సబ్జెక్ట్ ల వారీగా సామార్ధ్యo పెంచాలి..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T144238.347-1.wav?_=1

 

సబ్జెక్ట్ ల వారీగా సామార్ధ్యo పెంచాలి

ఏ.ఐ ద్వారా విద్యాబోధనకు కృషి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారి వారి తరగతికి సంబందించిన అన్ని సబ్జెక్ట్ ల సామర్థ్యాలు సాధించేలా విద్యా బోధన అందించాలని,విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలల్లో నాణ్యమైన విద్య అందించాలని సంబంధిత ఎంఈఓ లకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాల విద్య అభివృద్ధికి ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపిలో భాగంగా బేస్ లైన్ ఫలితాలు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఆన్ లైన్ చేయాలని ఎఫ్ఏ-1 మార్కులను కూడా సిసిఇ వెబ్ పోర్టల్ లో వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.
హరితహారంలో భాగంగా విద్యాశాఖ టార్గెట్లు 100 శాతం పూర్తి చేసి విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రతి స్కూల్లో ముల్లాపొదలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి స్కూళ్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు మునగా,నిమ్మ,దానిమ్మ, ఉసిరి,గోరింటాకు,కరివేపా తదితర మొక్కలను నాటాలని..నాటిన ప్రతి మొక్కని ఎకో క్లబ్ మిషన్ లైఫ్ వెబ్ పోర్టల్ లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.కంప్యూటర్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన అందించుటకు తెలుగు,ఇంగ్లీష్,మాథ్స్ నైపుణ్యలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.విద్యార్థుల,ఉపాధ్యాయులు అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా 100 శాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు,యు,సృజన్ తేజ,ఏఎంఓ, ఎంఈఓలు సెక్టోరియల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

బంగారం ధరల్లో తగ్గుదల – తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు..

బంగారం ధరల్లో తగ్గుదల – తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు

కొన్నాళ్లుగా రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు చివరికి తగ్గాయి. ఇటీవల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1.03 లక్షలు దాటగా, ఆగస్టు 11, సోమవారం ఉదయం నాటికి గణనీయంగా తగ్గింది.

తాజా ధరలు (10 గ్రాముల బంగారం / 1 కిలో వెండి):

  • దేశీయ మార్కెట్:

    • 24 క్యారెట్లు: ₹1,02,280 (↓ ₹760)

    • 22 క్యారెట్లు: ₹93,750 (↓ ₹700)

    • వెండి: ₹1,17,000 (స్థిరం)

ప్రధాన నగరాల్లో ధరలు:

  • హైదరాబాద్ / విజయవాడ / విశాఖపట్నం:

    • 24K: ₹1,02,280

    • 22K: ₹93,750

    • వెండి: ₹1,27,000

  • ఢిల్లీ:

    • 24K: ₹1,02,430

    • 22K: ₹93,900

    • వెండి: ₹1,17,000

  • ముంబై:

    • 24K: ₹1,02,280

    • 22K: ₹93,750

    • వెండి: ₹1,17,000

  • చెన్నై:

    • 24K: ₹1,02,280

    • 22K: ₹93,750

    • వెండి: ₹1,27,000

  • బెంగళూరు:

    • 24K: ₹1,02,280

    • 22K: ₹93,750

    • వెండి: ₹1,17,000

గమనిక: బంగారం, వెండి ధరలు ప్రాంతాలవారీగా మారవచ్చు. తాజా రేట్లు తెలుసుకోవాలంటే 8955664433కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

 

200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ..

200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి.

రాయికల్, జూలై 30, నేటి ధాత్రి:

సర్దుబాటు, డిఫ్యూటేషన్, నియామకాల్లో, సర్దుబాటు, డిప్యూటేషన్స్ లలో 200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు, హిందీ, అన్ని సబ్జెక్టులకు పోస్టులు మంజూరు చేయాలని భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో జరిగిన రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం విరామ సమయంలో హిందీ ఉపాధ్యాయులందరు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులుకు ప్రాతినిధ్యం చేసారు. కాంప్లెక్స్ సమావేశం ను సందర్శించిన మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి పలు సమస్యలు దృష్టికి తీసుకపోయారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీ నీ ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, వసంతరావు, సయీద్ పాషా, జోంగోని రాజేశం, శంకరయ్య, నీలిమ, జంగిలి రాజేశం, కూరగాయల సురేష్, సుజాత, ధనలక్ష్మి, నారాయణ, రమేష్, గంగాధర్, మారుతి, నరహరి కాంప్లెక్స్ హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా!

తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా! ఫ‌స్ట్ లుక్ అదిరింది

కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది.

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రానికి తెర లేచింది. క‌న్న‌డ న‌టుడు కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి (Rishab Shetty) హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) నాగ‌వంశీ (Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌మౌళి శిష్యుడు ఆకాశ వాణి (Aakashavaani) మూవీ ఫేం అశ్విన్ గంగ‌రాజు (Ashwin Gangaraju) ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ బుధ‌వారం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ మూవీకి ది ల్యాండ్ బ‌ర్న్‌డ్ ఎ రెబ‌ల్ రోజ్ అనే క్యాప్స‌న్ ఇచ్చారు. 18 వ శ‌తాబ్ధంలో బెంగాల్‌లో జ‌రిగిన తీవ్ర ఉద్రిక్త‌ ప‌రిస్థితుల బ్యాగ్రౌండ్‌లో హిస్టారిక‌ల్ పీరియ‌డ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కునుంది.

ఇదిలాఉంటే ప్ర‌స్తుతం రిష‌బ్ (Rishab Shetty) తెలుగులో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ జై హ‌నుమాన్‌లో న‌టిస్తోండ‌గా ఛ‌త్ర‌ప‌తి శివాజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అంతేగాక‌ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార చాఫ్ట‌ర్ 1 మ‌రో నెల ప‌దిహేను రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

 శ్రీజ రన్నరప్‌తో సరి..

శ్రీజ రన్నరప్‌తో సరి

తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో…

లాగోస్‌ (నైజీరియా): తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో (జపాన్‌) 4-1తో శ్రీజను ఓడించింది. కాగా, పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను భారత జోడీ సాతియన్‌ గుణశేఖరన్‌/ఆకాశ్‌ పాల్‌ దక్కించు కుంది. ఫైనల్లో సాతియన్‌ ద్వయం 3-1తో ఫ్రాన్స్‌ జంట లియో డి/జులెస్‌పై నెగ్గింది.

తొలిసారిగా తెలుగులో

తొలిసారిగా తెలుగులో

 

తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో ఇన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు కమెడియన్‌ యోగిబాబు. ఇప్పుడు ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంలో యోగిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉడ్రాజు అనే పాత్రలో వినోదం పంచనున్నారు. మంగళవారం యోగిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో వేణు సట్టి, అమర్‌ బురా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అర్జున్‌ పరాజయం..

అర్జున్‌ పరాజయం

ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో…

లాస్‌ వెగాస్‌: ఫ్రీ స్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీస్‌లో అర్జున్‌ 0-2తో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లివోన్‌ అరోనియన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్‌ మోక్‌ నీమన్‌ చేతిలో ఫాబియానో కరువాన ఓడాడు. ఫైనల్లో ఆరోనియన్‌తో నీమన్‌ తలపడనున్నాడు. కాగా, 3 నుంచి 8 స్థానాల కోసం జరిగిన పోరులో విన్సెంట్‌ కీమర్‌పై ప్రజ్ఞానంద 1.5-0.5తో గెలిచాడు.

బంగారం దిగొచ్చిందోయ్..తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇవే!

బంగారం దిగొచ్చిందోయ్..తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇవే!

బంగారం కొనుగోలు చేసేవారికి తీపి కబురు. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారతదేశంలో బంగారినికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. చాలా మంది ఎక్కువగా కొనుగోలు చేసే దానిలో బంగారమే ముందుంటుంది. మరీ ముఖ్యంగా మహిళలకు బంగారం చాలా ఇష్టం ఉంటుంది. అందుకే వారు ఏ చిన్న శుభ కార్యం జరిగినా సరే బంగారమే కొనుగోలు చేయాలి అనుకుంటారు. ఇక ప్రస్తతం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ లక్షకు చేరువ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు బంగారం కొనుగోలు చేయడానికే భయపడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కానీ నేడు ( గురువారం) బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి.

కాగా, మనం నేడు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం, తెలుగు రాష్ట్రల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,270, 22 క్యారెట్ల బంగారం తులం రూ.90,990, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,450గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,270, 22 క్యారెట్ల బంగారం తులం రూ.90,990, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,450గా ఉంది. గుంటూరులో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,270, 22 క్యారెట్ల బంగారం తులం రూ.90,990, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,450గా ఉంది. మిగతా అన్ని నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.జూలై 17, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,270 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,990గా ఉంది.  జూలై 16, 2025 బుధ వారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,780గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.99,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.91,000గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.90,990గా ఉంది. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,270 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,990 లుగా ఉంది. ఇక నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి పై రూ.100 తగ్గడంతో కేజీ వెండి రూ.1,23,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,270 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.90,990లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,23,900 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,270. 22 క్యారెట్ల ధర రూ.90,990లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,23,900లుగా ఉంది.

అసలేం జరుగుతోంది…

అసలేం జరుగుతోంది…

అధర్వ మురళీ తాజా చిత్రం ‘డి.ఎన్.ఎ.’ తెలుగులో ‘మై బేబీ’గా రాబోతోంది. అయితే ఈ తెలుగు వర్షన్ విడుదల అయ్యి కాగానే ఓటీటీలో దర్శనం ఇవ్వబోతోంది. ఇది తెలుగు నిర్మాతలను షాక్ కు గురిచేసే అంశం.

ప్రముఖ నటుడు అధ్వర్య మురళీ (Atharvaa Murali), నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించిన తమిళ చిత్రం ‘డి.ఎన్.ఎ.’ (DNA). ఇది జూన్ 20న తమిళంలో విడుదలైంది. అదే సమయంలో తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా ఆ సినిమా తెలుగులో ఆ టైమ్ లో రాలేదు.

నెల్సన్ వెంకటేశ్‌ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీ ‘డిఎన్ఎ’ తమిళ నాట విమర్శకుల ప్రశంసలు పొందింది. దాంతో తిరిగి దీనిని తెలుగు విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ సురేశ్‌ కొండేటి… ఈ సినిమాను తెలుగులో తన ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ లో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ‘డి.ఎన్.ఎ.’ టైటిల్ ను తెలుగులో ‘మై బేబీ’గా మార్చారు. ఘనంగా విడుదలకు సంబంధించిన ప్రమోషన్స్ జరిపారు. జూలై 11న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తామన్నారు. అయితే… అనుకున్న సమయంలో తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కాకపోవడంతో… ఈ నెల 18న దీన్ని జనం ముందుకు తీసుకొస్తున్నట్టు ఆ తర్వాత ప్రకటించారు.

అయితే అప్పటికే ఈ సినిమా ను ఐదు ప్రధాన భారతీయ భాషల్లో జియో హాట్ స్టార్ ద్వారా జులై 25న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. అంటే తెలుగు వర్షన్ విడుదలైన వారానికే ఈ సినిమా జియో హాట్ స్టార్ లో వచ్చేస్తుందన్న మాట. డబ్బింగ్ సినిమాకు వారం కంటే థియేట్రికల్ రన్ ఉండదనే నమ్మకం బహుశా నిర్మాతలకు వచ్చి ఉండొచ్చు. ఇక్కడే చిత్రంగా ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తెలుగు వర్షన్ రిలీజ్ జూలై 11 నుండి 18కి పోస్ట్ పోన్ అయినట్టుగానే… ఇప్పుడు జియో హాట్ స్టార్ తన స్ట్రీమింగ్ డేట్ ను జూలై 25 నుండి జూలై 19కి ప్రీ పోన్ చేసేసింది. అంటే… ఇప్పుడు తెలుగు వర్షన్ ‘మై బేబీ’ విడుదలైన రోజే… అర్థరాత్రి నుండి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో దర్శనమిస్తుందన్న మాట.

ఒక తమిళ డబ్బింగ్ మూవీ ఇలా విడుదలై కాగా ఓటీటీలో దర్శనం ఇవ్వడం ఏమిటనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ముందే ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్ తో ఒప్పందం చేసుకుని ఉంటే… తెలుగు హక్కుల్ని వేరొకరికి ఎందుకు అమ్మారు? అనే సందేహం కలుగుతుంది. తెలుగులో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారికి ఈ చిత్ర ప్రధాన నిర్మాతలకు మధ్య ఏమైనా వ్యవహారం బెడిసి కొట్టిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయకపోవడం, ఆ తర్వాత ముందుగా జులై 11 అని చెప్పి ఒకసారి… కాదు… 18న వస్తున్నాం అని మరోసారి వాయిదా వేయడం వెనుక ఏం జరిగిందనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా… జూలై 25వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామని చెప్పి జియో హాట్ స్టార్, హఠాత్తుగా ఓ వారం ముందుకు ఎందుకొచ్చిందనేదీ పలు ఆలోచించాల్సిన అంశమే. ఈ విషయంలోని లొసుగుల్ని తేల్చి చెప్పాల్సింది తమిళ నిర్మాతలు… తెలుగు సినిమా హక్కుల్ని తీసుకున్న వారే! వారి నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఏదేమైనా తెలుగులో ‘డీఎన్ఎ’ను ‘మై బేబీ’గా విడుదల చేద్దామని అనుకున్నవారికి మాత్రం ఈ నిర్ణయం అశనిపాతం లాంటిదే!

చెన్నైలో తెలుగు అబ్బాయి కథ..

చెన్నైలో తెలుగు అబ్బాయి కథ

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో…

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శనివారం సంతోష్‌ శోభన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. పోస్టర్‌లో చెన్నైలో జీవనం కొనసాగిస్తున్న మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా సంతోష్‌ శోభన్‌ కనిపిస్తున్నారు. చెన్నై నగరం బ్యాక్‌డ్రా్‌పలో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం పేర్కొంది.

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్(జడ్జ్) న్యాయమూర్తి గంటా కవితా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరవన్ శర్మ రాశారు. ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా న్యాయ మూర్తి గంటా కవితదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాని ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్యారస్పాండెంట్ వెంకటయ్య ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయులను, తల్లి తండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు పది సంవత్సరాలు కష్టపడి చదివితే విద్యార్థుల జీవితాలు మంచి స్థాయిలో ఉంటారని, విద్యార్థులు మీ సంతకం గురించి వేరేవారు ఎదురుచూతారో అపోయూడు విద్యార్థులు సక్సెస్ అవుతారని అన్నారు. అనంతరం రచయిత భైరవన్ శర్మను న్యాయమూర్తి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహేబూబ్, హరికృష్ణ, ఆకాష్, మహా రుద్రయ్య స్వామి, సంజీవ్ కుమార్, అత్తర్, రాజేందర్, యువరాజ్, మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్.

 ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్…

 

ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు.

ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన యుగంధర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ Academy of Motion Picture Arts and Sciences (AMPAS) లో 2025 క్లాస్‌లో సభ్యుడిగా చేరడంతో అంతర్జాతీయ స్థాయిలోఆయ‌న గుర్తింపును సాధించారు. ఇప్ప‌టివ‌ర‌కు 125కి పైగా చిత్రాల‌కు ప‌ని చేసిన ఆయ‌న త‌న అద్భుత ప్ర‌తిభ‌తో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

1999లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన యుగంధర్ నాటి నుంచి తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగాన్ని కొంత పంత‌లు తొక్కించాడు.
ఆ రంగంలో నిరంతరం నూత‌న‌ ఆవిష్కరణలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీట్ అందించడంలో కీల‌క పాత్ర పోషించాడు. రంగస్థలం చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా తీర్చిదిద్దిన విజువల్స్, అల వైకుంఠపురము, దేవరలో యాక్షన్ సన్నివేశాల విజువ‌ల్స్ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక, దేశ వ్యాప్తంగా యుగంధ‌ర్‌కు మంచి పేరును తీసుకు వ‌చ్చాయి.ఇదిలాఉంటే..
‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్‌ నుంచి కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో పాటు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, దర్శకురాలు పాయల్‌ కపాడియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ మాక్సిమా బసు ఉన్నారు.
ప‌లువురు హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వీరు పాలు పంచుకోనున్నారు. దీంతో అకాడెమీ 2025 క‌మిటీలో యుంధ‌ర్ ఎంపిక‌తో తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వీఎఫ్ఎక్స్ రంగానికి గర్వకారణమ‌ని, మ‌రో సారి భార‌తీయుడి ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఆయ‌న‌ను కొనియాడుతున్నారు.
అన్ని ఇండ‌స్ట్రీల‌ నుంచి ఆయ‌న‌కు ప్ర‌శంస‌ల వెళ్లువెత్తుతున్నాయి.ఇక‌పై మ‌న‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు.

 పెంటాస్టిక్ ఫోర్ తిరిగి వ‌చ్చేశారు తెలుగు ట్రైల‌ర్‌.

 పెంటాస్టిక్ ఫోర్ తిరిగి వ‌చ్చేశారు తెలుగు ట్రైల‌ర్‌…

ప్ర‌పంచ‌వ్యాప్త ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో హాలీవుడ్ చిత్రం అందులోనూ సూప‌ర్ హీరోస్ సినిమా పెంటాస్టిక్ ఫోర్ ఫ‌స్ట్ స్టెప్స్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ప్ర‌పంచ‌వ్యాప్త ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో హాలీవుడ్ చిత్రం అందులోనూ సూప‌ర్ హీరోస్ సినిమా పెంటాస్టిక్ ఫోర్ ఫ‌స్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps) విడుద‌ల‌కు రెడీ అవుతోంది. చివ‌ర‌గా ద‌శాబ్ధం క్రితం వ‌చ్చిన పెంటాస్టిక్ ఫోర్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో లాస్ట్ ఆఫ్ హ‌స్ ఫేమ్‌ పెడ్రో పాస్కల్ (Pedro Pascal), వెనెస్సా కిర్బీ, ఎబోన్ మోస్-బచ్రాచ్, జోసెఫ్ క్విన్, జాన్ మల్కోవిచ్, జూలియా గార్నర్, రాల్ఫ్ ఇనెసన్, పాల్ వాల్టర్ హౌసర్ కీల‌క పాత్ర‌లు పోషించ‌గా మాట్ షక్మాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఈ చిత్రం మ‌రో నెల‌లో జూలై25న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మూవీ ట్రైల‌ర్ తెలుగులోనూ రిలీజ్ చేశారు.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా

 

స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

 

 

 

 

ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2).

చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

అజ‌య్ రావు (Ajay Rao) హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌న్ భ‌ట్ (Pavan Bhat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌కాశ్ బెల‌వాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్‌ అర్చ‌న జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభ‌ర‌ణ (T. S. Nagabharana) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రెండు నెల‌ల క్రితం ఏప్రిల్18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ నాట మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

సుమారు రెంఉ గంట‌ల నిడివితో గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే త‌మ్ముడు పాడు చేశాడ‌ని త‌ల్లి నివేదిత‌ కోర్టుకెళుతుంది.
అయితే అక్క‌డ నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా న్యాయం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ ఓ రోజు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే నిందితుడిని అంద‌రి ముందే గ‌న్‌తో కాల్చి చంపుతుంది.
దాంతో ఆమె జైలే పాల‌వుతుంది.
ఆమె ఒంట‌రి కావ‌డంతో కేసును వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.
అదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద‌గ్గ‌ర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు.
ఈ నేప‌థ్యంలో నివేదిత దుస్తితి చూసి చ‌లించిన భ‌ర‌త్ ఆ కేసు టేక‌ప్ చేస్తాడు.
మ‌రోవైపు త‌న త‌మ్ముడిని చంపిన నివేదిత‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన శిక్ష వేయించాల‌ని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమిన‌ల్ లాయ‌ర్ రాబ‌ర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డ‌బ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు.
దీంతో పెద్ద లాయ‌ర్ కావ‌డంతో ఓట‌మి ఖాయ‌మ‌ని భ‌ర‌త్‌కు హెల్ప్ చేయ‌డానికి చాలా మంది ముందుకు రారు.

ఈ క్ర‌మంలో భ‌ర‌త్ అంత పెద్ద లాయ‌ర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎలాంటి వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి, ఎవ‌రు పై చేయి సాధించారు చివ‌ర‌కు ఓ యువ‌కుడిని చంపి నేరం చేసిన‌ నివేదిత‌ను బ‌య‌ట‌కు ఎలా తీసుకు వ‌చ్చాడ‌నే ఈ సినిమా క‌థ‌.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుంద‌ని ముందే తెలిసిన్న‌ప్ప‌టికీ క‌థ‌ను న‌డిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.

అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిర‌ప‌రాధులను హీరో విడిపిస్తే..

ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అంద‌రి ముందే నేరం చేసిన ఓ మ‌హిళ‌ను హీరో ఏ విధంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడ‌నే పాయింట్ కొత్త‌గా ఉంటుంది.

ఎలాంటి సినిమాటిక్ లిబ‌రిటీస్ తీసుకున్నార‌నే మాట రాకుండా చ‌ట్టంలో ఉన్న పాయింట్ల‌ను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమా మొద‌ట్లో హీరో అన‌వ‌స‌ర‌ ప్రేమ వ్య‌వ‌హారం త‌ప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా సెకండాఫ్ ఫైన‌ల్ హియ‌రింగ్ స‌మ‌యంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బ‌మ్స్ తీసుకు వ‌చ్చేలా ఉంటాయి.

అందుకు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ను వాడుకున్న విధానం, ఏళ్ల‌కు ఏళ్లు కేసులు పెండింగ్, స‌రైన స‌మ‌యానికి న్యాయం ల‌భించ‌క‌పోవ‌డం అనే పాయింట్లు చ‌ర్చించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబంతో క‌లిసి మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా

 

 

 

తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.

 

తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ‘పా పా’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో 236 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాల నుండి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తో మూవీ ప్రదర్శితమౌతున్న సంధ్య థియేటర్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

‘పా… పా’ గురించి నీరజ కోన మాట్లాడుతూ, ‘మేం చిత్ర సీమలోకి ఈ సినిమాతోనే అడుగుపెట్టాం. కవిన్ (Kavin), అపర్ణాదాస్ (Aparna Das) జంటగా నటించిన ఈ సినిమాలో భాగ్యరాజా, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు వారూ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో డబ్ చేశాం. మా నమ్మకం వమ్ము కాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గణేశ్‌ కె బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో చూసిన వారు స్ట్రయిట్ మూవీ చూసిన అనుభూతి కలుగుతోందని చెప్పడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

కెవిన్, అపర్ణా దాస్ పాత్రల మధ్య కెమిస్ట్రీ, కాన్ ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు’ అని అన్నారు. ‘పా… పా…’ మూవీ విజయం అందించిన స్ఫూర్తితో త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించాలనుకుంటున్నామని ఆమె అన్నారు. జెన్ మార్టిన్ సంగీతానికి, ఎలిల్ అరసు సినిమాటోగ్రఫీకి కూడా మంచి పేరు వచ్చిందని ఆమె చెప్పారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం. మూవీస్ ద్వారా విడుదల చేసిన ఎమ్. అచ్చిరెడ్డి, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ..

 

 

నేటిధాత్రి:

 

 

 

 

సుప్రీతా నాయుడు సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి.

సుప్రీతా నాయుడు (Supritha Bandaru Naidu) సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి. ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఒక సినిమా చేయ‌కున్నా బ‌డా హీరోయిన్లను త‌ల‌న్నేలా అందాల‌తో హోయ‌లు బోతూ త‌న ఫ్యాన్స్‌కు నిత్యం త‌నివితీరా ఫుల్ మీల్స్ పెడుతోంది.

 

స‌మ‌యం దొరికితే విదేశాలు, బీచులు, ప‌బ్‌లు తిరుగుతూ అందాల‌ను వ‌డ్డిస్తోంది. తాజాగా త‌ను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న ఆమె నా ఇష్ట ప్ర‌కారమే నా డ్రెస్సింగ్ ఉంటుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.

 

అది మ‌ర‌కువ‌కు ముందే తాజాగా త‌న ఎద అందాల‌న్నింటినా ఒపెన్‌గా ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రోసారి చూసే వారికి క‌నుల వింతు చేసింది.

 

ఇప్పుడు ఈ పొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌..

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌.. అదిరిపోయే హిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 

 

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేసింది.

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ (Jaat ). తెలుగు అగ్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించడం విశేషం. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌న్నీ డియోల్ (Sunny Deol) హీరోగా మ‌రో స్టార్ ర‌ణ‌దీప్ హుడా (Randeep Hooda) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. రెజీనా (Regina Cassandra), స‌యామి ఖేర్ (Saiyami Kher), వినీత్ ఉమార్ సింగ్ (Vineet Kumar Singh), జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్మ‌కృష్ణ‌, బిగ్‌బాస్ దివి ఇత‌ర‌ పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఇప్పుడీ సినిమా ముందుగా అనుకున్న టైం క‌న్నా ఓ రోజు ముందుగాను ఈ రోజు గురువారం (జూన్ 6) నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రణతుంగ , అతని సోదరుడు శ్రీలంక నుంచి భారీ నిధిని దోచుకుని పారిపోయి ఇండియాకు వ‌చ్చేస్తారు. ఆపై ఏపీలోని మోటుప‌ల్లిని స్థావ‌రంగా చేసుకుని దాని ప‌రిస‌ర గ్రామాల‌ను త‌మ ఆదీనంలో ఉంచుకుని నియంత‌లా వ్య‌వ‌రిహిస్తుంటాడు. అయితే ఓ రోజు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ వెళ్తున్న రైలు ఆ ఊరి స‌మీపంలో ఆగిపోతుంది. దీంతో ద‌గ్గ‌ర్లో ఉన్న హోట‌ల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తుండ‌గా లోక‌ల్ రౌడీలు హోట‌ల్ పై దౌర్జ‌న్యం చేస్తూ హీరోను డిస్ట్ర‌బ్ చేస్తారు. దీంతో కోపొద్రిక్తుడైన బ్రిగేడియర్ వారి ప‌ని ప‌డ‌తాడు. ఆపై అనుకోకుండా ఒక‌రి త‌ర్వాత మ‌రొక గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వ‌డం వారంద‌రిని చిత‌క్కొట్టుకుంటూ చివ‌ర‌కు ప్ర‌దాన విల‌న్ రణ‌తుంగ వ‌ర‌కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరి అకృత్యాల గురించి హీరోకు తెలియ‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఇంత‌కు ఆ ఊర్లో ఉన్న స‌మ‌స్య‌ ఏంటి, హీరో ఆ క్రూర‌మైన విల‌న్ల‌ను ఒంట‌రిగా ఎలా ఎదిరించాడ‌నేదే ఈ మూవీ.

ఇప్ప‌టికే తెలుగులో వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చిన సినిమాల త‌ర‌హాలోనే ఈ సినిమా సాగుతుంది. అయితే స్క్రీన్ ప్లే , ఎలివేష‌న్లు, ట్రీల్‌మెంట్ అంతా ఓ రేంజ్‌లో ఉంటూ సూప‌ర్ హై ఇస్తుంది. మ‌నం పాత క‌థే చూస్తున్నాం అని తెలిసినా సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. పైగా ఇది హిందీ సినిమా అయిన‌ప్ప‌టికీ పూర్తిగా తెలుగు ప్రాంతం నేప‌థ్యంలో, ఇక్క‌డి న‌టులే క‌నిపిస్తూ మ‌నం ఓ బాలీవుడ్ సినిమా చూస్తున్నామ‌నే ఫీల్ కూడా రాదు. ప్ర‌స్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో హిందీ, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డ‌బ్బింగ్ కూడా స్ట్రెయిట్ సినిమాలానే ఉంది. థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు, యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఈ మూవీని మిస్ చేయ‌వ‌ద్దు. ముఖ్యంగా హీరో, విల‌న్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌.

తెలుగు విభాగంలో కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్.

తెలుగు విభాగంలో
కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్
హైదరాబాద్ నేటిధాత్రి:

 

ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ తెలుగు విభాగంలో వరంగల్ జిల్లా కథా సాహిత్యం పరిశీలన అనే అంశం పైన డాక్టర్ పూర్ణ ప్రజ్ఞ చంద్రశేఖర రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందున పీహెచ్డీ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం గుడిపహాడ్ అనే గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సమ్మయ్య సారమ్మ అనే దంపతులకు జన్మించిన చివరి సంతానం ఓదేలు శారీర వైకల్యం కలిగిన ఓదేలు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అన్నత విద్యనభ్యసించి డాక్టర్ పట్టాను పొందారు.ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తిచేసి, హై స్కూల్ విద్యను మొగుళ్లపల్లి మండలం లో ఉన్న జెడ్ పి పి ఎస్ ఎస్ మొగుల్లపల్లి హైస్కూల్లో చదివి, ఇంటర్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల స్టేషను ఘన్ పూర్ లో, కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎ స్పెషల్ తెలుగు చదివి ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం. ఎ తెలుగులో, ఎం.ఎ అర్థశాస్త్రంలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ చేసి పీహెచ్డీ లో ప్రవేశం పొంది వరంగల్ జిల్లా కథా -సాహిత్యం పరిశీలన అంపశయ్య నవీన్ రామచంద్రమౌళి గారి కథల పైన పరిశోధన చేసి పీహెచ్డీ పట్టానుపొందారు. పీహెచ్డీ పట్టాను పొందిన ఓదేలును మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ,వ్యాఖ్యాత, డా బి. వెంకట్ కవి, కుటుంబసభ్యులు, గురుకుల అధ్యాపకులు, మిత్రులు, కవులు, కళాకారులు, తదితరులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం.

తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం

 

మాల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 29:

 

మాల్కాజిగిరి నియోజికవర్గం, మౌలాలీ డివిజన్‌లో బత్తిని నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పాత సఫిల్‌గూడ దర్గా మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు రామ్ మోహన్పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని నరసింహ గౌడ్, చింతల నరేష్ ముదిరాజ్, ప్రణయ్ చంద్ర, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డా. కృష్ణ, జీలా రాములు, రమణయ్య, పరమేశ్, మౌలాలీ, అన్వేష్, అవినాష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .

ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .

1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .

ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version