ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ.

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ

మల్లాపూర్ జూన్ 19 నేటి దాత్రి

 

 

 

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటాం
యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాలజిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్
:బాధిత కుటుంబానికి 53116/- రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన యాదవ సంఘనాయకులు
జగిత్యాల జిల్లాలో ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి యాదవులందరం అండగా ఉంటామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాధం నాగరాజు యాదవ్ ఇటీవల ప్రమాద వసాత్తు కరెంట్ షాక్ తో మరణించగా గొర్రెపల్లిలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ సభ్యులు (53116/-) యాభై మూడు వేల ఒక్క వంద పదహారు రూపాయల (నగదు) ఆర్థిక సహాయం అందించారు..
మల్లేష్ యాదవ్ మరియు యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ
వారి కూతురిని 1వ తరగతి నుండి పదవ తరగతి వరకు కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాల (ప్రైవేట్ హాస్టల్ వసతితో సహా)లో ఉచితంగా చదివించడానికి సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో..
యాదవ సంఘ నాయకులు
తొట్ల చిన్నయ్య, తిప్పనవేని రవి, చెరుకు సుభాష్, గుడిసె జితేందర్, మ్యాదరవేని రామాంజనేయులు, ముక్కెర లింబాద్రి, అంకం శంకర్, గుండెల నాగేష్, యాదవనేని రాజలింగం అలిశెట్టి భుచ్చి రాములు, పన్నాల హరీష్,కొత్తూరి సురేష్,గంగుల శ్రీనివాస్, అరికంటి సాగర్, చెండి గంగారాం, పంతంగి వెంకటేష్,అల్లే చంద్రయ్య,కలసాని లక్ష్మణ్, బాస రంజిత్,దండికే శంకర్, గెల్లె అంజయ్య, రాజం, రాకేష్,మల్లయ్య, గంగాధర్, మల్లేష్,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version