కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య

ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ

కేసముద్రం నేటి ధాత్రి:

 

 

shine junior college

కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version