కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ
చర్ల నేటిదాత్రి:
రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకలు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నల్లపూ దుర్గాప్రసాద్ ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచి కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు భద్రాచలం అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు బోరా పెద్దిరెడ్డి సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి వందే నరసింహమూర్తి గుండపూడి భాస్కరరావు విజయ నాయుడు ఆలం ఈశ్వర్ పటేల్ వెంకటేశ్వర్లు బోళ్ల వినోద్ మునిగల వెంకన్న సాగర్ పవన్ సిద్ది సురేష్ కర్రీ సంతోషం మేడి రమేష్ తడికల ఏసుబాబు జోగారావు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నరు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ ల ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులతో రక్తదానాన్ని చేయించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ తన కర్తవ్యంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, నెక్కొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోంత రంజిత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్, చెన్నబోయిన సాయి శ్రావణ్ కుమార్, కోలుగురి కర్ణాకర్, జెట్టి ప్రశాంత్, జెట్టి రాజేంద్రప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ
1,10,322 మంది జిల్లా రైతులకు లబ్ది
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని అన్నదాతలకు రైతు భరోసా కింద మూడు రోజుల్లో రూ. 99.5 కోట్లకు పైగా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ వర్ష కాలం సీజన్ సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రోజు వరకు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 1,10,322 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906= 00 డబ్బులు జమ అయ్యాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట నేటిధాత్రి:
యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు
అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుని రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా కీర్తించడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు ప్రణాళికలు అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కళ సీనియర్ నాయకులు సమ్మయ్య, లాడెన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుర్మ సురేందర్, బత్తుల వేణు, నగేష్ రాజేష్ నాగులు ప్రేమ్ సాగర్ మహిళా నాయకురాళ్ళు పుష్ప, సునీత,శారద, దీప తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు
ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో బోర్ వేస్తుండగా ఆపివేసిన దళితులు..
100 కు దయల్ చేసిన దళితులు.. బోర్ వెల్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
గీసుకొండ మండలంలోని గొర్రెకుంట దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 భూమిలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టే క్రమంలో వెంటనే గ్రహించిన (ఎస్సి – సి) మాల దళిత కులస్తులు హైకోర్టును ఆశ్రయించారు.కాగా పిర్యాదులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దళితులకు కాకుండా మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని స్టే ఆర్డర్ జారీచేసింది.ఐనప్పటికీ హైకోర్టు ఆర్థర్ ను ధిక్కరిస్తూ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సదరు కాంట్రాక్టర్ గురువారం పనులను ప్రారంభించేందుకు గాను ముందుగా రెండు బోర్ వెల్ వాహనాలతో బోర్లు వేయడం ప్రారంభించారు. వెంటనే గమనించిన దళిత మాల కులస్తులు పోలీస్ 100 కు సమాచారం ఇచ్చి పనులను ఆపే ప్రయత్నం చేశారు. దళితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు
Dalit land.
బోర్ వెల్ వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గొర్రెకుంట దళిత మాల కులస్తులు బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ లు మాట్లాడుతూ గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామంలో గల సర్వే నెంబర్ 55 భూమిలో గత డెబ్బై ఏండ్ల క్రితం నుండి మా దళితులు వ్యవసాయం సాగుచేసుకునేవారని అన్నారు.కాల క్రమేణా మూడు దశాబ్దాలకు నిరుపేదలమైన మా దళితమాల కులస్తులకు పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అదే సర్వే నెంబర్ 55 భూమిలో దళితుల అవాసాల కోసం ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవడానికి ఆనాటి అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు.మాల దళితులకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు చెప్పటాలని కొందరు వ్యక్తులు పన్నాగాలు పన్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే భూమిని అక్రమంగా స్వాదీనం చేసుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టారని అవేదన వ్యక్తం చేశారు.మాల దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను సంబంధిత విద్యుత్ సంస్థకు,అధికారులకు అందించామని ఐనప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ టీఎస్ 08 ఇ.పి 1974 , టీఎస్ 16 ఇపి 7413 గల బోర్ వెల్ వాహనాలతో అక్రమంగా బోర్లు వేస్తున్నారని ఆరోపించారు.వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 100 కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోర్ వెల్ పనులను ఆపివేసి వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారని బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ తెలిపారు.కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎంపీడీసీఎల్ ఎస్ఈ లకు పిర్యాదులు చేయనున్నట్లు అలాగే గీసుకొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 గల ప్రభుత్వ భూమిని దళితులకే కేటాయించాలని
Dalit land.
ఈ సందర్భంగా బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్,మద్దెల క్రాంతి కుమార్,బందెల రణధీర్,బందెల అరుణ్,బందెల రాజశేఖర్,బందెల వంశీ,బందెల రమేష్,సిరిమిల్ల శరత్ చంద్ర, కొత్త శివశంకర్ పలువురు దళితులు కోరారు.
ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…
వామపక్ష పార్టీల డిమాండ్
నేటి ధాత్ర:
మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.
ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని 14వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని, దేశానికి విశ్వసనీయత కలిగి, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు పులి చేరి రాధాకృష్ణ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు వడ్లకొండ తిరుపతి. తోట శ్రీను. ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ తదితరులు పాల్గొన్నారు.
AICC అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది
నేటి ధాత్రి:
ఇల్లందకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలోశ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకం చేయించడం జరిగింది తర్వాత మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రాయ్ బరేలి ఎంపి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తూ వారి హక్కులను మరియు వారి స్వేచ్ఛ కోసం దేశంలోని సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి భారత్ జోడో న్యాయ యాత్ర లో భాగంగా దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తానే విని వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కీర్తిని ముందుకు తీసుకువెళ్లి పార్టీకి మరియు దేశానికి ఎనలేని సేవలు చేస్తున్నాడు రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా మనం చూడబోతున్నామని తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరియు కచ్చితంగా వారు ప్రధాని అయ్యి భారతదేశానికి మరెన్నో సేవలు చేయాలని పెద్ది కుమార్ గారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగ్లీ రామారావు కనుమల సంపత్ గూడెపు సారంగపాణి కనుమల్ల రామకృష్ణ వంగ రామకృష్ణ మారేపల్లి ప్రశాంత్ గంగారం మహేష్ గూడెపు ఓదెలు దేవస్థానం ధర్మకర్తలు మూడెత్తుల మల్లేష్ గొడిశాల పరమేశ్వర్ ఎడ్ల కిషన్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు మేడద తిరుపతిరెడ్డి గోరుకుంట్ల స్వామి మరి వీరారెడ్డి భోగం సాయిరాం బండి మల్లయ్య మిట్ట మోహన్ రెడ్డి మూడెడ్ల రమేష్ తోడేటి కిషన్ కొండాల్ రెడ్డి బుర్ర రమేష్ రావుల రాజబాబు ఆరే రమేష్ రెడ్డి జక్కు కుమారస్వామి తాడెం దిలీప్ మారేపల్లి రమేష్ మారేపల్లి వంశీ పెద్ది అభిలాష్ గంధం రవీందర్ మంకు ఐలయ్య రెడ్డి సారంగం డిష్ రాజు గట్టి శేఖర్ ఉప్పుల ఆయిల్ రెడ్డి ఉప్పుల మల్లారెడ్డి దాసరి తిరుపతిరెడ్డి లింగారావు వేముల ప్రవీణ్ బుద్ధార్థి ప్రశాంత్ జిల్లెల్ల జలంధర్ రెడ్డి సరిగుమ్ముల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’.
సుహాస్ ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). బాబు మోహన్, శ్రతు, తాళ్ళూరి రామేశ్వరి ఇందులో కీలక పాత్రలు పోసించారు.
అని ఐ.వి.శశి దర్శకత్వంలో ఈ సినిమా రాధికా లావు (Radhika Lavu) నిర్మించారు.
వసంత్ మరింగంటి ఈ మూవీకి రచన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీని వివిధ భాషల్లో ప్రైమ్ వీడియో (Prime Video) జూలై 4న స్ట్రీమింగ్ చేయబోతోంది.
తాజాగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు సుహాస్, కీర్తి సురేశ్ కూడా పాల్గొన్నారు.
చిట్టి జయపురం అనే చిన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది.
ఆవూరికి గ్రామాధికారిగా అపూర్వ (కీర్తి సురేశ్) ఎంపిక అవుతోంది.
అయితే ఓ మహిళ ఆ పదవిని చేపట్టడాన్ని ఊరిలో కొందరు సహించలేకుండా ఉంటారు.
ఆమెను ఎలాగైనా ఇరకాటాన పెట్టాలనుకుంటారు.
ఊరి శ్మశానంలో మనుషులను పూడ్చడానికి చోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటి సమయంలో ఏం చేయాలో పాలు పోక ఆమె కాటికాపరి అయిన చిన్న (సుహాస్) సహాయం కోరుతుంది.
శ్మశానంలో స్లాట్ బుక్ చేసుకోవడానికి లక్కీ డ్రా తీయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో వ్యంగాత్మకంగా ఈ మూవీ సాగుతుంది.
‘ఉప్పుకప్పురంబు’లో తాను పోషించిన పాత్ర గత చిత్రాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని, అవగాహనలేని మహిళ పాత్రే అయినా ఆమె ఆదర్శాన్ని పాటించే విషయంలో దృఢంగా ఉంటుందని కీర్తి సురేశ్ తెలిపింది.
గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన
ఈ సినిమాలో చక్కని హాస్యానికి చోటు దక్కిందని ఆమె అన్నారు.
ఇది సందేశం ఇచ్చే చిత్రం కాదని, గ్రామీణ జీవితానికి అద్దం పట్టే సినిమా అని సుహాస్ అన్నారు.
చెరుకు రైతులను ఆదుకోవాలిటిఎస్ఎస్ సిసిడిసి(ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 25000 ల ఎకరాల్లో రైతులు చేరుకును పండిస్తారు సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది.నియోజకవర్గ చెరుకు రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి సరైన కర్మాగారం లేకుండా,సరైన ధర లేకుండా ఇబ్బందులకు గురి అవుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొత్తూర్ బి. చెరుకు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడిపిస్తాం అని వాగ్దానాలు ఇచ్చారు కానీ 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దాని ఊసే లేదు. రాయికోడ్ మండలం మాటూర్ దగ్గర కొత్తగా చక్కెర కర్మాగారం ప్రారంభించారు అయినా ఆ కర్మాగారం కూడా గత సంవత్సరం అంతంత మాత్రమే నడిచింది రైతులు ఇబ్బందులకు గురి అయినారు దాని సామర్థ్యం 3 లక్షల 25000 ల మెట్రిక్ టన్నులు దాని పరిధిలో 6 మండలాలను మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది అందులో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు లేవు అందులో అత్యధిక చెరుకు పండించేది జహీరాబాద్,మొగుడంపల్లి మండలాలే చెరుకు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొత్తూర్.బి చెరుకు కర్మాగారాన్ని ప్రారంభించాలి/మాటూర్ చెరుకు కర్మాగారం పరిధిలోకి ఈ రెండు మండలాలను చేర్చాలి,చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, శ్రీనివాస్ రెడ్డి,లు పాల్గొన్నారు.
‘పెద్ది’ సినిమాలో ఓ కీలక పాత్రలో ఓటిటి సెన్సేషన్ మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ (మున్నా భయ్యా క్యారెక్టర్ ఫేం – divyenndu) నటిస్తున్నారు. గురువారం మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
గ్లోబర్స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ 9janhvi kapoor) జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi) బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో ఓటిటి సెన్సేషన్ మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా క్యారెక్టర్ ఫేం దివ్యేందు శర్మ (divyenndu) నటిస్తున్నారు. గురువారం మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో తాను క్రికెట్ బాల్ పట్టుకొని మంచి మాస్ రగ్డ్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన రాంబుజ్జి అనే పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్థి సినిమాస్ సంస్థ నిరిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.
మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.
ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.
అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.
ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన
ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.
‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…
చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.
ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.
అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.
మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.
ఇదో రేర్ ఫీట్.
ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…
తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.
అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…
ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.
ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.
ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..
నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.
నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.
అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్దమవుతోంది.
చాలా రోజుల తర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్కు సిద్ధమైంది. అదీ కూడా అరుదుగా వచ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్లో వస్తుండడం గమనార్హం. గతంలో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను అందించిన మేకర్స్ ఈ సిరీస్ను రూపొందించగా తాజాగా దీని ట్రైలర్ విడుదల చేశారు.
గతంలో డిస్నీలో వచ్చిన మిస్ ఫర్ఫెక్ట్ సిరీస్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru), చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వహించారు. జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.
మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ.. మోహన్లాల్ ప్రత్యేక పూజలు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురైన వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ కథనాలను మమ్ముటి టీమ్ కొట్టి పారేసింది. ‘‘మమ్ముట్టి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. రంజాన్ కారణంగా ఆయన షూట్స్ నుంచి బ్రేక్ తీసుకొని వెకేషన్కు వెళ్లారు. విరామం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మోహన్లాల్తో కలిసి మహేశ్ నారాయణన్ (Mahesh Narayan) చిత్రంలో పాల్గొనున్నారు’’ అని టీమ్ వెల్లడించింది. దీనిపై ఆయన స్నేహితుడు, ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఖండించారు. మమ్ముట్టి ఆరోగ్యం బాగా లేదన్నమాట వాస్తవమే కానీ.. అది చాలా చిన్న సమస్య అని ఆయన క్లారిటీ ఇచ్చారు. (Mammootty health Update)
‘‘మేమిద్దరం చాలాకాలంగా నుంచి స్నేహితులం. కానీ, మా వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కొన్ని రోజుల నుంచి ఆ వివరాల గురించి కూడా పంచుకుంటున్నాం. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. కొన్ని గంటల క్రితమే ఆయనతో ఫోన్లో మాట్లాడాను’’ అని మమ్ముట్టిపై వస్తున్న రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. అంతే కాదు మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోహన్లాల్ తెలిపారు. ఇలాంటి సమస్యలు అందరికీ వస్తాయని చెప్పారు.
తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.
తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ‘పా పా’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో 236 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాల నుండి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తో మూవీ ప్రదర్శితమౌతున్న సంధ్య థియేటర్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
‘పా… పా’ గురించి నీరజ కోన మాట్లాడుతూ, ‘మేం చిత్ర సీమలోకి ఈ సినిమాతోనే అడుగుపెట్టాం. కవిన్ (Kavin), అపర్ణాదాస్ (Aparna Das) జంటగా నటించిన ఈ సినిమాలో భాగ్యరాజా, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు వారూ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో డబ్ చేశాం. మా నమ్మకం వమ్ము కాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గణేశ్ కె బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో చూసిన వారు స్ట్రయిట్ మూవీ చూసిన అనుభూతి కలుగుతోందని చెప్పడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
కెవిన్, అపర్ణా దాస్ పాత్రల మధ్య కెమిస్ట్రీ, కాన్ ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు’ అని అన్నారు. ‘పా… పా…’ మూవీ విజయం అందించిన స్ఫూర్తితో త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించాలనుకుంటున్నామని ఆమె అన్నారు. జెన్ మార్టిన్ సంగీతానికి, ఎలిల్ అరసు సినిమాటోగ్రఫీకి కూడా మంచి పేరు వచ్చిందని ఆమె చెప్పారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం. మూవీస్ ద్వారా విడుదల చేసిన ఎమ్. అచ్చిరెడ్డి, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం
పరకాల నేటిధాత్రి:
గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు.
పరకాల నేటిధాత్రి 2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరకాల నుండి జి రవితేజ 453 మార్కులు మరియు జడ్పి.హెచ్ఎస్ వెల్లంపల్లి నుండి చిన్నారి 370 మార్కులు సాధించిన సందర్బంగా విద్యార్థులకు పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు తమ తల్లి తండ్రి పెద్ది బాలమణి చంద్రమౌళి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉపాధ్యాయునిగా పని చేస్తూ మరణించినందున.
ఈ ఉద్యోగం వచ్చింది అని తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా,విద్యార్థులకు తన స్థాయికి తగిన విధంగా సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల విద్యాశాఖ అధికారి ఎస్ రమాదేవి,మండల నోడల్ అధికారి నామిని సాంబయ్య కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మధు,సిహెచ్ సురేందర్ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని అనునిత్యం విద్యాశాఖకు వెన్నుదన్నుగా నిలిచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీవోకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ
మల్లాపూర్ జూన్ 19 నేటి దాత్రి
ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటాం యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాలజిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ :బాధిత కుటుంబానికి 53116/- రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన యాదవ సంఘనాయకులు జగిత్యాల జిల్లాలో ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి యాదవులందరం అండగా ఉంటామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు.. మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాధం నాగరాజు యాదవ్ ఇటీవల ప్రమాద వసాత్తు కరెంట్ షాక్ తో మరణించగా గొర్రెపల్లిలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ సభ్యులు (53116/-) యాభై మూడు వేల ఒక్క వంద పదహారు రూపాయల (నగదు) ఆర్థిక సహాయం అందించారు.. మల్లేష్ యాదవ్ మరియు యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ వారి కూతురిని 1వ తరగతి నుండి పదవ తరగతి వరకు కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాల (ప్రైవేట్ హాస్టల్ వసతితో సహా)లో ఉచితంగా చదివించడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. యాదవ సంఘ నాయకులు తొట్ల చిన్నయ్య, తిప్పనవేని రవి, చెరుకు సుభాష్, గుడిసె జితేందర్, మ్యాదరవేని రామాంజనేయులు, ముక్కెర లింబాద్రి, అంకం శంకర్, గుండెల నాగేష్, యాదవనేని రాజలింగం అలిశెట్టి భుచ్చి రాములు, పన్నాల హరీష్,కొత్తూరి సురేష్,గంగుల శ్రీనివాస్, అరికంటి సాగర్, చెండి గంగారాం, పంతంగి వెంకటేష్,అల్లే చంద్రయ్య,కలసాని లక్ష్మణ్, బాస రంజిత్,దండికే శంకర్, గెల్లె అంజయ్య, రాజం, రాకేష్,మల్లయ్య, గంగాధర్, మల్లేష్,
గురువారం కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ.. – కార్పొరేట్ విద్యతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. – సామర్థ్యాలు లేని బస్సులను సీజ్ చేసి విద్యార్థుల జీవితాలను ప్రాణాలను కాపాడాలి. – విద్యను వ్యాపారంగా చేసి పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలు తనిఖీలు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. – తెలంగాణ రాష్ట్రంలో నేటికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటు.తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య పేరుతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మలచుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాలలోనేపుస్తకాలను ,యూనిఫామ్ లను అమ్ముతూ డబ్బులను దండిగా సంపాదిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు పాటించే విధంగా తరగతి గదుల వసతులు సరిగా లేని పాఠశాలలను రద్దు చేయాలని గణేష్ అన్నారు.విద్యను బోధించే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతను చూడాలి, పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి, సామర్థ్యం లేని బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేసి ఆ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు.విద్యారంగం పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి.అదేవిధంగా బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి.నేడు ఒక్కొక్క కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు పెండింగ్ పడడంతో విద్యా వ్యవస్థ నాశనం అయిందని.అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి కళాశాలలో దిగజారాయని ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యావ్యవస్థను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గణేష్ కోరారు.గురుకుల సామర్ధ్యాలు పెంచి, మంచి నాణ్యమైన భోజనాన్ని వసతులను కల్పించాలని, గురుకులల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మనోధైర్యాన్ని నింపాలని దారమోని గణేష్ డిమాండ్ చేశారు.వృత్తి విద్య పేరుతో నైపుణ్యాన్ని నింపుతామని శంకుస్థాపన చేసి ఇప్పటికీ మొదలు కాకపోవడం ఏంటని దారమోని గణేష్ ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని వెంటనే పాఠశాలలు తనిఖీలు నిర్వహించాలని లేకుంటే తెలంగాణ జాగృతి,BRSV పక్షాన విద్యారంగం పైన దీక్షలు చేపడతామని దారమోని గణేష్ ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, పెరుమాళ్ళ కృష్ణ , పరశురాములు, సైదులు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.