బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం.

సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి

నేటిధాత్రి:

 

 

 

లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచిందని దీనితో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఎలాగైనా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కలెక్టర్ గాని చొరవ తీసుకొని వారికి బిల్లులు వచ్చే విధంగా చొరవ తీసుకొని వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకున్నారు కలెక్టర్కు ఇచ్చిన ప్రజావాణి . సంబంధిత అధికారులకు పత్రంలో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version