శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి మహాదేవుడికి మారేడు దళముల పూజ
సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శ్రావణమాసం శుక్ల పక్షం దశమి సోమవారం పర్వదిన సందర్బంగా శ్రీ ఉమామహేశ్వరసేవ సమితి ఆధ్వర్యంలో శువుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళములను సేకరించి ఆలయ పూజారులు లంక కిషన్ శర్మ చే బిల్వపూజ స్వామి వారికి జరిపించారు.శ్రావణమాస రెండవ సోమవారం అయినందునా భక్తులు మహా దేవుడికి చందన అభిషేకం అర్చనలు చేయడం.
వచ్చిన భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారాని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. పూజ కార్యక్రమంలొ మాజీ సర్పంచ్ రాచకొండ లావణ్య గోపాల్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆరెందల శంకరయ్య మున్నూరు కాపు సంఘం నాయకులు బాపని సాంబయ్య శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఏజన్సిస్ దూడ సతీష్ కుమార్ సేవ కమిటీ సభ్యులు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు గందే ప్రకాష్ మాదారపు వెంకటేశ్వర్లు ఆకుల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
గ్రామల అభివృద్ధియే బిజెపి లక్ష్యమని చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని పేద ప్రజల కోసం ముద్ర లోన్లు ఇంటింటికి ఎల్ఈడి బల్బులు సౌకర్యం సులభతరంగా ఉండాలని ఐదు వందే భారత్ రైలును యువత కు ఉద్యోగ కల్పన అదేవిధంగా మహిళలకు ఉజ్వల యోజన గ్యాస్ లు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపాలని అన్నారు అదేవిధంగా అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ బూటక హామీలతోని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు నోచుకోలేని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అములు చేయలేదన్నారు, కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, సుధ ల వెంకటరాజ వీరు, సుదగాని శ్రీనివాస్ ,నల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, గొపగాని స్వామి, మారత అశోక్ ,అనుపమ మహేష్, గొప గాని రాజు, మాదారపు రాజు ,రాజేష్, చెన్నవేని సంపత్, కదం రాజు, కేంసారపు ప్రభాకర్, ఆ వంచ రాజు, తీగల వంశీ,, అశోక్ చారి, శివారెడ్డి, చింతల రాజేందర్ ,జూనువల వివేక్, తొట్ల మహేష్, జంజర్ల కుమార్, కల్వచర్ల కిషోర్, చెప్పాలా రాజు, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ వెంటనే పరిష్కరించాలని. ఏఐఎఫ్ టియు రాష్ట్ర . నాయకులు చంద్రగిరి శంకర్ .డిమాండ్ చేయడం జరిగింది. సింగరేణి సంస్థల్లో గత కొన్ని దశాబ్దాల నుండి మారుపేర్ల మీద పని చేస్తున్న వేలాది మందికి తమ పేర్లను మార్చుకునే అవకాశం కల్పించడంలో సింగరేణి యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నోసార్లు మారు పేర్ల సమస్యను యజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దాటవేత్త ధోరణి అవలంబిస్తూ ఎప్పటికప్పుడు విషయాలను పక్కదారి పట్టిస్తుందని . తండ్రి ఉద్యోగాలు రాక. ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించక కుటుంబాల పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కెసిఆర్ ప్రభుత్వం మారు పేర్లల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పరిష్కరించలేకపోయింది ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మారు పేర్లను పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పరిష్కరించలేకపోయింది సమస్యల పరిష్కారం కోసం మారుపేర్ల బాధిత కుటుంబాలు శాంతియుతంగా సింగరేణి వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ. సింగరేణి ఏరియా ల అధికారులకు. మరియు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు . సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాల నాయకులకు మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రములు ఇస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అయినా ప్రయోజనం లేకపోవడంతో మా తండ్రి ఉద్యోగాలు మాకు రావని మనస్థాపానికి గురై ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది అయినా పరిష్కారం లేకపోయింది ఇప్పటికైనా. హామీ ఇచ్చి గెలిచినగ సంఘాలు.. సింగరేణి యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవత్వ కోణంలో ఆలోచించి మారుపేర్ల బాధిత కుటుంబాలను ఆత్మహత్యల నుండి కాపాడాలని వెంటనే విజిలెన్స్ లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఏఐఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సోమవారం, 04 జూలై 2025న కరకగూడెం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సందర్శించారు. కలెక్టర్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులతో సంభాషించి సామర్థ్యాలను పరిశీలించారు. బోధన విధానం, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల పాఠన శైలి తదితర అంశాలపై ఆయన వివరంగా తెలుసుకున్నారు. కలెక్టర్ పాఠశాలలోని భోజనాల గది, వసతి గదులు, ఫర్నిచర్, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డి. శ్రీదేవి పిలిపించి, వసతి, ఆరోగ్య పరిరక్షణ, టాయిలెట్లు, నీటి వసతి, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాక, కరకగూడెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నవోదయ పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు. అక్కడి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించి త్వరలోనే పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల తహసీల్దార్ గంట ప్రతాప్ , డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతారావు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ *పి. కృష్ణ ప్రసాద్ , ఎఇ శ్రీనివాస్ , ఎంపీడీవో మారుతి యాదవ్ గ్రామ సెక్రటరీ రామకృష్ణ ,మరియు తదితరులు పాల్గొన్నారు.
కబ్జాదారుడు “మోతీలాల్” కోసం తమ ఇండ్లను కూల్చి వేశారని ఫిర్యాదు.
న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విన్నపం.
నేటిధాత్రి, వరంగల్.
గ్రేటర్ వరంగల్ శివారు, పోగుల ఆగయ్య నగర్లో గత 16 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను నాలుగు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ప్రజా సంఘాల నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్, మాదాసి సురేష్ లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ పాలనలో పేదలకు అన్యాయం జరగడం సరికాదని వారు అన్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, గ్రేటర్ వరంగల్ నగర శివారు పోగుల ఆగయ్య నగర్లో గత పదహారు యేండ్ల క్రితం పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలో, పోలీసులు, మున్సిపల్ అధికారులు అకారణంగా జెసిబి లతో గుడిసెలు నేలమట్టం చేసిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాజేందర్, ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, మాజీ సర్పంచ్ రమేష్, రాష్ట్ర నాయకులు సునీత, కుమార్లు ఇల్లు కూల్చిన స్థలంలో
బాధితులు కలమ్మ, రేణుకలతో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను, ఇందిరమ్మ ప్రజా పాలనలో అన్యాయంగా కూల్చివేయడంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఇండ్లు కులగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్లింగ్ కొత్త హంగులతో ప్రారంభం
చీఫ్ ఇంజనీరింగ్ చిట్టప్రగడ ప్రకాష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొత్త హంగులతో ఏర్పాటు చేసిన సమావేశ మందిరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన
చీఫ్ ఇంజనీర్ ఓం & ఎం చిట్టాప్రగడ ప్రకాష్ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇంజనీర్ అధికారులు ఓ & ఏం మరియు అర్టీజన్ కార్మికులు పాల్గొన్నారు
భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.
భూపాలపల్లి నేటిధాత్రి
వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు మెరుగైన సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లిలో సోమవారం అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కంకటరాజ వీరు గౌడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడి నుండి భూపాలపల్లి వినియోగదారుల కు గ్యాస్ సఫఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు భూపాలపల్లిలో అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కౌంటర్ ద్వారా వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందే విధంగా ఉంటుందని, అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజవీర్ గౌడ్ ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్, కంకటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫొటోస్.
తపస్ వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలోగురువందన కార్యక్రమ ము సందర్భంగా వనపర్తి జిల్లాలోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తరతరాలుగా సమాజానికి గురువు మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులను సమాజాన్ని కి అవసరం పడే వ్యక్తి గురువు అని అన్నారు నేను ఎదగడానికి గురువులు టీచర్ అందించిన విద్యా పాట వాళ్లే నా అభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొనారు . ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ భారత్ ను విశ్వ గురువుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారుజిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కరుణ వనపర్తి మండల విద్యాధికారి మద్దిలేటి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్,దామోదర్ రెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ శశివర్ధన్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి టీచర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ ఈనెల ఫస్ట్ తారీకు నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి కేవలం ఆరు నెలల వరకే తల్లిపాలు ఇవ్వాలని బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పోషక ఆహారం తీసుకున్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు కమల పిల్లలకు కూడా సమానంగా తల్లి పాలు ఇవ్వవచ్చని ఆరు నెలల వరకు కూడా తల్లికి పాలు సరిపోను ఉంటాయని అన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం సాయి సుధా గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు
స్నేహితుల దినోత్సవం రోజున ఆదర్శంగా నిలిచిన స్నేహితులు.
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహకారం
కాశిబుగ్గ నేటిధాత్రి
స్నేహితుల దినోత్సవం అంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న స్నేహితులు ఒక్కచోట కలుసుకొని పార్టీలు చేసుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ గొర్రెకుంట జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో 2003-04 చెందిన పదవ తరగతి విద్యార్థులు నిజమైన స్నేహితుల దినోత్సవం రోజు అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ గుర్తుండేలా చేశారు. ఆదివారం రోజున ఈ స్నేహితులు చేసిన తీరును ఈ రోజు గొర్రెకుంట తోపాటు జిల్లాలోనే స్నేహితులందరికీ మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. వివరాల్లోకెళితే గొర్రెకుంట కు చెందిన ఎర్రం వీరస్వామి(స్వామి) గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారి స్నేహితులు అయినటువంటి 2003-04 ఎస్ఎస్ సి బ్యాచ్ కు చెందిన మిత్రులు ఆయన కుటుంబానికి ముప్పైనాలుగు వేల ఐదు వందల రూపాయలను (34,500)స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం దొరికింది.కాగా మృతి చెందిన వీరస్వామికి భార్యతోపాటు కొడుకు కూతురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు, 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్, సోషల్ మీడియా ఇంచార్జి మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో, ఉర్సు ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఎం.డి ఫకీర్ తండ్రి ఇటీవల మరణించగా, వారి ఇంట్టికి వెళ్లి పరామర్శించి, 50కేజీల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో మంద సతీష్, ఎస్. లింగమూర్తి, పోలేపాక భాస్కర్, అశోక్ గౌడ్, బజ్జురి రవి, బొల్లం సంజీవ, ఎం.డి అఫ్రీన్, కోట యాదగిరి, లక్క సురేందర్, ఎండి షారఫాద్దీన్, మైదం బాలు, గొర్రె చేరాలు, కార్ శ్రీపాల్, వి నరేష్, ఎండి ఆహేమద్ ఖాన్, ఎండి అజర్, మైదం వంశీ, మైదం బన్నీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐడీఎస్ఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి. కుమార్ మాట్లాడుతూ-కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
భూపాలపల్లి నేటిధాత్రి
2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన శైలి ఇతర సమాజాలకు భిన్నంగా ఉంటుందనీ, ఆదివాసులు విగ్రహ ఆరాధకులు కాదని, పకృతి ఆరాధకులని వీరి పూజా వ్యవహారాలు వేరుగా ఉంటాయని అన్నారు, వీరిని జనగణలలో ఏదో ఒక మతం కింద నమోదు చేయడం వలన వీరి అభివృద్ధి కి అస్తిత్వానికి ముప్పు
వాటిల్లుతుందని అందుకే 2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని అదేవిధంగా ఆదివాసి దినోత్సవం ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలోని ఉద్యోగులు మేధావులు సంస్కృతి మీద సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనడం వలన ఆదివాసులకు ఉపయోగం జరుగుతుందని కావున అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 ని ప్రభుత్వ సెల్లు దినంగా కేటాయించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఆదివాసి గ్రామాలలో సమస్యలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ,అదేవిధంగా ఆదివాసి జెండా పండుగలు వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా పండుగలు చేసుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలు కలలు పునర్జీవింప పడేవిధంగా ఆదివాసి సమాజం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఆదివాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోలం సతీష్ బదిరాజయ్య రామినేని రాజు నాగరాజు తోట లక్ష్మయ్య గుంటి అంజలి తోట శ్రీ చందన గుండప్పు తేజస్విని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
గీతా జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి కరపత్రం ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీత ఆశ్రమం లో గీత ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో గీతా జ్ఞాన యజ్ఞం కరపత్రం ఆవిష్కరణ జరిగినది. ఆవిష్కరణకు ఆశ్రమ భక్తులు గీతా ప్రచార సేవా సమితి భక్తులు హాజరైనారు. భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సాయంత్రం ప్రతిరోజు 6:30 నుండి 8 వరకు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు భజన కార్యక్రమం 8 గంటల నుండి 9 వరకు శివ మహిమ స్తోత్రం ఉపనిషత్తు ప్రవచనాలు స్వామీజీ అక్షయ చైతన్య చెబుతారు సిరిసిల్ల వాసులు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రవచనాలను విని తరించాలని భగవద్గీత గొప్పదనాన్ని తెలుసుకొని సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిగా ముందుకు సాగాలని, ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని తెలిపారు.
Sircilla
ఈ కార్యక్రమంలో కొక్కుల రాజేశం, గజ్జల్లి రామచంద్రం, వేముల బక్కయ్య, జక్కని రమేష్, మెరుగు మల్లేశం మెరుగు లక్ష్మణ్ రుద్ర రాజేంద్రప్రసాద్, జి సత్యనారాయణ ,లకావత్ మోతిలాల్, మోర దామోదర్, గడ్డం కౌసల్య బూర్ల శారద సారంగం, మొదలైన వారు పాల్గొన్నారు
జహీరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ స్వామి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు సాయంత్రం 5: 20 గంటలకు జహీరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఐ ఎన్ టియుసి సంఘం
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ గత కార్మిక సంఘం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని భూపాలపల్లి ఏరియాలో సింగరేణి గుర్తింపు సంఘంగా ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాన్ని కార్మికులు ఎంతో ఆశతో గెలిపిస్తే ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘం నాయకులు కింది స్థాయి అధికారులను కార్మికులను కొంతమంది నాయకులు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉచిత మాస్టర్ల కు అలవాటు పడి కార్మికుల ఫోటోలు తీసి కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తూ యాజమాన్యానికి పంపిస్తూ అదే విధంగా కంపెనీకి అధికారులకు ఇన్ ఫార్మర్లు గా వ్యవహరిస్తూ కార్మికులకు సస్మేట్లు షరీసిలు ఇప్పిస్తూన్నరు కార్మికులు గనులలో ఎదుర్కొంటున్న సమస్యలు గాలి లేక త్రాగునీరు లేక సరి అయిన పనిముట్లు లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గెలిచిన సంఘం నాయకులకు సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యల యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించకపోగా కార్మికుల పైన తిరగబడుతూ గుండాల్లాగా బెదిరింపుల పాల్పడుతున్నారు మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ విరవీగుతున్నారు ఇలాంటి కొంతమంది స్వార్థపరుల మూలంగా ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీకి ఐ ఎన్ టియు సి కార్మిక సంఘం కార్మిక వర్గంలో ఉనికి కోల్పోతున్నదని ఇప్పటికైనా ఎమ్మెల్యే అదే విధంగా ఐఎన్టియుసి యూనియన్ పై నాయకత్వం కార్మిక వ్యతిరేక నాయకుల పైన తగు చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తున్న కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై షరిసిట్లు సస్పెండ్ లేటర్ లు ఇపిస్తున్నారు ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే వీరికి రాబోయే రోజులలో కార్మిక వర్గం తగు గుణపాఠం చెప్తుంది వారు అన్నారు ఈ కార్యక్రమంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం నాయకులు దాసరి జనార్ధన్ నామల శ్రీనివాస్ రాళ్ల బండి బాబు జయశంకర్ కే నరసింహారెడ్డి ఎస్ కే సాజిద్ ఎండి సలీం సిహెచ్ లక్ష్మీనారాయణ కే మధుకర్ తదితరులు పాల్గొన్నారు
యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొన్నా
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా||ఎ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ నాయక్ పవార్ మరియు యంగ్ స్టార్ క్లబ్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ లో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసన్ని పెంపొదిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రీడాలకు ప్రధాన్యత ఇవ్వాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి,ఎ.యం.సి.డైరెక్టర్ వంశీ,కాంగ్రెస్ నాయకులు హుగ్గెలి.రాములు, ఖాజా మియా, మూర్జల్,శ్రీనివాస్ నాయక్,సోహైల్,అయూబ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..
శ్రీ పర్వత పర్వతవర్దిని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే
భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
జెడ్ పి హెచ్ ఎస్ మొగుళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ ” ఎన్. సి.సి శిక్షణ శిబిరంలో — ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జులై 24 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎన్. సి.సి వరంగల్ గ్రూపు పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కాల్నల్ సెంథిల్ రాముదరై మరియు పరిపాలన అధికారి లెప్టునేoట్ కల్నల్ రవి సొనరే గారి నేతృత్వంలో కంబైండ్ ఆనవల్ ట్రైనింగ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ క్యాంపులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగుళ్లపల్లి నుండి 5గురు అమ్మాయిలు ,10 మంది అబ్బాయిలు,మొత్తం15 మంది విద్యార్థులు పాల్గొని పది రోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాలు అనగా డ్రిల్, ఆయుధాల వినియోగం, వ్యక్తిత్వ వికాసం , ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యూహాత్మక దాడుల విధానాలు, శత్రువు శిబిరాల ధ్వంసం వంటి, వాటిని ప్రాక్టికల్ గా ఈ శిక్షణలో పొందారని, ఈ శిక్షణలో జిల్లా పరిషత్తు మొగుళ్ళపల్లి పాఠశాల విద్యార్థి సీనియర్, పురాణం వీరమల్లు, ఫైరింగులో ప్రథమ స్థానం, ఖో-ఖో లో మెరుగు సంజయ్ ప్రథమ స్థానం, పొందారని డ్రిల్ లో కూడా మంచి ప్రతిభ చూపారని పాఠశాల
పింగిళి విజయపాల్ రెడ్డి, మాట్లాడుతూ ఎన్. సి.సి ద్వారా దేశభక్తి , క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జాతి పట్ల గౌరవం, మానవత్వ విలువలతో పాటు శారీరక, మానసిక అభివృద్ధి సాధించవచ్చునని అదేవిధంగా ఈ శిక్షణ ద్వారా అందించే సర్టిఫికెట్ 1 శాతం రిజర్వేషన్, విద్య , ఉద్యోగాలలో ముందుకు వెళ్ళుటకు ఉపయోగపడుతుందని , పాఠశాల విద్య లోనే కాదు జాతీయస్థాయిలో భద్రత వ్యవస్థకు అవసరమైన శిక్షణను పొంది అద్భుతంగా రాణిస్తున్నారని, ప్రశంసించారు ఈ విధంగా మొగుళ్ళపల్లి పాఠశాలకు మొదటి బ్యాచ్, ప్రథమ స్థానం పొందుట ఎంతో గర్వకారణమని మునుముందు వీరిని ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాలు సాధించాలని ప్రతిభ చూపిన విద్యార్థులను అందుకు శిక్షణ అందించిన ఎన్ సి.సి అధికారి రాజయ్యను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.వెంకన్న ,వై.సురేందర్, ఏ.వీ.ఎల్ కల్యాణి, బి.కుమారస్వామి కె.ప్రవీణ్, ఎం.రాజు,పి.లలిత ,డిపద్మ ,వై. శ్రీకల ఆర్ .చందర్, అటెండర్,వేణు, సీనియర్ వీరామల్లు, ఎన్.సి.సి విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని . తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్ . బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.