తాళం ఉన్న పశువైద్య కేంద్రం,
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేటమండల కేంద్రంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి శుక్రవారం తాళాలు వేసి ఉండడంతో మూగజీవాల వైద్యానికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఉదయం 9 గంటలకు తీయవలసిన పశువైద్య కేంద్రం పశువైద్యాధికారితో పాటు దిగు స్థాయి సిబ్బంది గైర్హాజరు తో మూగజీవాల వైద్యానికి మధ్యాహ్నం వరకు వైద్యాధికారితోపాటు సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెను తిరిగారు. పశువైద్యాధికారితో పాటుగా సిబ్బంది ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.