆజాద్, బర్తాని యా ఉర్దూ జీవిత చరిత్ర, పరి శోధనా వ్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకంతో పాటు, ఆయన రాసిన మరో మూడు పుస్తకాలు కూడా అంతర్జాతీయ కేటలాగ్లో చేర్చబడ్డాయని తెలిపారు. ఆయన రాసిన 12 పుస్తకాలు అమెజాన్ లో కూడా అందు బాటులో ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఉర్దూ ప్రేమికులు డాక్టర్ ముహమ్మద్ నజీమ్ అలీ, డాక్టర్ అబిద్ అబ్దుల్ వాసి, డాక్టర్ వసీవుల్లా, భక్తియారీ డాక్టర్ ముహమ్మద్ అహ్సన్ ఫారూఖీ, డాక్టర్ అజీజ్ సొహైల్, సయ్యద్ ముకర్రం నియాజ్, అర్షద్ హుస్సేన్, యాహ్యాఖాన్, సజ్జాదుల్ హస్నైన్, ఇతరులు ఆయనకు అభినందనలు తెలిపారు.

3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు.

జహీరాబాద్: 3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు: డీఈవో

జహీరాబాద్. నేటి ధాత్రి:

రంజాన్ నెల సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాల వేళలో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version