స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం గురువారం క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఎంఈవో లింగాల కుమారస్వామి తెలిపారు. మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పలు గ్రామాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీలు నిర్వహించి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో పోటీలు నిర్వహించమన్నారు. మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, సంతోష్. సుదర్శన్, అజయ్, శ్రావణి, ఉపాధ్యాయులు అంకుష్, మహేష్, ఎమ్మార్సీ సిబ్బంది వేణు, వసంత, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి
జహీరాబాద్ నేటి ధాత్రి:
బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్బుక్లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు..
*అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.
*వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు
*వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట( నేటిధాత్రి ):
shine junior college
నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు…
వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానన్నారు. స్థానిక దళిత, గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు. గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…
భూపాలపల్లి నేటిధాత్రి:
shine junior college
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు
చిట్యాల మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు బుధవారం 18వ తేదీన చిట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కన్వీనర్ కొడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలు) చిట్యాల మండలంలో ఉన్న బాల బాలికలు క్రీడా పాఠశాలలో 4వ తరగతి అడ్మిషన్ కొరకు 1 – 9 – 2016 నుండి 31 – 08 – 2017 మధ్యలో జన్మించిన బాల బాలికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలలో అడ్మిషన్ కొరకు చిట్యాల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని తెలపడం జరిగింది ఇది క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ క్రీడా పాఠశాలల అడ్మిషన్ల ఎంపికలో షటిల్ రన్, మెడిసిన్ బాల్, వర్టికల్ జంప్, 800 మీటర్ల పరుగు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఎత్తు మరియు బరువు విభాగాలలో పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తామని ఈ మండల స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల కోఆర్డినేటర్ సూదం సాంబమూర్తి ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్లు తీసుక రావాలి వివరాల కొరకు 9966992295 నెంబర్ లో సంప్రదించాలన్నారు
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారినీ వాసంతి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి టెంకాయ కొట్టి అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య పండితులు మంత్రాలు చదవగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.డి ఈ ఓ విద్యార్థులను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయడం జరిగింది.అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,భీముడి లక్ష్మి,తాళ్లపల్లి మంజుల, శీలం సరిత విద్యార్థులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డిఇఓ అక్షరం అంటే నశించనీదని,అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వీటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం అని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్య లభిస్తుందని,మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేపించాలని, చర్లపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని డిఇఓ మేడం అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కున్సోతు హనుమంతరావు సిఎంఓ బద్దం బాల్ రెడ్డి,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమా,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజ్ కుమార్,మేకల సత్యపాల్,ఐ ఆర్ టి రమేష్,అంగన్వాడీ టీచర్స్ బీమడి లక్ష్మీ, నందిపాటి సంధ్యా,తాళ్లపల్లి మంజుల,శీలం సరిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.
సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన…
ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ…
ఇంగ్లీష్ మీడియంలో బోధన…
పుష్టికరమైన మధ్యాహ్న భోజనం…
డిజిటల్ క్లాసు రూములు…
ఉచిత యూనిఫాం అందజేత
నేటి ధాత్రి గార్ల:
ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజ్ఞపాటవ పోటీలకు ఒత్తిడి లేని శిక్షణ ప్రభుత్వ బడులల్లో ఇస్తున్నట్లు ఎంపీడీవో మంగమ్మ, ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా పునః ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ,బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు.సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించాలని సూచించారు.నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రాథమిక పాఠశాల పెద్దకిష్టాపురం లో సు విశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు మరియు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేయడమే కాకుండా ఉచిత పాఠ్య పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.సర్కారు బడిలో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా ప్రగతిని అంచన వేస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూన్నట్లు తెలిపారు. గ్రామంలోని బడియిడు పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగుగులోత్ వీరభద్రం, బానోత్ చంద్రమోహన్, టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలోత్ శివ నాయక్,గంగావత్ రాంసింగ్ నాయక్,ఉపాధ్యాయులు బి. రామ, నాగేశ్వరావు,వేణుకుమార్, రాంబాబు,రాజ్ కుమార్, స్వాతి, మాలోత్ సురేష్, గంగావత్ సంత్ర, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత..
◆ చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
◆ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
◆ పుస్తకాల బరువు తగ్గించాలంటున్న వైద్యులు
◆ పట్టించుకోని విద్యా శాఖ అధికారులు
◆ నేలను చూస్తున్న పసి నడుములు
◆ బ్యాక్ పెయిన్ తో చిన్నారుల అవస్థలు
◆ వ్యాపారంగామారిన నోట్ పుస్తకాలు
◆ బాల్యంపై బరువు!
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి. పుస్తకాల బ్యాగు మోత.. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నది. తద్వారా చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు బ్యాగుల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల వయస్సుకు, తరగతులకు మించి పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 జూలై 19న విద్యాశాఖ జీవో నంబర్ 22 జారీ చేసింది. జీవోను పకడ్బందీగా అమలుచేయాలని ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల పరిధుల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. విద్యను వ్యాపారంగా మారుస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరానికి మించి పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
నిబంధనలు ఇవీ………
విద్యార్థుల బ్యాగు బరువుకు సంబంధించి గతేడాది విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ పాటించాలని ఆదేశించింది. 1, 2 తరగతులు చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు 1.5 కిలోల లోపు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతులకు 4 కిలోల లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల మెటీరియల్స్, సిలబస్ల పేరుతో పిల్లల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. జిల్లాలో పలు స్కూళ్లు పలు అంతస్తుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు బ్యాగులు మోస్తూ పైఅంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపైన భారం పడుతున్నది. పలు సమావేశాల్లో బ్యాగుల భారం తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.
లెక్కకు మించి బుక్స్…….
ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్ ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారు. ప్రతి రోజూ ఆయా సబ్జెక్టులు చెప్పనప్పటికీ విద్యార్థులు ప్రతి రోజూ అన్ని పుస్తకాలను మోసుకెళ్తున్నారు. విద్యార్థుల బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థికి 3 కిలోల బ్యాగు ఉండాలని. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే పుస్తకాల బరువు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఇలా ఏ తరగతి విద్యార్థిలను తీసుకున్నా పరిమితికి మించి బ్యాగులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో సబ్జెక్ట్ వారీగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. తమ స్కూల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సూచిస్తుండడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అధిక బరువు ఉన్న బ్యాగులు మోయడం ద్వారా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు మెడ, భుజాలు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
పిల్లల ఎదుగుదల పై ప్రభావం పడుతుంది……
విద్యార్థులు అధిక బరువులు మోయడం ద్వారా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారుల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా బ్యాగులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఎక్కువ పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తల్లిదండ్రులు………
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై బ్యాగుల భారం వేయవద్దని గతంలోనే సూచనలు చేశాం. ఏ తరగతి విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలో స్పష్టంగా సూచించాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్ అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్ అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యురాలు శ్రీలత బడిబాట కార్యక్రమం కరపత్రం ఆవిష్క రించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు.
అనంతరం శాయంపేట కూడలి వద్ద ఉపాధ్యాయులతో కలిసి ప్రధానోపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల బలోపే తం గూర్చి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానో పాధ్యా యురాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తు న్నామని ప్రభుత్వం విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు అంది స్తూ భోజన సౌకర్యం కల్పిస్తుం దన్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
Govt Schools Principal Srilatha.
అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో 2025 ఎస్ ఎస్ సి ఫలితా లు అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన అక్షయ,సాయి,ఎండి.
అమ్రీన్ లకుప్రధానోపాధ్యాయు రాలు టి.శ్రీలత ప్రశంసా పత్రా లు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు శేఖర్ బాబు, సుజాత , లక్ష్మీబాయి ,రేణుక ,గీత, కుమారస్వామి, రంజిత్ కుమార్, విజయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కొండూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత మాట్లాడుతూ పాఠశాలలో మంచి నైపుణ్యము, ఉన్నత విద్యార్హతలు కల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు అన్ని విధాల విద్యా సంబంధమైన విషయాలు, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుటకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తూ వారు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా అన్ని విధాల వారికి సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రఘు, నాగరాజు, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్యా నాయక్, స్వామి, అమర స్వర్ణ, శివకృష్ణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, రజినీకాంత్, అనిత, గౌతమిలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం
జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధన వసతులు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలి
బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదు చేయాలి
ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలు వసతులు తల్లిదండ్రులకు తెలియచేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తేదీ జూన్ 6 నుండి 19 వరకు జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాల, బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఆయా ఏఎన్ఎం వివోఏలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యా బోధన, వసతులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వివిధ పోటీ పరీక్షలు జేఈఈ నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు.
School Walk Program
జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, పిల్లలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ శేషాద్రి, జిల్లా వైద్య అధికారి రజిత ,విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాదులోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై బెస్ట్ ప్రాక్టీస్ నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు న్యాల్ కల్ మండల రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు తెలిపారు. వీరి ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర పర్సన్ గా ఉన్న కమిటీ జిల్లా నుండి నలుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది, అందులో ఒకరు సఫియా సుల్తానా ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 4వ తేదీన ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాధికారులు మరియు మల్టీజ్జోన్ కి సంబంధించిన అన్ని జిల్లాల ఎంఈఓ మీటింగ్లో వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న న్యాల్ కల్ మండల విద్యాధికారి మారుతి రాథోడ్ అదేవిధంగా మండల ఉపాధ్యాయులు సఫియా సుల్తాన్ గారికి అభినందించారు.
కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు
జైపూర్,నేటి ధాత్రి:
కిష్టాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం బడిబాట చేపట్టిన అధికారులు.స్కూలు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పి పిస్తున్న సౌకర్యాలను అవకాశాలను తెలియజేస్తూ నాణ్యమైన విద్య పిల్లలకి అందించాలని తల్లిదండ్రులు ఆర్థిక భారానికి లోను కాకూడదని ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.అలాగే గ్రామపంచాయతీలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ,శ్రీపతి బాపురావు, ఇరిగేషన్ డిఈ విద్యాసాగర్ రావు,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి,ఉపాధ్యాయులు కవిత,రజిత,అంగన్వాడీ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా
సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
వర్ధన్నపేట( నేటిదాత్రి ):
పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు, వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.