శ్రీలీల నిశ్చితార్థం.. అసలు కథేంటంటే.. 

శ్రీలీల నిశ్చితార్థం.. అసలు కథేంటంటే.. 

 

టాలీవుడ్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే!

నేతిధాత్రి:

 

టాలీవుడ్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఆ ఫొటోలు చూసి తను త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. 

అవి నిశ్చితార్థం (Sreeleela engegment rumours) ఫొటోలని ప్రచారం జరిగింది.

Heroine Sreeleela.

 

దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి ఆమె వివరించారు.

‘‘నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్‌ చేసుకున్నాం.

దీనికి సంబంధించిన  ప్ల్లానింగ్‌ అంతా మా అమ్మ చూసుకున్నారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. 

 (Sreeleela Pre birthday Celebs)

ప్రస్తుతం శ్రీలీల దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.

Heroine Sreeleela.

 

 

సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు.

ఆయా ఫొటోలకు ‘బిగ్‌ డే’, ‘కమింగ్‌ సూన్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చారు శ్రీలీల.

వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిందంటూ కామెంట్లు చేయగా ఆ ఫొటోలు హల్‌చల్‌ చేశాయి.

జూన్‌ 14న ఆమె 24వ పుట్టినరోజు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కథనాలపై ఆమె తాజాగా స్పందించారు. 

సినిమా టికెట్లు

Heroine Sreeleela.

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

నేతిధాత్రి

 

 

 

 

అగ్ర కథానాయకుడు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార (Nayanatara) కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు ప్రధాన తారాగణంపై కీలక టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు.  తదుపరి షెడ్యూల్‌ ఈ వారాంతంలోనే మొదలు కానుందని తెలిసింది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. చిరంజీవి ఇందులో తన సొంత పేరైన శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు.

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు…

చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

Sleeping Disorder: నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరం, మెదడు రెండింటికీ విశ్రాంతినిస్తుంది. కణాలను పునరుద్ధరిస్తుంది. వివిధ శారీరక, మానసిక విధులను మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బుల ప్రమాదం:

నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ప్రమాదం

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.

నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం

నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

వచ్చే సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి దేశీయ సెమికండక్టర్‌ చిప్‌లు

 

`28`90 నానోమీటర్‌ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు

`దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు

`దేశ అవసరాలతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే యత్నాలు

`వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సెమికండక్టర్‌ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్‌ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్‌ చిప్‌ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్‌ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ తయారీ చిప్‌ ఈ ఏడాది చివరల్లో మార్కెట్‌లోకి రానుంది. మే 29న జరిగిన కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వార్షిక వాణిజ్య సదస్సులో ఈ అద్భుత విషయాన్ని ప్రకటించారు. 2022లో భారత్‌ ఈ చిప్‌ తయారీ రంగంలోకి భారత్‌ ప్రవేశించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం విశేషం. ఈ ప్రకటనతో భారత్‌ అంతర్జాతీయ చిప్‌ మార్కెట్‌లో తన వంతు వాటాను సాధించేందుకు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు పడినట్లయింది. ముఖ్యంగా చిప్‌ తయారీలో టెక్నాలజీ నోడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. మొత్తం చిప్‌ మార్కెట్‌లో 60శాతం టెక్నాలజీ నోడ్‌ ఆక్రమిస్తోంది. ప్రస్తుతం భారత్‌ ఈ రంగంలో పట్టును సాధించేందుకు వ్యూహా త్మకంగా గట్టి ప్రయ్నతం చేయనుంది. ఆటోమోటివ్‌, టెలికమ్యూనికేషన్‌, విద్యుత్‌ వ్యవస్థలు, రై ల్వే సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో టెక్నాలజీ నోడ్‌ చిప్‌లకు అత్యధిక డిమాండ్‌ వుంది. ప్రస్తుతం మనదేశంలో ఆరు ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదేసమయంలో దేశంలో రూ.76వేల కోట్లతో సెమికండక్టర్‌ ఎకోసిస్టమ్‌ రూపకల్పన జరుగుతోంది. దీన్ని సెమికండక్టర్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సెమికండక్టర్‌ చిప్‌ల దిగుమతిపై మనదేశం పూర్తిగా ఆధారపడాల్సి వస్తున్నది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తం గా చిప్‌తయారీ దెబ్బతిన్న ప్రభావం మనదేశంపై బలీయంగా పడినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో చిప్‌లు ప్రతి రంగానికి అత్యంత అవసరమైన నేటి కాలంలో, వీటిపై పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదని అప్పుడే భారత్‌ గుర్తించి, వీటి తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన కృషిని ప్రారంభించింది. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో తయారైన చిప్‌లు మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో పాటు మనదేశం ప్రపంచ చిప్‌ మార్కెట్‌లో వాటా సంపాదించడం తో పాటు మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. 

వ్యూహాత్మక ప్రకటన

దేశంలో తొలి సెమికండక్టర్‌ చిప్‌ తయారీ ప్రకటన వెనుక ఎంతో జాగరూకత, వ్యూహాత్మకత ఇమిడి వున్నాయి. చిప్‌లను స్వదేశంలో తయారుచేయడం వల్ల మనకు దిగుమతుల భారం తగ్గ డంతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సాంకేతిక రంగంలో మన సార్వభౌమాధికారాన్ని సుస్థాపితం చేయడంతో పాటు ఆర్థికపరంగా ఇతరదేశాలతో మరింత పోటీ పడేస్థితికి ఎదగవచ్చు. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ`2వ సదస్సులో మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చేసిన ప్రకటనలోని సారాంశం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్‌ వుండటంతో పాటు 60% డిమాండ్‌ వున్న టెక్నాలజీ నోడ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యమన్నది స్పష్టం చేస్తున్నది. ఈరంగంలో మార్కెట్‌ గతిశీలతపై ఇప్పటికే మనదేశం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ సెమికండక్టర్‌ పరిశ్రమకు వాణిజ్యపరంగా బలమైన పునాది వేసేందుకు మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

2030 నాటికి గ్లోబల్‌ సెమికండక్టర్‌ చిప్‌ల మార్కెట్‌ ఒక ట్రిలియన్‌ డాలర్లను మించిపోనున్నదన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో మనదేశం చిప్‌ మార్కెట్‌లోకి త్వరలో ప్రవేశిస్తుందన్న ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పుడు మనదేశం ప్రధానంగా చిప్‌లకు సంబం ధించి దేశీయ అవసరాలను పూర్తిచేస్తూనే, ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించే రీతిలో వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి వుంటుంది. మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పిన విధంగా మనం కేవలం ఫ్యాబ్రికేషన్‌పై మాత్రమే దృష్టిపెట్టడం కాదు మొత్తం ఎకోసిస్టమ్‌ను పరిపూర్ణంగా నిర్మించా ల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ రంగంలో భారత్‌ సంపూర్ణ దృక్కోణం ఏవిధంగా వున్నదీ అర్థమవుతోంది. అంటే తయారీతో పాటు దేశీయంగా మేధోఆస్తుల అభివృద్ధి, ఉత్పత్తి డిజైన్‌, ప్రామాణీకరించడం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ టెక్నాలజీపైనే మనదేశం ప్రధానంగా దృష్టిపెట్టడానికి కారణం, ప్రపంచంలో ఈ సెగ్మెంట్‌కున్న డిమాండ్‌ మాత్రమే! అతి చిన్న నానోమీటర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన కారణం కేవలం దీనికున్న ప్రాసెసింగ్‌ శక్తి మరియు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం. అదీకాకుండా 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ ప్రస్తుతం పారిశ్రామిక రంగం, దాంతో మమేకమై పనిచేసే వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది భారత్‌లో వినియోగానికి తక్షణం అవసరం. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్‌కు కూడా దీని అవస రం చాలా అధికంగా వుంది. ఈ సెగ్మెంట్‌లో తయారీని కొనసాగించాలని నిర్ణయించడానికి మరో కారణం తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత ఆధునిక టెక్నాలజీ నోడ్స్‌ రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసుకోవడం.

సాంకేతిక ప్రత్యేకతలు మరియు అనువర్తనాలు

28`90 నానోమీటర్‌ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన అనేక పరిశ్రమలకు కావలసిన సంక్లిష్ట అనువర్తనాలకు ఈ నానోమీటర్‌ టెక్నాలజీ ఒక వేదికగా నిలుస్తుంది. ఈ నానోమీటర్‌ పరిమాణంలోని అతిచిన్న చిప్‌ల కారణంగా, తయారు చేసే సెమికండక్టర్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ పనితీరు, తక్కువఖర్చు మరియు తయారీ సంక్లిష్టతల మధ్య అద్భుతమైన సమ న్వయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్‌ పరంగా అత్యంత స్థితిస్థాపక లక్షణం వుంటుంది. ఫౌండ్రీ మార్కెట్‌ షేర్‌ 7.5%ను సుస్థిరంగా వుండేలా చూడగలదు. అంటే ఫ్రౌండ్రీ స్థాయిలో 15బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల మార్కెట్‌ అన్న మాట. ఇదే స్థితి కొనసాగితే 2030 నాటికి 200 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను తేలిగ్గా సాధించవచ్చు. 

దేశీయ పరిశ్రమలకు ఉపయోగం

28ా90 నానోమీటర్‌ రేంజ్‌ దేశీయ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరం. అంతేకాదు దేశీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా దేశానికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్‌ రంగాన్ని తీసుకుంటే ఈ చిప్‌లు ఇంజిన్‌ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉద్గమిస్తున్న విద్యుత్‌ వాహనాలకు అవసరమైన సాంకేతిక అవసరాలను ఈ 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ తీర్చగలుగుతుంది. ఇక టెలికమ్యూనికేషన్‌ రంగం గురించి చె ప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రంగానికి చిప్‌ సాంకేతిక పరిజ్ఞానం ఒకరకంగా ప్రాణం వంటిదనే చెప్పాలి. నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు, బేస్‌ స్టేషన్లు, వినియోగదారుల ఉపకరణాలు, విద్యుత్‌ వ్యవస్థలు ఈ చిప్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తాయి. అంతేకాదు విద్యుత్‌ నిర్వహణ మరియు గ్రిడ్‌ గరిష్టంగా పనిచేయడంలో ఇవి చాలా అవసరం. రైల్వేల్లో ఆ ధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థల్లో ఈ చిప్స్‌ను విస్తృతంగా వాడతారు. అంతేకాదు రైలు నియంత్రణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల్లో, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా చిప్‌లు బాగా అవసర మవుతాయి. 

దేశభద్రత మరింత పటిష్టం

28`90 ఎన్‌ఎం నానో టెక్నాలజీని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌లు ఈ చిప్స్‌ విస్తృతంగా ఉప యోగపడతాయి. ప్రస్తుతం మనదేశ ప్రాథమిక దశలో వున్న సెమికండక్టర్‌ పరిశ్రమ దేశంలోని బహుళ మార్కెట్‌ వ్యవస్థల అవసరాలను తీర్చగలుగుతుంది. కాగా మనదేశంలో సెమికండక్టర్‌ చిప్‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌ాఆక్టోబర్‌ మధ్యకాలంలో మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా వే స్తున్నారు. ఈ చిప్‌లు అందుబాటులోకి వస్తే ఆర్థికంగానే కాదు, దేశభద్రత కూడా మరింత పటిష్టమవుతుంది. ఈ నానో చిప్‌ల తయారీలో పరిణితి సాధించిన తర్వాత 14ా7 ఎన్‌ఎం చిప్‌ల తయారీకి ముందడుగు వేయవచ్చు.

నిజాంపేటలో… దొంగల బీభత్సం .

నిజాంపేటలో…
దొంగల బీభత్సం

నిజాంపేట: నేటి ధాత్రి

 

శుక్రవారం అర్ధరాత్రి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోనీ డబ్బులు దొంగిలించినట్టు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అలాగే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లోనీ ఆలయాలలో చోరీకి ప్రయత్నం జరిగిందని కానీ ఏలాంటి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి (సివిల్ రైట్స్ డే) ఆర్ ఐ శివరామకృష్ణ.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి (సివిల్ రైట్స్ డే) ఆర్ ఐ శివరామకృష్ణ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మొగుళ్ళపల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ సూచించారు. మొగుళ్ళపల్లి మండలం కొరికి శాల గ్రామంలో శనివారం జరిగిన సివిల్‌ రైట్స్‌ డే కార్యక్రమంలో వారు మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతోపాటు సమస్యలపై స్పందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకోవాలని, సక్రమంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ ఐ శివ రామకృష్ణ ఏఎస్ఐ రాజేశం గ్రామాకార్య దర్శి రాజాశేఖర్ గ్రామస్థులు పాల్గొన్నారు.

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బచ్చురాం.

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బచ్చురాం

వనపర్తి నేటిధాత్రి:

 

 

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బచ్చు రామ్ నియామక పత్రము తీసుకున్నారు పత్రం తీసుకున్నట్లు తెలిసింది వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేయుటకు కోనూరు వెంకటయ్య బచ్చురాం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు గోనూరు వెంకటయ్య వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంగంఅధ్యక్షులుగా ఏకగ్రీవం చేయనందుకు పోటీ నుoడి తప్పుకున్నట్లు తెలిసింది

ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన

ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం వాళ్ల నాన్న తాత గడ్డం ఆబి రెడ్డి గారు నిర్మించిన ముత్యాలమ్మ గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోగా వారి వారసులు ముత్యాలమ్మ గుడి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ వారి తాతగారు కట్టిన గుడి శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం చూసి జిర్గించుకోలేకపోయారు. గత సంవత్సరం లో మూడాలు ఉన్నందువలన ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేయలేదు. దీంతో శనివారం మూల సామ్రాట్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. అనంతరం త్వరలోనే ముత్యాలమ్మ దేవాలయం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలందరికీ ముత్యాలమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం
కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం

మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి:

ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి
దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.

క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.

పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.

శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.

మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.

సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.

యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.

ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.

12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.

ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.

ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు

కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.

ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…

కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.

ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.

సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.

రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.

మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.

రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.

కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.

పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.

వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.

పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.

ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.

దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.

దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.

ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.

అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ.

** వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

 

ఈ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ పర్యవేక్షణలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ సంధ్య, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,కుసుమ కుమారి, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ ,సరళ, వనజ, సావిత్రి ,సాజిదా పర్వీన్, రాధా మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు

గుండెపోటుతో యువకుడు మృతి.

గుండెపోటుతో యువకుడు మృతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి

ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి
రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు
నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం
సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo.

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo

ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇ పరిస్థితి

ధాన్యం కటింగ్ లపై ఎమ్మెల్యే మాట్లాడాలి

వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేయాలి

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు గణపురం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇ పరిస్థితి ఏర్పడిందని, ప్రతిసారి వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేసేవారని, ఇసారి మాత్రం అలా జరగలేదని, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్, పి పి సి ఇంచార్జి లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని అన్నారు, గత ప్రభుత్వంలో కటింగ్ లపై మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు చెప్పాలని, కటింగ్ లపై స్పందించాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు
వెంటనే ప్రభుత్వ గోదాములు తీసుకొని ధాన్యం నిలువ చెయ్యాలని,
ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే , జిల్లా మంత్రి చొరవ తీసుకొని ధాన్యం సరఫరా వేగవంతం చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం

హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి

హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్):

శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగ దారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయడానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకొని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు.

legal services

హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండెపోటు లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞ ను చేయించారు.

ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనాలజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన.

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు

మరిపెడ నేటిధాత్రి:

మోకాలి నొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతు ఆపరేషన్ చేపించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్ సోమాజిగూడలో వారి స్వగృహంలో డోర్నకల్ నియోజకవర్గ,మరిపెడ మండల విలేకరులు కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని కోరారు.ఈ పరామర్శ కార్యక్రమంలో విలేకరులు గండి విష్ణు, అనంత రాములు,మూడవత్ రవి, కారంపూరి వెంకటేశ్వర్లు,సతీష్, కపిల్ గౌడ్ ,శ్రీశైలం,ఉప్పలయ,రవి నాయక్ పాల్గొన్నారు.

ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన.

సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వేణు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సిపిఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు పాల్గొన్నారు.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

నర్సంపేట నేటిధాత్రి:

ఇటీవల నూతనంగా నర్సంపేట పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ రఘుపతి రెడ్డిని
నర్సంపేట డివిజన్ వేమనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించారు.అధ్యక్షులు చింతల కమలాకర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి, వీరమల్ల మాధవ రెడ్డి,బైరి తిరుపతి రెడ్డి,కే విజేందర్ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,గోలి శ్రీనివాస్ రెడ్డి,వీరమల్ల సంజీవరెడ్డి,ఉపేందర్ రెడ్డి,బిల్లా ఇంద్రా రెడ్డి,మాడుగుల మల్లారెడ్డి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,పెరుమళ్ళ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది

అహల్య భాయ్ హోల్కర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం లో పుణ్య శ్లోకలోకమాత రాణి అహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి ఉత్సవాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నరహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి ఇరువురు మాట్లాడు తూ మహిళల సాధికారత కోసం వారి యొక్క ఉపాధి కోసం అదేవిధంగా చేనేత కార్మికుల కోసం అహల్యబాయి ఎంతో కృషి చేశారని అన్నారు.

 

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమ స్థాపన

అహిల్యాబాయి హోల్కర్ తన పాలనలో మహేశ్వర్‌ను చేనేత పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేశారు.

మహేశ్వర్‌లోని రాజవాడా గోడల డిజైన్లను ఆధారంగా తీసుకుని ప్రత్యేక మైన మహేశ్వరి సారీలను తయారు చేయాలని ఆమె ప్రేరణ ఇచ్చారు.

ఈ సారీల తయారీలో సూరత్, మండవ వంటి ప్రాంతాల నుండి నైపు ణ్యమైన చేనేత కార్మికులను మహేశ్వర్‌కు ఆహ్వానించారు.

ఈ విధంగా చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి, స్థానిక మహిళలకు ఉపాధి అవకా శాలు కల్పించారు.

 

మహిళల కోసం ఉపాధి అవకాశాలు

మహేశ్వర్‌లోని రెహ్వా సొసైటీ 1978లో స్థాపించబడింది, ఇది అహిల్యాబాయి హోల్కర్ వారసురాలైన రిచర్డ్ హోల్కర్ మరియు ఆయన భార్య సాలీ హోల్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.

ఈ సొసైటీ ద్వారా మహిళలకు చేనేత శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు ఆరోగ్య సేవలు అందించబడు తున్నాయి. ప్రస్తుతం, ఈ సొసైటీ 250 మంది చేనేత కార్మికులతో కలిసి 110 లూమ్స్‌లో పనిచేస్తోంది.

 

చేనేత పరిశ్రమకు ప్రోత్సా హం

అహిల్యాబాయి హోల్కర్ చేనేత పరిశ్రమను ప్రోత్సహిం చడానికి వివిధ చర్యలు తీసు కున్నారు.

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా, ఆమె స్థానిక మహిళ లకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఈ విధంగా ఆమె చేనేత కార్మికుల సంక్షే మం కోసం కృషి చేశారు.

అహిల్యా బాయి హోల్కర్ చేనేత పరిశ్రమ అభివృద్ధి, మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించ డం మరియు చేనేత పరిశ్రమ కు ప్రోత్సాహం ఇవ్వ డం ద్వా రా చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్ర మంలో భూత అధ్యక్షులు బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, బత్తుల రాజేష్, మునుకుంట్ల రాజశేఖర్, మరియు మహిళ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version