వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్య వల్ల స్మశానవాటికకు వెళ్లేవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మురుగు కాలువ వల్ల మార్గం పూర్తిగా మునిగిపోయింది. అంత్యక్రియలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థాని కులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మురు గు కాలువను మూసివేసి స్మశానవాటికకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని స్థానికు లు కోరుతున్నారు. ఈవిషయంలో తహశీల్దార్ కార్యాలయం తగిన చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈసమస్యపై అధికారుల స్పం దన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం..

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం చేసిన కిరాణం వ్యాపారి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరు చేయించడానికి వనపర్తి పట్టణానికి చెందిన వాసవి సప్లయర్స్ ఎదురుగా చిరు కిరాణం వ్యాపారి ద్వారకా కిరాణం కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు కు అందజేశారు పూరి ని శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం కాంగ్రెస్ నాయకులు రాజకుమార్ శెట్టి ఆవోప పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిని సన్మానం చేశారు ఆర్యవైశ్య వైకుంఠంరథాని కి ఆర్థిక సహాయం చేసిన చిరు వ్యాపారి కాలూరు శ్రీనివాసులశెట్టిని ఆర్యవైశ్య నేతలు అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version