వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ.

** వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

 

ఈ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ పర్యవేక్షణలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ సంధ్య, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,కుసుమ కుమారి, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ ,సరళ, వనజ, సావిత్రి ,సాజిదా పర్వీన్, రాధా మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version