బాలాజీ టెక్నో స్కూల్లో ఎంఎస్ఎంఈ డే
నర్సంపేట నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు ఎంఎస్ఎం ఈ డే 2025 ఉద్యమి భారత్ కార్యక్రమం పాఠశాల ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వాలు సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ద్రవ్యల్బణం తగ్గి ఆర్థికంగా ఎదుగుతారని దీంతో ఆత్మనిర్భర్ భారత లక్ష్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ రంగాన్ని మరింత బలంగా పోటీ తత్వంతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా దృష్టి సారించాలని కోరారు. ప్రతి విద్యార్థి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి ,రామ్మూర్తి ,రాజేష్ ,లక్ష్మణ్ మరియు ఎన్.సి.సి క్యాడెట్లు పాల్గొన్నారు.