మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సిరిసిల్ల అగ్గిపెట్టెలో చీరను మెచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి దాత్రి )
సిరిసిల్ల నేతన్న ప్రతిభకు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అబ్బురపడ్డారు.
జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇంత చిన్న అగ్గిపెట్టెలో అమరిన చీరను నేసిన నేతన్నను అభినందించారు.
వివరాల్లోకి వెళితే 2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం 2024 మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ అందాల భామ క్రిస్టినా హైదరాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కళాకారుల అద్భుత పనితీరును మిస్ వరల్డ్ క్రిష్టినాకు పరిచయం చేశారు.
అందులో భాగంగా సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ఖండాంతరాలకు వ్యాపింప చేసిన వెల్ది హరిప్రసాద్ తాను నేసిన చేనేతలను మిస్ వరల్డ్ కు చూపించారు.
అద్భుత నైపుణ్యంతో నేసిన చేనేత వస్త్రాలను చూసిన మిస్ వరల్డ్ క్రిస్టినా నేతన్న పనితీరుకు మంత్రముగ్ధులయ్యారు.
అగ్గిపెట్టెలో ఇమిడి చీరను ప్రత్యేకంగా తన భుజాలపై వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.
మిస్ వరల్డ్ సిరిసిల్ల చేనేతలను ప్రశంసించడం పట్ల నేత కళాకారుడు హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల నేతన్నల కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా మరిన్ని ఆవిష్కరణలను రూపొందిస్తానని హామీ ఇచ్చారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చౌకత్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రావిపల్లి అమర సేనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో 500 మీటర్ల మేర 20 లక్షల నిధులతో సిసి రోడ్ ను ప్రారంభించామన్నారు . అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా రోహిత్ కు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాల్య నాయక్, రాములు, సూర్య నాయక్, రాజు నాయక్, మంజుల, బోయిని నాగరాజ్ ,బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం చేసిన కిరాణం వ్యాపారి వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరు చేయించడానికి వనపర్తి పట్టణానికి చెందిన వాసవి సప్లయర్స్ ఎదురుగా చిరు కిరాణం వ్యాపారి ద్వారకా కిరాణం కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు కు అందజేశారు పూరి ని శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం కాంగ్రెస్ నాయకులు రాజకుమార్ శెట్టి ఆవోప పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిని సన్మానం చేశారు ఆర్యవైశ్య వైకుంఠంరథాని కి ఆర్థిక సహాయం చేసిన చిరు వ్యాపారి కాలూరు శ్రీనివాసులశెట్టిని ఆర్యవైశ్య నేతలు అభినందించారు
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి:
అలంపూర్ జోగులాంబ అమ్మవారిని గురువారం రాష్ట్ర *మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు ఈసందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డని జోగులాంబ అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు మాజీమంత్రి వెంట ఆర్యవైశ్యడు వెంకట్రామయ్య శెట్టి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ని స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కు సుదీర్ఘ పోరాటం కొనసాగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంజా మహేందర్ ,జిల్లా నాయకులు కొమ్మాట సుధాకర్ ,మండల అధ్యక్షుడు కొమ్మాట అమర్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లం, స్వామి, శమల మహేష్ ,రాజు, స్వామి,వినోద్ తదితరులు పాల్గొన్నారు
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు
జహీరాబాద్, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న 3లక్షల 4000కోట్ల బడ్జెట్ ను 2025-26 కు ప్రవేశ పెట్టడం జరిగింది ఇది కేవలం అంకెల గారడీలాగే ఉన్నది.గత.సంవత్సరం 2024- 25 లో 2లక్షల91000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు కాని ఖర్చు చేసింది మాత్రం 2లక్షల 20 వేల కోట్లే అంటే 71వేల కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు ఈ బడ్జెట్ లో ఎంత ఖర్చు పెడతారో?
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయింది ఉ: రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయింది, రిజిస్ట్రేషన్ ల వల్ల వచ్చే ఆదాయం ప్రాధానమైనదిగా ఉండేది గత బడ్జెట్ లో 13000 కోట్లు వస్తాయని అంచనా వేసిన కాని కేవలం 5000 కోట్లు మాత్రమే వచ్చింది.ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఎన్నో హామిలిచ్చి వాటికి బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు ప్రధానంగా 6 గ్యారంటీలకు కేటాయింపులు లేవు.ఎస్సిలను మర్చిపోయారు దళిత బందును ఆటకెక్కించారు దాని స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం అని పెట్టి ఎస్సి,ఎస్టి లకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు మర్చిపోయారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున కేటాయింపులు చేస్తామన్నారు అది మర్చిపోయారు,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని ఊసేలేదు,మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ 2500 ఇస్తామన్నారు దానికి కేటాయింపులు లేవు,విద్యా ఆరోగ్యం నకు పెద్ద కేటాయింపులు లేవు అన్ని అన్నారు తెలంగాణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ వై నరోత్తం అన్నారు.
ఝరాసంగం : పక్షులపై ఉన్న ప్రేమతో ఓ మహిళ తన పొలంలో ప్రత్యేకంగా వేసిన పంటను వదిలేసింది. పక్షుల ఆకలి తీర్చడం కోసం సునీత అనే మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన యువ మహిళా రైతు గొల్ల సునీత తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల లో శనగ పంటను వేశారు. మిగిలిన 8 గుంటలలో నల్ల కుసుమను పంటను వేశారు. నల్ల కుసుమ పంట చేతికి వచ్చే సమయానికి రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, తదితర పక్షులు వాటికి ఇష్టమైన నల్ల కుసుమలను తింటూ ఆకలిది తీర్చుకుంటున్నాయని గమనించింది. దీంతో సునీత పక్షులపై ఉన్న ప్రేమతో పంటను మొత్తం వదిలేసింది. ఉదయం, సాయంత్రం రామచిలుకలు వివిధ పక్షులు నల్ల కుసుమను తింటూ ఆనందిస్తున్నాయి. పొలం చుట్టుపక్కల చెట్లతో పాటు మూడు బోరు బావులు ఉండడంతో పక్షులు ఆకలి తీర్చుకున్న తర్వాత బోరు బావుల దగ్గర పిచ్చుకలు నీరును సేవిస్తున్నాయి. పక్షుల ఆకలి తీర్చడం సంతోషాన్ని కలిగించిందని సునీత అన్నారు.
మహమ్మద్ చోటు బాయ్ రూపొందించిన రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన…ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
రంజాన్ మాసంలోనే కాదు అనునిత్యం సేవా కార్యక్రమాలు చేసే చోటు బాయ్ ని అభినందించిన…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు
వర్దన్నపేట (నేటిదాత్రి) :
ఈరోజు…హనుమకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సేవా తత్పరుడు & కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారు రూపొందించిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్పోస్టర్ను వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ…క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే 9 వ నెలనే రంజాన్ మాసం.ఈ రంజాన్ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడింది.కావున రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అని అన్నారు.
ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా రోజా ఉంటూ ఉంటారు. రోజా ఉన్న ముస్లింలు రంజాన్ మాసంలో అత్యంత నీతి నియమాలతో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ఆరాధిస్తారని తెలిపారు.
ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు.
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతను, మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని, పండుగ మానవాళికి హితన్ని బోధిస్తుందని అన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది అని అన్నారు.
అల్లా ప్రబోధించినట్టుగా మన చోటు బాయ్ గారు కూడా అత్యంత దాతృత్వంతో సహృదయ అనే అనాధ వృద్ధాశ్రమం నడపడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో దానధర్మాలు చేస్తూ ఎంతో విశ్వాసం నమ్మకంతో ఉండే సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి & మాజీ సర్పంచ్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుళ్ళ రవి,కాజీపేట మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్,జిల్లా నాయకులు నాంపెల్లి యాదగిరి,మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్,కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రషీద్,లు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్, నందగోకుల్ ,నగరం, చల్మెడ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటటం తో బోర్లు నీళ్లు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుకాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో బోర్లలో నీళ్లు రాక పశువులకు మేతగా మారుతున్నాయి. ప్రభుత్వం ద్వారానైన రైతులకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని కోరుతున్నారు
మెదక్ జిల్లా నిజాంపేటమండల కేంద్రంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి శుక్రవారం తాళాలు వేసి ఉండడంతో మూగజీవాల వైద్యానికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఉదయం 9 గంటలకు తీయవలసిన పశువైద్య కేంద్రం పశువైద్యాధికారితో పాటు దిగు స్థాయి సిబ్బంది గైర్హాజరు తో మూగజీవాల వైద్యానికి మధ్యాహ్నం వరకు వైద్యాధికారితోపాటు సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెను తిరిగారు. పశువైద్యాధికారితో పాటుగా సిబ్బంది ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
నిజాంపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు తప్పకుండా సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడిపినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సోహెల్, రజక్ పాల్గొన్నారు.
ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులుపంపిణీ.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్నులు పంపిణి చేయడం జరిగింది, 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్ధి ఉన్నత చదువులకి మొదటి మెట్టు లాంటిది కాబట్టి విద్యార్థులు బాగా చదివి అందరు ఉత్తిర్ణత సాదించాలి, మనం ఏదైనా సాదించాలి అనుకుంటే అది కేవలం విద్య తోనే సాధ్యం అవ్వుద్ది కనుక ఎగ్జామ్స్ బాగా రాయాలని జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత రావాలని గురువారం పరిక్ష పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రంలో వంశీకృష్ణ , సందీప్, రాకేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఆమోదం తెలపడం చారిత్రక నిర్ణయం
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదిస్తూ తీర్మానం చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిదర్శనం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్
గంగాధర నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు.గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం అభిషేకం నిర్వహించారు. అనంతరం మండలాధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. గతం పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లుకు అనుకూలం అంటూనే, అసెంబ్లీలో ఆమోదించకుండా నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని నాటి ప్రభుత్వం పూర్తిగా విస్మరిచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పురమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,రామిడి రాజిరెడ్డి,దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొలెపాక స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూలం వీరేశం, దీకొండ మధు, గరిగంటి కరుణాకర్, ముచ్చె శంకర్, తాళ్ల శ్రీనివాస్, పడాల రాజయ్య, గంగాధర సుదర్శన్, నాగేందర్ రెడ్డి, ఆముదాల రోహిత్ రెడ్డి, పెద్దోళ్ల రాజేశం, రామంచ రాజు, ప్రభాకర్, ఆనంద్, కరీం, దోమకొండ మహేష్, పిట్టల మల్లేశం, నగేష్, ప్రభాకర్, శ్రీనివాస్, కోలాపురం లక్ష్మణ్, కుమారస్వామి, అట్లా రాజిరెడ్డి, కముటం శ్రీనివాస్, రొండ్ల అనిల్,మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని. అలాగే బకాయిలు చెల్లించి వచ్చే వార్షిక సంవత్సరం2025-2026 ఇంటి పన్ను పై ఐదు శాతం రిబేటును సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన నీరటి సాయికుమార్ ఈ నెల 11 వ తేదీన అనారోగ్యం తో మరణించాడు. వారి ఆర్థిక స్థితి బాగోలేదని తెలుసుకున్న భీమ్ యువత గురువారం రోజున వారి ఇంటికి వెళ్లి 12000 రూపాయలు మరియు 25 కిలోల రైస్ బ్యాగ్ ను అందించి మానవత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో భీమ్ యువత సభ్యులు లింగాల సందీప్, ఈసరి కిరణ్, గడ్డం వెంకటేష్, బుర్క రాకేష్, బుర్క రాజు, గడ్డి నరేష్, వరస రాకేష్ లో పాల్గొన్నారు.
నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.
మల్లాపూర్ మార్చి 20 నేటి దాత్రి మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మల్లాపూర్ వారి అధ్వర్యంలో ఉచితంగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆవులు, గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు మరియు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్శింగరావు హాజరై రైతులకు ఇలాంటి వైద్య శిబిరాన్ని ఉపయోగిచుకోవాలనీ తేలిపారు. ఈ కార్యక్రమము లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత, ఉపద్యక్చులు ఎత్తడి నారాయణ రెడ్డి, ముత్యంపేట పశువైద్యాధికారి డాక్టర్ జి. అశోక్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ డి.వెంకటేష్, డాక్టర్ జె.వెంకటేష్ మరియు కళాశాల విద్యార్థులు పశువైద్య సిబ్బంది ఇక్బల్,అచ్చె శ్రీనివాస్ తైసిన్ రవీందర్,రవి, సాయన్న, గ్రామస్తులు మరియు పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మురుకి నీరు మొత్తం ఇళ్ల మధ్యలో చేరుతోంది. మురికి నీరు ఇళ్ల మధ్యలో చేరడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దుర్వాసన వెదజలడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటిని తొలగింపజేయాలని కోరుతున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.