బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు.

బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు

విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు తోచని స్థితిలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సరైన విద్య ప్రమాణాలు లేవని మరియు భోజనం వసతి సౌకర్యాలు అంతంతే నని, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద సీటు రావడంతో అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని మొదట మురిపించిందని ఇలా పాఠశాల యజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు మానసిక అందోలోనాలతో కృంగిపోతున్నారని వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు-కె. యూ విద్యార్థి సంఘాలు

నేటిధాత్రి :హన్మకొండ

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటని కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు అన్నారు.

శనివారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్న విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డా.సయ్యద్ వలి ఉల ఖాద్రి(ఏ.ఐ.వై.ఫ్)దుర్గం సారయ్య (పి.డి.యస్. యూ) గుగులోతు రాజు నాయక్( గిరిజన శక్తి) మెడ రంజిత్ (టి.జి.వి.పి) మట్టెడ కుమార్ (పరిశోధక నాయకులు) కన్నం సునీల్ (టి.యస్. ప్) దుప్పటి కిషోర్ కడాపాక రాజేందర్ ,బొట్ల మనోహర్ (బి.యస్.ఫ్) హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందాలని మంచి ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం చేసింది దానిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించడానికి యూనివర్సిటీని సంప్రదిస్తే యూనివర్సిటీ అధికారులు పోలీస్ క్యాంపు ని తీసేసి ఆ క్యాంపు స్థలాన్ని కేటాయించారని

ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు స్వాగతించాయని కానీ కొన్ని విద్యార్థి సంఘాలు సొంత రాజకీయ ఎజెండా తో కుట్రలతో దీన్ని అడ్డుకోవాలని చుస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందుతుందని నగరంలో మంచి వాతావరణం లో విద్య అందే అవకాశముంటుందని యూనివర్సిటీ పరిధిలో పెడితే రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటుందని కావున వెంటనే స్కూలు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము.

అదే విధంగా కొందరు కావలసికొని కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం స్కూలు నిర్మాణం చేపట్టి స్కూల్ ప్రారంభించాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో పి.డి. యస్. యూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ సౌరవ్ రాహుల్ వర్ధన్ శివ రెడ్డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

భూపాలపల్లి మండలం: గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమెతల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

 

గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన.

చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది

అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన.

చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

నర్సంపేట నేటిధాత్రి:

గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ అధికారి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వడ్డెర కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బారుల వసతి గృహంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నది పేర్కొన్నారు.గిరిజన విద్యార్థులకు అనుగుణంగా అధికారులు స్పందించి గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమం పాఠశాలగా అప్ గ్రేడ్ చేసి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాములు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో అధునాతనమైన అంగులతో విశాలవంతమైన వాతావరణంలో 30 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా ఆ నిధులతో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణను పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ ప్రాజెక్టు సాధించడంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి కృషి ప్రాధానంగా నిలిచిందని పలువురు ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం విద్యారంగ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయని,నియోజకవర్గ పిల్లలు ఇక మెట్రో స్థాయి వసతులతో కూడిన పాఠశాలలో చదివే అవకాశం పొందనున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ పాఠశాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను సులభంగా పొందడం విశేషమని, నియోజకవర్గ భవిష్యత్ తరాల విద్యాభివృద్ధికి బలమైన పునాది కానుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే.

బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే

నర్సంపేట నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు ఎంఎస్ఎం ఈ డే 2025 ఉద్యమి భారత్ కార్యక్రమం పాఠశాల ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వాలు సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ద్రవ్యల్బణం తగ్గి ఆర్థికంగా ఎదుగుతారని దీంతో ఆత్మనిర్భర్ భారత లక్ష్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ రంగాన్ని మరింత బలంగా పోటీ తత్వంతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా దృష్టి సారించాలని కోరారు. ప్రతి విద్యార్థి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి ,రామ్మూర్తి ,రాజేష్ ,లక్ష్మణ్ మరియు ఎన్.సి.సి క్యాడెట్లు పాల్గొన్నారు.

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలల పురోగతికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు
మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వాటిని ఎంఈఓ కార్యాలయం లో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వినతి పత్రంను ఎంఈఓ అందుబాటులో లేనందున కంప్యూటర్ ఆపరేటర్ మామి డి రజిత పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అంద జేశారు.

 

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో గోడలకు పెచ్చులు ఊడిపోయి శిధిలా వస్థకు చేరుకున్నాయి వాటిని పునర్మించాలని మరియు కంప్యూటర్ క్లాసులు చెప్పా లని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకోవ డానికి ఆటస్థలం ఏర్పాటు చేయాలి కోతుల సమస్యల నుండి విముక్తి కల్పించాలి కంప్యూటర్ క్లాస్ లను నేర్పిం చాలి మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ బాల,బాలికల పాఠశాలలు ఎందుకని విద్యా ర్థుల సంఖ్య తక్కువ ఉన్నం దున ఒకే దగ్గర తరగతులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ ,బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పురాణం చంద్రశేఖర్, బిఆర్ ఎస్వి జిల్లా నాయకులు అంబాటి అఖిల్ పాల్గొన్నారు

చదివిన పాఠశాలపై మమకారంతో.!

చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి

-తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య దంపతుల కుమార్తె నాగరాణి నిరుపేద కుటుంబంలో పుట్టింది. పేదరికం చదువుకు అడ్డం కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. చిన్నప్పటినుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యనభ్యసించింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుమారునికి అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే క్రమశిక్షణకు నిలయాలని, మనం కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిరిపూరి నాగరాణి నిరూపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మిరిపూరి నాగరాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటపల్లి మహేష్, ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, సునీతా దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ
మెట్ పల్లి జూన్ 25 నేటి ధాత్రి:

 

మెట్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల విట్టంపేట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్లు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సన్నీ, రవితేజ సతీష్ లు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్పీ విక్రమ్ కుమార్ ఉపాధ్యాయ బృందం ఎస్ భానుతేజ, లక్షణ, సుచిత లు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

— బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి లు ఉన్నారు.

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు.

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం గురువారం క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఎంఈవో లింగాల కుమారస్వామి తెలిపారు. మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పలు గ్రామాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీలు నిర్వహించి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో పోటీలు నిర్వహించమన్నారు. మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, సంతోష్. సుదర్శన్, అజయ్, శ్రావణి, ఉపాధ్యాయులు అంకుష్, మహేష్, ఎమ్మార్సీ సిబ్బంది వేణు, వసంత, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు..

*అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

*వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

*వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

 

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

 

“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు…

 

వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానన్నారు. స్థానిక దళిత, గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు. గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం
ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

18 న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

Shine Junior Colleges

 

 

చిట్యాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు బుధవారం 18వ తేదీన చిట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కన్వీనర్ కొడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలు) చిట్యాల మండలంలో ఉన్న బాల బాలికలు క్రీడా పాఠశాలలో 4వ తరగతి అడ్మిషన్ కొరకు 1 – 9 – 2016 నుండి 31 – 08 – 2017 మధ్యలో జన్మించిన బాల బాలికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలలో అడ్మిషన్ కొరకు చిట్యాల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని తెలపడం జరిగింది ఇది క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ క్రీడా పాఠశాలల అడ్మిషన్ల ఎంపికలో షటిల్ రన్, మెడిసిన్ బాల్, వర్టికల్ జంప్, 800 మీటర్ల పరుగు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎత్తు మరియు బరువు విభాగాలలో పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తామని ఈ మండల స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల కోఆర్డినేటర్ సూదం సాంబమూర్తి ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్లు తీసుక రావాలి వివరాల కొరకు 9966992295 నెంబర్ లో సంప్రదించాలన్నారు

పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం-డీఈవో వాసంతి

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారినీ వాసంతి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి టెంకాయ కొట్టి అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య పండితులు మంత్రాలు చదవగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.డి ఈ ఓ విద్యార్థులను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయడం జరిగింది.అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,భీముడి లక్ష్మి,తాళ్లపల్లి మంజుల, శీలం సరిత విద్యార్థులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డిఇఓ అక్షరం అంటే నశించనీదని,అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వీటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం అని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్య లభిస్తుందని,మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేపించాలని, చర్లపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని డిఇఓ మేడం అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కున్సోతు హనుమంతరావు సిఎంఓ బద్దం బాల్ రెడ్డి,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమా,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజ్ కుమార్,మేకల సత్యపాల్,ఐ ఆర్ టి రమేష్,అంగన్వాడీ టీచర్స్ బీమడి లక్ష్మీ, నందిపాటి సంధ్యా,తాళ్లపల్లి మంజుల,శీలం సరిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version